చెన్నైకి చెందిన శ్రీరాం రాజగోపాలన్ అనే రిటైర్డ్ ఇంజినీర్ జీవితం ఒక్కసారిగా మలుపు తిప్పింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నిర్వహించిన ‘ఎమిరేట్స్ డ్రా మెగా7’ లాటరీలో ఏకంగా రూ.231 కోట్ల భారీ బహుమతిని గెలుచుకుని ఒక్కరోజులో కోటీశ్వరుడిగా మారిపోయారు. అసలు ఈ టికెట్ను ఆయన తన జన్మదినం సందర్భంగా సరదాగా కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఇప్పుడు అదే సరదా జీవితం మొత్తాన్ని శాశ్వతంగా మార్చేసింది.
మార్చి 16న తన బర్త్డే సందర్భంగా శ్రీరాం ఆన్లైన్లో లాటరీ టికెట్ను కొన్నారు. మెగా7 లాటరీలో భాగంగా ఏడు నెంబర్లను యాధృచ్ఛికంగా ఎంచుకున్నారు. ఆ లక్కీ నెంబర్లే ఈసారి డ్రాలో గెలుపొందడం అద్భుతంగా మారింది. తొలి విజేతగా ప్రకటించిన సమయంలో శ్రీరాం ఈ విషయాన్ని పూర్తిగా నమ్మలేకపోయారు. రెండుసార్లు వీడియో చూసి, స్క్రీన్షాట్లు తీసుకున్నాకే నమ్మినట్టు చెప్పారు.
“ఇది పూర్తిగా అదృష్టం వల్లే సాధ్యమైంది. దీని వెనక ఎలాంటి మానవ ప్రయత్నం లేదు. నా సమయం వచ్చింది. జీవితం ఒక్క రోజులో ఇలా మారిపోతుందనుకోలేదు. కానీ ఇప్పుడు నా మీద గొప్ప బాధ్యత కూడా వచ్చింది” అని శ్రీరాం అన్నారు. ఈ విజయం తనకు సంతోషమే కాదు, బాధ్యత కూడా కలిగించిందన్నారు.
శ్రీరాం ఖాళీ సమయంలో ఇంటర్నెట్లో బ్రౌజింగ్ చేస్తూ లాటరీలపై ఆసక్తి పెంచుకున్నారని తెలిసింది. ఆ ఆసక్తి ఆధారంగా కొన్ని టికెట్లు కొనడమే ఈ అదృష్టాన్ని అందించిందని పేర్కొన్నారు. తమ జీవితాన్ని మార్చుకునే అవకాశాలు ఎప్పుడైనా రావొచ్చని, వాటిని పట్టుకోవాలంటే నమ్మకమే సరిపోతుందని వ్యాఖ్యానించారు.
This post was last modified on May 27, 2025 2:52 pm
తెలంగాణ రాష్ట్ర సేన.. అంటూ టీఆర్ ఎస్ పార్టీని స్థాపించిన కవిత వ్యవహారంపై బీఆర్ ఎస్ నాయకులు మౌనంగా ఉన్నారు.…
మోహన్ లాల్ దృశ్యం 3 మరోసారి రిలీజ్ డేట్ ప్రకటించింది. మే 21 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు అధికారికంగా…
బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల తర్వాత సూర్య సినిమాలు వరసగా రాబోతున్నాయి. వాటిలో మొదటిది వీరభద్రుడు. తమిళంలో కరుప్పుగా రూపొందిన…
సొంత పార్టీ నాయకుడు తప్పు చేస్తే ఒకవిధంగా.. ప్రత్యర్థి పార్టీ నేతలు తప్పులు చేస్తే మరో విధంగా మారి పోయిన…
మే 1 విడుదల కాబోతున్న గాయపడ్డ సింహం మీద టీమ్ కన్నా ఎక్కువగా బయ్యర్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే…
వెనకటికి పాత కథ ఒకటుంది. ఒక రొట్టె కోసం రెండు పిల్లులు పోట్లాడుకుంటే తీర్పు చెప్పడానికి వచ్చిన కోతి దాన్ని…