భారత్లో టెస్లా ఫ్యాక్టరీ వచ్చే అవకాశం లేదంటూ కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి కేంద్రం ప్రోత్సాహక పథకాలు అందిస్తున్నా కూడా, టెస్లా మాత్రం ఎలాంటి ఉత్సాహం చూపడం లేదని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా టెస్లా షోరూమ్లు మాత్రం త్వరలో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈవీ పరిశ్రమ అభివృద్ధిపై నిర్వహించిన మీడియా సమావేశంలో కుమారస్వామి మాట్లాడుతూ, టెస్లా ఈవీ తయారీకి ముందుగా ఉన్నట్టు ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదని చెప్పారు. ఒక్కసారి చర్చలకు హాజరైన టెస్లా ప్రతినిధులు, ఆపై సమావేశాల్లో కనిపించకపోవడమే దీనికి నిదర్శనమని అన్నారు. ఇది టెస్లా ఉద్దేశ్యం పూర్తిగా మార్కెట్ ప్రాబల్యాన్ని పెంచడమేనని చెబుతోంది.
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గత ఏడాది భారత్కు రావాల్సి ఉండగా, చివరి నిమిషంలో తన పర్యటనను రద్దు చేయడం కలకలం రేపింది. అప్పట్నుంచి ఫ్యాక్టరీ ఏర్పాటు అంశం నిలిచిపోయింది. అయితే, టెస్లా వాహనాలను ఇంపోర్ట్ చేసి భారత మార్కెట్లో అమ్మే ప్రణాళిక మాత్రం కొనసాగుతుంది. ఇందులో భాగంగా ప్రముఖ నగరాల్లో షోరూమ్లు ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.
ఇదిలా ఉండగా, మస్క్ భారత్లో ఫ్యాక్టరీ పెట్టడాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. అమెరికా వ్యాపారాలకు నష్టం కలిగించే నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డారు. మోదీ-మస్క్ భేటీ, వాణిజ్య ఒప్పందాల నేపథ్యం కూడా అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. మొత్తానికి.. భారత మార్కెట్ను క్యాష్ చేసుకోవాలన్న టెస్లా లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ‘ఇక్కడ తయారీ.. అక్కడ అమ్మకం’ అనే ఫార్ములా భారత్కు ఎంతవరకు ఉపయోగకరమో అనేది సందేహమే. దీన్ని కేంద్రం ఎలా సమన్వయ పరుస్తుందో చూడాలి.
This post was last modified on June 2, 2025 6:39 pm
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…
ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…