ఆఖరి వరకూ ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ఐపీఎల్ 2025 క్వాలిఫయర్-2 పోరులో ముంబయి ఇండియన్స్ ఓటమి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. మరీ ముఖ్యంగా, శ్రేయస్ అయ్యర్ పంజాబ్ తరఫున అసాధారణ ఇన్నింగ్స్ ఆడి ముంబయిని ఇంటికే పంపేసిన తర్వాత, అంబానీ కుటుంబం నుంచి వచ్చిన రియాక్షన్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో నితా అంబానీ ముఖభావాలు ప్రత్యేకంగా చర్చకు వస్తున్నాయి. మ్యాచ్ సందర్భంగా ఆమె స్టేడియంలో ముంబయి జెర్సీలో కనిపించగా, చివర్లో అయ్యర్ కూల్ గా గేమ్ను పంజాబ్కు కట్టబెట్టిన తరుణంలో ఆమె హావభావాల తీరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
“అయ్యర్ సిక్సర్ కొట్టినప్పుడు ఆమె కళ్లలో షాక్ స్పష్టంగా కనిపించింది” అని నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ఈ దృశ్యం మీద ఎన్నో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. మరోవైపు పంజాబ్ రాణి ప్రీతి జింతా మాత్రం ఎగిరి గంతేసింది. ఆ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.
26 కోట్లతో కొనుగోలు చేసిన శ్రేయస్ అయ్యర్ ఈ భారీ ఒప్పందానికి న్యాయం చేస్తూ ఫైనల్కు పంజాబ్ను తీసుకెళ్లడం నిజంగా రేర్ అండ్ స్పెషల్ మూడ్. ఒక్కడే మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అయ్యాడు. ఇక అంబానీ రాణి షాక్ అవడం కూడా అందుకే న్యూస్ అయ్యింది. ఇక ఈ మ్యాచ్తో పంజాబ్ ఐతే మొదటిసారి ట్రోఫీకి దగ్గరైంది. మరోవైపు బెంగుళూరు కూడా ఫైనల్ లో గెలిచి మొదటిసారి ట్రోపీ అందుకోవాలని చూస్తోంది. మరి ఇది ఎంతవరకు సాధ్యం అవుతుందో చూడాలి.
This post was last modified on June 2, 2025 11:03 am
సహజంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తారు. ముందు మాటలతో.. తర్వాత తమదైన లాఠీ శైలితోనూ…
ఒక ఊరు నుంచి మరో ఊరుకు జాతీయ రహదారి(హైవే)పై ప్రయాణించే సమయంలో టోల్ గేట్లు దాటడం తప్పనిసరి. ఈ టోల్…
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…