ఆఖరి వరకూ ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ఐపీఎల్ 2025 క్వాలిఫయర్-2 పోరులో ముంబయి ఇండియన్స్ ఓటమి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. మరీ ముఖ్యంగా, శ్రేయస్ అయ్యర్ పంజాబ్ తరఫున అసాధారణ ఇన్నింగ్స్ ఆడి ముంబయిని ఇంటికే పంపేసిన తర్వాత, అంబానీ కుటుంబం నుంచి వచ్చిన రియాక్షన్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో నితా అంబానీ ముఖభావాలు ప్రత్యేకంగా చర్చకు వస్తున్నాయి. మ్యాచ్ సందర్భంగా ఆమె స్టేడియంలో ముంబయి జెర్సీలో కనిపించగా, చివర్లో అయ్యర్ కూల్ గా గేమ్ను పంజాబ్కు కట్టబెట్టిన తరుణంలో ఆమె హావభావాల తీరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
“అయ్యర్ సిక్సర్ కొట్టినప్పుడు ఆమె కళ్లలో షాక్ స్పష్టంగా కనిపించింది” అని నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ఈ దృశ్యం మీద ఎన్నో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. మరోవైపు పంజాబ్ రాణి ప్రీతి జింతా మాత్రం ఎగిరి గంతేసింది. ఆ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.
26 కోట్లతో కొనుగోలు చేసిన శ్రేయస్ అయ్యర్ ఈ భారీ ఒప్పందానికి న్యాయం చేస్తూ ఫైనల్కు పంజాబ్ను తీసుకెళ్లడం నిజంగా రేర్ అండ్ స్పెషల్ మూడ్. ఒక్కడే మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అయ్యాడు. ఇక అంబానీ రాణి షాక్ అవడం కూడా అందుకే న్యూస్ అయ్యింది. ఇక ఈ మ్యాచ్తో పంజాబ్ ఐతే మొదటిసారి ట్రోఫీకి దగ్గరైంది. మరోవైపు బెంగుళూరు కూడా ఫైనల్ లో గెలిచి మొదటిసారి ట్రోపీ అందుకోవాలని చూస్తోంది. మరి ఇది ఎంతవరకు సాధ్యం అవుతుందో చూడాలి.
This post was last modified on June 2, 2025 11:03 am
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…
ఇప్పటి జనరేషన్ కు పరిచయం లేదు కానీ నవీన్ వడ్డే హీరోగా ఒకప్పుడు మంచి మార్కెట్ ఎంజాయ్ చేశాడు. పెళ్లి,…
కెరీర్ ఆరంభం చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ చేసిన విజయ్ సేతుపతి.. ఇప్పుడు ఎంత పెద్ద రేంజికి ఎదిగిపోయాడో తెలిసిందే.…
భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.…
నేచురల్ స్టార్ నాని కేవలం నటుడిగానే కాకుండా 'వాల్ పోస్టర్ సినిమా' బ్యానర్పై నిర్మాతగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన…
టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో క్రిష్ ఎన్నడూ రొటీన్ సినిమా…