Movie News

ధనుష్ వార్నింగ్ ఇచ్చింది ఎవరికి

నిన్న చెన్నైలో జరిగిన కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ధనుష్ ప్రసంగం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మాములుగా చాలా సామ్యంగా మాట్లాడే ఇతన్ని అభిమానులైనా సరే కోపంతో ఉన్నప్పుడు చూసిన సందర్భాలు చాలా తక్కువ. ప్రశాంతమైన వదనంతో ఎప్పుడు నవ్వుతూ ఉండటమే ధనుష్ స్టైల్. కానీ దానికి భిన్నంగా నిన్న బలమైన సెటైర్లతో విరుచుకుపడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. గతంలో ఏ వేడుకలోనూ ఈ విలక్షణ నటుడు ఇంతగా ఫైర్ కావడం చూడలేదని ఫ్యాన్స్ అంటున్నారు. కేకలు పెట్టకపోయినా సెటిల్డ్ టోన్ లో ధనుష్ అన్న మాటలు సినిమాటిక్ ఎలివేషన్ ని మించిన ఫీలింగ్ ఇచ్చాయి..

ఇంతకీ ధనుష్ ఏమన్నాడో చూద్దాం. “నాపై మీరు ఎంత నెగటివ్ ప్రచారమైనా చేసుకోండి. నా సినిమాలు రిలీజ్ ఉన్న ప్రతిసారి నెల రెండు నెలల ముందు ఏదో ఒక వివాదం సృష్టించి నాపై బురద జల్లాలని చూస్తున్నారు. కానీ అవేవి పనిచేయవు. 23 సంవత్సరాలుగా అభిమానులు నా వెన్నంటే ఉన్నారు. నన్ను అడ్డుకోవాలనుకోవడం మీ మూర్ఖత్వం. అలాంటి సర్కస్ లు చేయాలనే ఆలోచన ఉంటే పక్కకెళ్లి ఆడుకోండి. మంచి భోజనం చేస్తే చాలు సంతోషంగా అనిపించే మనస్తత్వం నాది. తప్పుడు మాటలతో నన్నేం చేయలేరు. ఫ్యాన్సే కాదు ప్రేక్షకులూ నా వెంట ఉన్నారు. అందరూ ఆనందంగా ఉందాం”. ఇదండీ సారాంశం.

ధనుష్ ఎవరిని ఉద్దేశించి అన్నాడో పేర్లను ప్రస్తావించలేదు కానీ ఆ మధ్య నయనతార వివాదం కోర్ట్ దాకా వెళ్ళినప్పుడు సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరిగాయి. వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా ఏవేవో కథనాలు అల్లారు. రాయన్, కెప్టెన్ మిల్లర్ టైంలో కావాలని కొందరు నెగటివ్ పబ్లిసిటీ చేయడం గురించి ఫ్యాన్స్ ధనుష్ దృష్టికి నేరుగా తీసుకెళ్లారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒకేసారి అందరికీ వార్నింగ్ ఇచ్చినట్టు అయ్యిందని వాళ్ళు భావిస్తున్నారు. మొత్తానికి స్టేజి మీద ఎప్పుడూ సాఫ్ట్ అండ్ స్మూత్ గా కనిపించే ధనుష్ ఎట్టకేలకు తనలో మరోవైపుని పబ్లిక్ గా పరిచయం చేశాడు.

Satya

Recent Posts

జూన్ చివరి వారం… రీ రిలీజుల అర్పణం

అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…

2 hours ago

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

6 hours ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

9 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

9 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

10 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

13 hours ago