Trends

అమెరికా బోటు ప్రమాదంలో ఇద్దరు భారతీయ చిన్నారుల గల్లంతు

అగ్రరాజ్యం అమెరికాలో చోటుచేసుకున్న ఓ బోటు ప్రమాదంలో భారత్ కు చెందిన ఇద్దరు చిన్నారులు గల్లంతు అయ్యారు. పిల్లల తల్లిదండ్రులు ప్రాణాలతో బయటపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాలిఫోర్నియాలోని శాన్ డియాగోకు 15 మైళ్ల దూరంలో పసిఫిక్ మహా సముద్రంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించగా… ఏడుగురు గల్లంతు అయ్యారు. గల్లంతైన ఏడుగురిలో ఇద్దరు భారతీయ చిన్నారులు ఉన్నారు. అమెరికా, భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయాలు తెలిపిన వివరాల మేరకు ఈ బోటు శరణార్థులతో వెళుతున్నట్లుగా సమాచారం.

మొత్తం 16 మందితో ఈ బోటు బయలుదేరగా.. సముద్ర తీరం నుంచి కాస్తంత దూరం వెళ్లినంతనే ఈ బోటు ప్రమాదానికి గురైంది. బోటులోని వారిలో ఓ భారతీయ కుటుంబం ఉండగా… ఆ కుటుంబంలో భార్యాభర్తలు ప్రాణాలతో బయటపడగా… వారి పిల్లలిద్దరూ గల్లంతు అయ్యారు. ప్రాణాలతో బయటపడిన భారతీయ దంపతులను స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుని మెరుగైన వైద్య చికిత్సలు అందేలా ఏర్పాట్లు చేసినట్లు శాన్ ఫ్రాన్సిస్ కో లోని భారత కాన్సులేట్ కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. అయితే ఈ బోటు ప్రయాణానికి ఎలాంటి అనుమతులు లేవని, దీనిలో మనుషులను అక్రమంగా రవాణా చేస్తున్నట్లుగా గుర్తించామని అమెరికా కోస్ట్ గార్డ్ తెలిపింది.

అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టాక అమెరికా పౌరసత్వంపై కఠిన చట్టాలు అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అనుమతులు లేకుండా ఆ దేశంలో ఉంటున్న వివిధ దేశాలకు చెందిన వారిని ఇప్పటికే అమెరికా వారి దేశాలకు పంపించేసింది. అమెరికా అధికారుల కంటబడకుండా ఉండిపోయిన వారు ఇలా గుట్టుచప్పుడు కాకుండా అమెరికాను వదిలేందుకు యత్నిస్తున్నట్లుగా సమాచారం. ఇలా అమెరికా ఆంక్షల కత్తిని దాటుకుని తమ దేశానికి వెళ్లిపోదామని భావించిన 16 మంది ఈ బోటు ప్రమాదంలో చిక్కుకున్నారు. వీరిలో నలుగురు సభ్యులు భారతీయ కుటుంటం ఉండటం… వారిలో ఇద్దరు చిన్నారులు గల్లంతు కావడం విచారకరం.

This post was last modified on May 6, 2025 2:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

23 minutes ago

పెంపుడు పిల్లి చ‌నిపోయింద‌ని.. ఉరేసుకున్న విద్యార్థిని!

పెంపుడు జంతువుల ప‌ట్ల య‌జ‌మానులు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రేమ‌ను పెంచుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయా జంతువులు…

45 minutes ago

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

2 hours ago

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

5 hours ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

5 hours ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

6 hours ago