Trends

ఇండియాలో టెస్లా ఉంటుంది.. కానీ..

భారత్‌లో టెస్లా ఫ్యాక్టరీ వచ్చే అవకాశం లేదంటూ కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి కేంద్రం ప్రోత్సాహక పథకాలు అందిస్తున్నా కూడా, టెస్లా మాత్రం ఎలాంటి ఉత్సాహం చూపడం లేదని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా టెస్లా షోరూమ్‌లు మాత్రం త్వరలో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఈవీ పరిశ్రమ అభివృద్ధిపై నిర్వహించిన మీడియా సమావేశంలో కుమారస్వామి మాట్లాడుతూ, టెస్లా ఈవీ తయారీకి ముందుగా ఉన్నట్టు ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదని చెప్పారు. ఒక్కసారి చర్చలకు హాజరైన టెస్లా ప్రతినిధులు, ఆపై సమావేశాల్లో కనిపించకపోవడమే దీనికి నిదర్శనమని అన్నారు. ఇది టెస్లా ఉద్దేశ్యం పూర్తిగా మార్కెట్ ప్రాబల్యాన్ని పెంచడమేనని చెబుతోంది.

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గత ఏడాది భారత్‌కు రావాల్సి ఉండగా, చివరి నిమిషంలో తన పర్యటనను రద్దు చేయడం కలకలం రేపింది. అప్పట్నుంచి ఫ్యాక్టరీ ఏర్పాటు అంశం నిలిచిపోయింది. అయితే, టెస్లా వాహనాలను ఇంపోర్ట్ చేసి భారత మార్కెట్‌లో అమ్మే ప్రణాళిక మాత్రం కొనసాగుతుంది. ఇందులో భాగంగా ప్రముఖ నగరాల్లో షోరూమ్‌లు ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.

ఇదిలా ఉండగా, మస్క్ భారత్‌లో ఫ్యాక్టరీ పెట్టడాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. అమెరికా వ్యాపారాలకు నష్టం కలిగించే నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డారు. మోదీ-మస్క్ భేటీ, వాణిజ్య ఒప్పందాల నేపథ్యం కూడా అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. మొత్తానికి.. భారత మార్కెట్‌ను క్యాష్ చేసుకోవాలన్న టెస్లా లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ‘ఇక్కడ తయారీ.. అక్కడ అమ్మకం’ అనే ఫార్ములా భారత్‌కు ఎంతవరకు ఉపయోగకరమో అనేది సందేహమే. దీన్ని కేంద్రం ఎలా సమన్వయ పరుస్తుందో చూడాలి.

Kumar

Recent Posts

లవ్ స్టోరీ భయపడాల్సిన పని లేదు

ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…

36 minutes ago

అయ్యగారి జోరు అదిరింది

పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…

2 hours ago

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

3 hours ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

4 hours ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

5 hours ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

11 hours ago