Trends

వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌: డబుల్ ప్రైజ్‌మ‌నీ!

టెస్ట్ క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం కల్పించే దిశగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల లార్డ్స్ వేదికగా జరగనున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (WTC) ఫైనల్‌కి సంబంధించి ప్రైజ్‌మనీని గత సీజన్‌తో పోలిస్తే రెట్టింపు చేసింది. జూన్ 11 నుంచి ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌లో విజేత జట్టు అట్టహాసంగా రూ.30.79 కోట్ల ప్రైజ్‌మనీని అందుకోనుండగా, ఓడిన జట్టుకు రూ.17.96 కోట్లు లభించనున్నాయి.

గత టోర్నీలో టీమిండియాపై విజయం సాధించిన ఆస్ట్రేలియా జట్టు 13.68 కోట్లు ప్రైజ్‌మనీ గెలుచుకోగా, భారత్‌కు రూ.6.84 కోట్లు దక్కిన విషయం తెలిసిందే. ఈసారి ఆ మొత్తం రెండింతలుగా పెరగడం టెస్ట్ ఫార్మాట్‌కి లభిస్తున్న ప్రాధాన్యతను ప్రతిబింబిస్తోంది. డబ్ల్యూటీసీ టోర్నీ ద్వారా ఐసీసీ నెమ్మదిగా టెస్ట్ క్రికెట్‌లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే ప్రయత్నంలో ఉంది.

ఈ సీజన్‌లో దక్షిణాఫ్రికా జట్టు అద్భుత ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. శ్రీలంక, పాకిస్థాన్‌లపై ఘన విజయాలు అందుకున్న సఫారీలు 69.44 పాయింట్లతో ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోగా, డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా 67.54 పాయింట్లతో రెండో స్థానాన్ని ఆక్రమించింది. భారత్ మాత్రం 50 శాతం పాయింట్లతో మూడో స్థానానికి పరిమితమైంది.

ఈ నేపథ్యంలో లార్డ్స్‌లో ఫైనల్ ఆడాలన్నది ఓ గౌరవంగా మారింది. ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ మాట్లాడుతూ, “ఇది రెండేళ్ల కృషికి ఫలితం. ఈసారి ఫైనల్ గెలిచి టెస్ట్ ఫార్మాట్‌లో మళ్లీ మేల్కొలుపు ఇవ్వాలనుకుంటున్నాం” అన్నారు. మరోవైపు, దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా కూడా ఇదే ఉత్సాహంతో ఉన్నారు. “డబ్ల్యూటీసీ వల్ల టెస్ట్ ఫార్మాట్‌కు గుర్తింపు పెరుగుతుంది. అద్భుత ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నాం” అని తెలిపారు. వేదికగా నిలిచే లార్డ్స్ క్రికెట్ మైదానం ఇప్పుడు మరో మధుర క్షణానికి సన్నద్ధమవుతోంది. టెస్ట్ క్రికెట్ గౌరవాన్ని చాటే ఈ టైటిల్ పోరులో, విజేత ఎవరో తేలాలంటే జూన్ 11 వరకూ వేచి చూడాల్సిందే.

This post was last modified on May 17, 2025 10:22 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

1 hour ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

2 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

2 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

4 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

5 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

6 hours ago