గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ విమానంలో ఇద్దరు పైలట్లు,10 మంది విమాన సిబ్బంది, ప్రయాణికులు 242 మంది ఉన్నారు. అయితే, ఆ ప్రయాణికులలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నారని తెలుస్తోంది. ఈ ప్రకారం రూపానీ పేరు ఉన్న ఎయిరిండియా విమానం ప్యాసెంజర్ లిస్ట్ ఒకటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. రూపానీతోపాటు పలువురు రాజకీయ నాయకులు, వీఐపీలు ఆ విమానంలో లండన్ కు ప్రయాణిస్తున్నారని తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
విమానం ఎక్కారని ఎయిరిండియా సిబ్బంది కన్ఫర్మ్ చేసిన జాబితాలో రూపానీ పేరు ఉంది. ఆయన ఈ రోజు మధ్యాహ్నం 12.10కి బోర్డింగ్ చేసినట్లు ఆ జాబితాలో ఉంది. లండన్ లో నివసిస్తున్న తన కుమార్తెను చూసేందుకు రూపానీ వెళుతున్నట్లు తెలుస్తోంది. అయితే, రూపానీ గాయపడ్డారా లేదా? ఆయన ఎలా ఉన్నారు? ఎక్కడ ఉన్నారు అన్న సమాచారం తెలియాల్సి ఉంది. 2016 నుంచి 2021 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత రూపానీ పనిచేశారు.
మరోవైపు, ఈ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే క్రాష్ ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు టేకాఫ్ అయిన విమానం..1.35కు క్రాష్ ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది. ఈ విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, ఏడుగురు పోర్చుగల్ పౌరులు, ఒక కెనడా పౌరుడు ఉన్నట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్ కు ఈ విమానం వెళుతుండగా ప్రమాదం జరిగింది.
This post was last modified on June 12, 2025 4:42 pm
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…
ఇది జెన్ జీ కాలం. తప్పు ఎవరు చేసినా వదిలేదన్న రీతిలో నేటి యువత సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన…