Trends

వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌: డబుల్ ప్రైజ్‌మ‌నీ!

టెస్ట్ క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం కల్పించే దిశగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల లార్డ్స్ వేదికగా జరగనున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (WTC) ఫైనల్‌కి సంబంధించి ప్రైజ్‌మనీని గత సీజన్‌తో పోలిస్తే రెట్టింపు చేసింది. జూన్ 11 నుంచి ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌లో విజేత జట్టు అట్టహాసంగా రూ.30.79 కోట్ల ప్రైజ్‌మనీని అందుకోనుండగా, ఓడిన జట్టుకు రూ.17.96 కోట్లు లభించనున్నాయి.

గత టోర్నీలో టీమిండియాపై విజయం సాధించిన ఆస్ట్రేలియా జట్టు 13.68 కోట్లు ప్రైజ్‌మనీ గెలుచుకోగా, భారత్‌కు రూ.6.84 కోట్లు దక్కిన విషయం తెలిసిందే. ఈసారి ఆ మొత్తం రెండింతలుగా పెరగడం టెస్ట్ ఫార్మాట్‌కి లభిస్తున్న ప్రాధాన్యతను ప్రతిబింబిస్తోంది. డబ్ల్యూటీసీ టోర్నీ ద్వారా ఐసీసీ నెమ్మదిగా టెస్ట్ క్రికెట్‌లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే ప్రయత్నంలో ఉంది.

ఈ సీజన్‌లో దక్షిణాఫ్రికా జట్టు అద్భుత ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. శ్రీలంక, పాకిస్థాన్‌లపై ఘన విజయాలు అందుకున్న సఫారీలు 69.44 పాయింట్లతో ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోగా, డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా 67.54 పాయింట్లతో రెండో స్థానాన్ని ఆక్రమించింది. భారత్ మాత్రం 50 శాతం పాయింట్లతో మూడో స్థానానికి పరిమితమైంది.

ఈ నేపథ్యంలో లార్డ్స్‌లో ఫైనల్ ఆడాలన్నది ఓ గౌరవంగా మారింది. ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ మాట్లాడుతూ, “ఇది రెండేళ్ల కృషికి ఫలితం. ఈసారి ఫైనల్ గెలిచి టెస్ట్ ఫార్మాట్‌లో మళ్లీ మేల్కొలుపు ఇవ్వాలనుకుంటున్నాం” అన్నారు. మరోవైపు, దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా కూడా ఇదే ఉత్సాహంతో ఉన్నారు. “డబ్ల్యూటీసీ వల్ల టెస్ట్ ఫార్మాట్‌కు గుర్తింపు పెరుగుతుంది. అద్భుత ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నాం” అని తెలిపారు. వేదికగా నిలిచే లార్డ్స్ క్రికెట్ మైదానం ఇప్పుడు మరో మధుర క్షణానికి సన్నద్ధమవుతోంది. టెస్ట్ క్రికెట్ గౌరవాన్ని చాటే ఈ టైటిల్ పోరులో, విజేత ఎవరో తేలాలంటే జూన్ 11 వరకూ వేచి చూడాల్సిందే.

Satya

Recent Posts

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

3 hours ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

4 hours ago

నమ్మకం టన్నుల్లో… రామ్ చరణ్ మాటల్లో

విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…

5 hours ago

జ‌గ‌న్‌కు క‌విత మ‌ద్ద‌తిస్తున్నారా?

తెలంగాణ నాయ‌కురాలు, తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున…

5 hours ago

మస్సా మస్సా… లెక్క సరిపోయింది

పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…

5 hours ago

ప‌క్కా మాస్… క‌ల్లు రుచి చూసిన బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తాజాగా క‌ల్లు రుచి చూశారు. వాస్త‌వానికి ఆయ‌న ఇలాంటి వాటికి క‌డు దూరంగా ఉంటారు. అయితే..…

6 hours ago