Trends

విమాన ప్రమాదంలో మాజీ సీఎం

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ విమానంలో ఇద్దరు పైలట్లు,10 మంది విమాన సిబ్బంది, ప్రయాణికులు 242 మంది ఉన్నారు. అయితే, ఆ ప్రయాణికులలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నారని తెలుస్తోంది. ఈ ప్రకారం రూపానీ పేరు ఉన్న ఎయిరిండియా విమానం ప్యాసెంజర్ లిస్ట్ ఒకటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. రూపానీతోపాటు పలువురు రాజకీయ నాయకులు, వీఐపీలు ఆ విమానంలో లండన్ కు ప్రయాణిస్తున్నారని తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

విమానం ఎక్కారని ఎయిరిండియా సిబ్బంది కన్ఫర్మ్ చేసిన జాబితాలో రూపానీ పేరు ఉంది. ఆయన ఈ రోజు మధ్యాహ్నం 12.10కి బోర్డింగ్ చేసినట్లు ఆ జాబితాలో ఉంది. లండన్ లో నివసిస్తున్న తన కుమార్తెను చూసేందుకు రూపానీ వెళుతున్నట్లు తెలుస్తోంది. అయితే, రూపానీ గాయపడ్డారా లేదా? ఆయన ఎలా ఉన్నారు? ఎక్కడ ఉన్నారు అన్న సమాచారం తెలియాల్సి ఉంది. 2016 నుంచి 2021 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత రూపానీ పనిచేశారు.

మరోవైపు, ఈ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే క్రాష్ ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు టేకాఫ్ అయిన విమానం..1.35కు క్రాష్ ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది. ఈ విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, ఏడుగురు పోర్చుగల్ పౌరులు, ఒక కెనడా పౌరుడు ఉన్నట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్ కు ఈ విమానం వెళుతుండగా ప్రమాదం జరిగింది.

This post was last modified on June 12, 2025 4:42 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Vijay rupani

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

3 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago