Trends

ఇండియాలో టెస్లా ఉంటుంది.. కానీ..

భారత్‌లో టెస్లా ఫ్యాక్టరీ వచ్చే అవకాశం లేదంటూ కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి కేంద్రం ప్రోత్సాహక పథకాలు అందిస్తున్నా కూడా, టెస్లా మాత్రం ఎలాంటి ఉత్సాహం చూపడం లేదని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా టెస్లా షోరూమ్‌లు మాత్రం త్వరలో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఈవీ పరిశ్రమ అభివృద్ధిపై నిర్వహించిన మీడియా సమావేశంలో కుమారస్వామి మాట్లాడుతూ, టెస్లా ఈవీ తయారీకి ముందుగా ఉన్నట్టు ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదని చెప్పారు. ఒక్కసారి చర్చలకు హాజరైన టెస్లా ప్రతినిధులు, ఆపై సమావేశాల్లో కనిపించకపోవడమే దీనికి నిదర్శనమని అన్నారు. ఇది టెస్లా ఉద్దేశ్యం పూర్తిగా మార్కెట్ ప్రాబల్యాన్ని పెంచడమేనని చెబుతోంది.

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గత ఏడాది భారత్‌కు రావాల్సి ఉండగా, చివరి నిమిషంలో తన పర్యటనను రద్దు చేయడం కలకలం రేపింది. అప్పట్నుంచి ఫ్యాక్టరీ ఏర్పాటు అంశం నిలిచిపోయింది. అయితే, టెస్లా వాహనాలను ఇంపోర్ట్ చేసి భారత మార్కెట్‌లో అమ్మే ప్రణాళిక మాత్రం కొనసాగుతుంది. ఇందులో భాగంగా ప్రముఖ నగరాల్లో షోరూమ్‌లు ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.

ఇదిలా ఉండగా, మస్క్ భారత్‌లో ఫ్యాక్టరీ పెట్టడాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. అమెరికా వ్యాపారాలకు నష్టం కలిగించే నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డారు. మోదీ-మస్క్ భేటీ, వాణిజ్య ఒప్పందాల నేపథ్యం కూడా అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. మొత్తానికి.. భారత మార్కెట్‌ను క్యాష్ చేసుకోవాలన్న టెస్లా లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ‘ఇక్కడ తయారీ.. అక్కడ అమ్మకం’ అనే ఫార్ములా భారత్‌కు ఎంతవరకు ఉపయోగకరమో అనేది సందేహమే. దీన్ని కేంద్రం ఎలా సమన్వయ పరుస్తుందో చూడాలి.

Kumar

Recent Posts

ఎక్కడ చూసినా GV ప్రకాష్ సంగీతమే

టాలీవుడ్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న సంగీత దర్శకులు ఎవరయ్యా అంటే ముందు వినిపించే పేరు తమన్. అది నిజం…

40 seconds ago

ప్రెగ్నెంట్ అన్నారు… క్రేజీ మూవీ చేస్తోంది

టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌…

3 hours ago

మృణాల్… ఫ్లాపులు కూడా తాకలేని అందం

టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…

4 hours ago

కొరియన్ మార్కెట్ పై వంగా డార్క్ స్ట్రాటజీ?

పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…

6 hours ago

‘ఓం’ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు

ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…

10 hours ago

ఆ నిర్మాతకు మళ్లీ జాక్‌పాటేనా?

తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…

10 hours ago