Trends

పంజాబ్ కింగ్స్.. భారీ పెట్టుబడి వృధా కాలేదు

ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ ఒక రివైవల్ చరిత్రను రాసింది. మెగా వేలంలో భారీగా పెట్టుబడి పెట్టిన ఫలితం ఇప్పుడు అందరికీ కనపడుతోంది. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ను రూ.26.75 కోట్లకు కొనుగోలు చేయడం పెద్ద సంచలనం అయ్యింది. అలాగే ప్రధాన బౌలర్ ఆర్షదీప్ సింగ్‌ను రూ.18 కోట్లకు రీటైన్ చేయడం కూడా కీలక నిర్ణయం. ఇప్పుడు ఆ ఇద్దరూ తమ విలువను అసాధారణంగా నిరూపించారు.

అయ్యర్ క్వాలిఫయర్-2లో ముంబయిని చిత్తుచేసే విజయానికి నిలయమయ్యాడు. ఓపెనింగ్ నుంచి ఆఖరి వరకు క్రీజులో నిలబడి 87 పరుగులు చేసి, విజయం దిశగా జట్టును నడిపించాడు. అతడి బ్యాటింగ్‌లో కనిపించిన పట్టుదల, శాంతంగా ఉండే తీరు, ఆపదలోనూ ఆత్మవిశ్వాసం కలిగిన కెప్టెన్సీ.. ఇవన్నీ పంజాబ్ కింగ్స్‌కు ధైర్యాన్ని ఇచ్చాయి. ఐపీఎల్ చరిత్రలో మూడు వేర్వేరు జట్లను ఫైనల్‌కు తీసుకెళ్లిన ఏకైక కెప్టెన్‌గా కూడా శ్రేయస్ నిలిచాడు.

మరోవైపు ఆర్షదీప్ సింగ్ తన బౌలింగ్‌తో కీలక వికెట్లు తీయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఎప్పుడైతే ప్రెషర్ సీన్ వస్తే.. అప్పుడు ఆర్షదీప్ బౌలింగ్ చేయడం పంజాబ్ స్ట్రాటజీగా మారింది. అతని యార్కర్స్, డెత్ ఓవర్లలోని కంట్రోల్.. మ్యాచులు తిరిగేలా చేస్తున్నాయి. ఇలా ఒక దశలో ఆర్షదీప్ వైపు కోచ్, కెప్టెన్ కూడా ఫుల్ ట్రస్ట్ పెట్టారు. రూ.18 కోట్లకు రీటైన్ చేసిన ఆర్షదీప్ ఆ మొత్తం విలువను ఇప్పుడు న్యాయం చేస్తున్నాడు.

చాహల్ గాయం కారణంగా ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేకపోయినప్పటికీ, జట్టులో అతని ఉనికి కీలకం. అతని అనుభవం, మార్గదర్శకత యంగ్ బౌలర్లకు శ్రేయస్ కంటే తక్కువ కాదు. ఒకసారి ఫిట్ అయితే, ఫైనల్ వంటి హై ప్రెజర్ మ్యాచ్‌లో అతని స్పిన్ అనుభవం పంజాబ్‌కు అదనపు బలం. మొత్తంగా చూస్తే, పంజాబ్ యాజమాన్యం పెట్టిన భారీ ఖర్చు ఇప్పుడు ఫలితాలివ్వడమే కాదు, టైటిల్‌కు దగ్గరగా తీసుకువెళ్తోంది. శ్రేయస్, ఆర్షదీప్, చాహల్ లాంటి ప్లేయర్లను స్ట్రాటజిక్‌గా ఎంపిక చేయడం… ప్లే ఆఫ్ స్టేజ్‌లో బలంగా నిలబడేందుకు మూల కారణం. ఇప్పుడు వాళ్ల కష్టానికి, క్లాస్‌కు ఫలితం ఇవ్వాల్సిన సమయం వచ్చింది.

This post was last modified on June 2, 2025 10:14 am

Share

Recent Posts

బెత్లేహెమ్ కుటుంబం కనెక్ట్ అవుతుందా

మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…

6 minutes ago

మ‌ళ్లీ కౌంటింగ్ చేపట్టాలి: ఓట‌మిపై కోర్టుకు స్టాలిన్‌

త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌.. మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ ఏడాది మార్చిలో జ‌రిగిన అసెంబ్లీ…

19 minutes ago

అల్లరోడి వింటేజ్ కామెడీకి పెద్ద పరీక్ష

చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…

1 hour ago

రవితేజ అసలు భూమి మీద ఆగట్లేదుగా…

‘ఇరుముడి’ సక్సెస్ మీట్‌లో రవితేజ ఎంట్రీ చూసిన వాళ్లకు ఒక విషయం వెంటనే అర్థమైపోతుంది. నార్మల్ గా ఎప్పుడూ నవ్వుతూ,…

3 hours ago

ఆంధ్రా పాపకార్న్… నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్!

పాప్ కార్న్‌.. ఈ పేరు తెలియ‌ని వారు ఉండ‌రు. కాల‌క్షేపం కోసం తినే ఈ పాప్ కార్న్.. మొక్క‌జొన్న లోని…

3 hours ago

ఆదర్శ కుటుంబం ఇంక ఆలస్యం చేయొద్దు

ఆగస్ట్ నెల దాదాపు అయిపో వచ్చింది. ఆదర్శ కుటుంబం విడుదల అక్కడి నుంచి కేవలం ఒక నెల రోజులు మాత్రమే…

3 hours ago