Trends

ఇండియాలో టెస్లా ఉంటుంది.. కానీ..

భారత్‌లో టెస్లా ఫ్యాక్టరీ వచ్చే అవకాశం లేదంటూ కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి కేంద్రం ప్రోత్సాహక పథకాలు అందిస్తున్నా కూడా, టెస్లా మాత్రం ఎలాంటి ఉత్సాహం చూపడం లేదని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా టెస్లా షోరూమ్‌లు మాత్రం త్వరలో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఈవీ పరిశ్రమ అభివృద్ధిపై నిర్వహించిన మీడియా సమావేశంలో కుమారస్వామి మాట్లాడుతూ, టెస్లా ఈవీ తయారీకి ముందుగా ఉన్నట్టు ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదని చెప్పారు. ఒక్కసారి చర్చలకు హాజరైన టెస్లా ప్రతినిధులు, ఆపై సమావేశాల్లో కనిపించకపోవడమే దీనికి నిదర్శనమని అన్నారు. ఇది టెస్లా ఉద్దేశ్యం పూర్తిగా మార్కెట్ ప్రాబల్యాన్ని పెంచడమేనని చెబుతోంది.

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గత ఏడాది భారత్‌కు రావాల్సి ఉండగా, చివరి నిమిషంలో తన పర్యటనను రద్దు చేయడం కలకలం రేపింది. అప్పట్నుంచి ఫ్యాక్టరీ ఏర్పాటు అంశం నిలిచిపోయింది. అయితే, టెస్లా వాహనాలను ఇంపోర్ట్ చేసి భారత మార్కెట్‌లో అమ్మే ప్రణాళిక మాత్రం కొనసాగుతుంది. ఇందులో భాగంగా ప్రముఖ నగరాల్లో షోరూమ్‌లు ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.

ఇదిలా ఉండగా, మస్క్ భారత్‌లో ఫ్యాక్టరీ పెట్టడాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. అమెరికా వ్యాపారాలకు నష్టం కలిగించే నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డారు. మోదీ-మస్క్ భేటీ, వాణిజ్య ఒప్పందాల నేపథ్యం కూడా అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. మొత్తానికి.. భారత మార్కెట్‌ను క్యాష్ చేసుకోవాలన్న టెస్లా లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ‘ఇక్కడ తయారీ.. అక్కడ అమ్మకం’ అనే ఫార్ములా భారత్‌కు ఎంతవరకు ఉపయోగకరమో అనేది సందేహమే. దీన్ని కేంద్రం ఎలా సమన్వయ పరుస్తుందో చూడాలి.

This post was last modified on June 2, 2025 6:39 pm

Share

Recent Posts

హాలీవుడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు

ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…

2 hours ago

గండాన్ని దాటిన చెన్నై లవ్ స్టోరీ

గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…

2 hours ago

మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…

2 hours ago

కనకరాజు సీమలో కొరియన్ దెయ్యం

బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…

3 hours ago

“కొబ్బరికాయ కొట్టాం… గుమ్మడి కాయ కట్టాం”

ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…

3 hours ago

దేశం కోసం కష్టపడే ప్రధాని మోదీపై విమర్శలా

జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…

4 hours ago