నిన్న చెన్నైలో జరిగిన కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ధనుష్ ప్రసంగం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మాములుగా చాలా సామ్యంగా మాట్లాడే ఇతన్ని అభిమానులైనా సరే కోపంతో ఉన్నప్పుడు చూసిన సందర్భాలు చాలా తక్కువ. ప్రశాంతమైన వదనంతో ఎప్పుడు నవ్వుతూ ఉండటమే ధనుష్ స్టైల్. కానీ దానికి భిన్నంగా నిన్న బలమైన సెటైర్లతో విరుచుకుపడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. గతంలో ఏ వేడుకలోనూ ఈ విలక్షణ నటుడు ఇంతగా ఫైర్ కావడం చూడలేదని ఫ్యాన్స్ అంటున్నారు. కేకలు పెట్టకపోయినా సెటిల్డ్ టోన్ లో ధనుష్ అన్న మాటలు సినిమాటిక్ ఎలివేషన్ ని మించిన ఫీలింగ్ ఇచ్చాయి..
ఇంతకీ ధనుష్ ఏమన్నాడో చూద్దాం. “నాపై మీరు ఎంత నెగటివ్ ప్రచారమైనా చేసుకోండి. నా సినిమాలు రిలీజ్ ఉన్న ప్రతిసారి నెల రెండు నెలల ముందు ఏదో ఒక వివాదం సృష్టించి నాపై బురద జల్లాలని చూస్తున్నారు. కానీ అవేవి పనిచేయవు. 23 సంవత్సరాలుగా అభిమానులు నా వెన్నంటే ఉన్నారు. నన్ను అడ్డుకోవాలనుకోవడం మీ మూర్ఖత్వం. అలాంటి సర్కస్ లు చేయాలనే ఆలోచన ఉంటే పక్కకెళ్లి ఆడుకోండి. మంచి భోజనం చేస్తే చాలు సంతోషంగా అనిపించే మనస్తత్వం నాది. తప్పుడు మాటలతో నన్నేం చేయలేరు. ఫ్యాన్సే కాదు ప్రేక్షకులూ నా వెంట ఉన్నారు. అందరూ ఆనందంగా ఉందాం”. ఇదండీ సారాంశం.
ధనుష్ ఎవరిని ఉద్దేశించి అన్నాడో పేర్లను ప్రస్తావించలేదు కానీ ఆ మధ్య నయనతార వివాదం కోర్ట్ దాకా వెళ్ళినప్పుడు సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరిగాయి. వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా ఏవేవో కథనాలు అల్లారు. రాయన్, కెప్టెన్ మిల్లర్ టైంలో కావాలని కొందరు నెగటివ్ పబ్లిసిటీ చేయడం గురించి ఫ్యాన్స్ ధనుష్ దృష్టికి నేరుగా తీసుకెళ్లారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒకేసారి అందరికీ వార్నింగ్ ఇచ్చినట్టు అయ్యిందని వాళ్ళు భావిస్తున్నారు. మొత్తానికి స్టేజి మీద ఎప్పుడూ సాఫ్ట్ అండ్ స్మూత్ గా కనిపించే ధనుష్ ఎట్టకేలకు తనలో మరోవైపుని పబ్లిక్ గా పరిచయం చేశాడు.
This post was last modified on June 2, 2025 10:29 am
మాములుగా ఒక సినిమా రిలీజయ్యాక దాని ఫలితంతో సంబంధం లేకుండా సక్సెస్ మీట్ల పేరుతో బాణా సంచా కాల్చడం, మీడియా…
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్.. మంగళవారం మధ్యాహ్నం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో…
ఏపీలో అరటి పండ్ల ధర ఎంత..? ఎందుకీ రాద్దాంతం..? అరటి రైతులు కష్టాలు పడుతున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చకు…
ఉప ముఖ్యమంత్రి మాటలను వక్రీకరించ వద్దంటూ జనసేన ఓ పార్టీ ప్రకటన విడుదల చేసింది. కొద్దిరోజుల కిందట పవన్ కళ్యాణ్…
దేశంలో పురాతన, బ్రిటీష్ కాలం నాటి పేర్లను, ఊర్లను కూడా మారుస్తున్న కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం…
ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి మహానగరంగా నిర్మించాలని నిర్ణయించుకున్న సీఎం చంద్రబాబు.. ఆదిశగా వడి వడిగా అడుగులు వేస్తున్నారు.…