ఐపీఎల్ 2025 సీజన్ ఇప్పుడు మరువలేని ఓ ఫైనల్కు సాక్ష్యం ఇవ్వబోతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (RCB) Vs పంజాబ్ కింగ్స్ (PBKS) ఫైనల్ మ్యాచ్ ఈసారి ఇరు వర్గాల అభిమానులకి నిజంగా గుండెలు బరువు చేసే మ్యాచ్గా మారింది. ఇన్నేళ్లుగా టైటిల్ సాధించలేకపోయిన రెండు జట్లూ.. ఒకే లక్ష్యంతో తలపడనున్నాయి. ఇది గోల్డెన్ ఛాన్స్.
RCB ఇప్పటివరకు మూడు సార్లు ఫైనల్ చేరిన జట్టు. 2009లో డెక్కన్ ఛార్జర్స్ చేతిలో ఓటమి, 2011లో చెన్నై చేతిలో ఓటమి, 2016లో సన్రైజర్స్ చేతిలో ఓటమి ఎదురైంది. మూడు సార్లు టైటిల్ అందుబాటులోకి వచ్చి చేజారిన బలమైన జ్ఞాపకాలతో ఈసారి నాలుగోసారి ఫైనల్కు చేరింది. ఇక విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఈసారి కప్ మాత్రం మనదే అనే నినాదంతో సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.
మరోవైపు పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు కేవలం ఒకసారి మాత్రమే ఫైనల్కు చేరింది.. అది 2014లో. అప్పుడు కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడింది. ఆ తర్వాత ఎన్నో మార్పులు చేసినా టైటిల్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది. ఈసారి మాత్రం శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో జట్టు కొత్త ఉత్సాహంతో ఆడుతోంది. క్వాలిఫయర్-2లో ముంబైని ఓడించి RCBపై రివెంజ్ తీర్చుకోవాలన్న సంకల్పంతో ఉన్నారు.
ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఇప్పటికే RCB క్వాలిఫయర్ మ్యాచ్లో పంజాబ్ను ఓడించింది. ఇప్పుడు అదే జట్ల మధ్య రీమాచ్ జరగనుంది. దీంతో పంజాబ్ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. అలాగే బెంగుళూరు మాత్రం ఈసారి తప్పకుండా ట్రోఫీ గెలవాలనుకుంటోంది. రెండు యుద్ధాల మధ్య ఎవరి ఆశ నెరవేరుతుందనేది చూడాలి. ఈ రెండు జట్లకి ఇది బెస్ట్ ఛాన్స్. రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కోసం, ఫ్రాంచైజీ గౌరవం కోసం, ఆటగాళ్ల గుండెతాడిపై నిలిచిన కల కోసం ఈ పోరు జరగబోతోంది. IPL చరిత్రలో ఇది ప్రత్యేకంగా నిలిచిపోతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…
టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…