విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చల్లవానితోట పంచాయతీ పరిధిలోని నడుపూరి కల్లాలు గ్రామానికి చెందిన రాజశేఖర్ అనే యువకుడు చేసిన దారుణం సభ్య సమాజాన్ని భయ కంపితులను చేస్తోంది. కనిపెంచిన తల్లిదండ్రులనే కడతేర్చిన ఇతడిని ఏమని పిలవాలో కూడా తెలియడం లేదు. నవ మాసాలు మోసిన తల్లి ఓ వైపు, పెంచి పెద్ద చేసి ఓ ప్రయోజకుడిని చేసిన తండ్రి మరోవైపు… వారిద్దరూ ప్రాణ భయంతో పరుగులు పెడుతుంటే… ఈ కసాయి కొడుకు వికటాట్ట హాసం చేస్తూ వారిపైకి ట్రాక్టర్ ను ఎక్కించేశాడు. చూస్తుండగానే..తల్లిదండ్రుల ఇద్దరి ప్రాణాలను బలిగొన్నాడు. ఆనక నేరుగా పోలీసులకు లొంగిపోయాడు.
ఈ ఘటన జరిగిన తీరును తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. కొడుకు నడుపుకుంటూ వస్తున్న ట్రాక్టర్ ఎక్కడ తమ ప్రాణాలను తీస్తుందోనని ఆ తల్లిదండ్రులు ఇద్దరూ భయంతో పరుగులు తీసిన దృశ్యాలను గుర్తు చేసుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. కనిపెంచిన అమ్మానాన్నలు భయంతో పరుగుతు తీస్తుంటే..వారిపైకి అతడు ట్రాక్టర్ ను ఎక్కించిన తీరును గుర్తు చేసుకుంటే… సమాజంలో ఇలాంటి వారు కూడా ఉంటారా? అన్న ఏవగింపు పుడుతుంది. ఎక్కడో ఓ మూలనే జరిగినా ఈ ఘటన యావత్తు ప్రపంచాన్నే కలరవపాటుకు గురి చేసిందని చెప్పక తప్పదు.
రాజశేఖర్ తల్లిదండ్రులు పాండ్రంకి అప్పలనాయుడు (55), జయ (45)లు చేసిన తప్పేమీ కూడా లేదనే చెప్పాలి. తమకున్న ఎకరం పొలంలో రాజశేఖర్ తో పాటు అతడి సోదరి రాధాకుమారికి కూడా వాటి ఇవ్వడమే వారు చేసిన పొరపాటుగా చెప్పాలి. రాజశేఖర్ తో పాటు రాధాకుమారి కూడా వారి కడుపున పుట్టిన బిడ్డే కదా. రాధాకుమారికి పెళ్లి సందర్భంగా ఎకరం భూమిలో 20 సెంట్లను రాసివ్వగా… భర్త చనిపోవడంతో రాధాకుమారికి మరింతగా అండగా నిలిచేందుకు పొలాన్ని విక్రయించగా వచ్చే మొత్తాన్ని కూడా ఆమెకే ఇవ్వాని వారు భావించారు.
ఈ నిర్ణయమే రాజశేఖర్ ను రాక్షసుడిగా మార్చివేసింది. పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన రాధాకుమారికి ఇంకెంత కాలం సహకరిస్తారని అతడు ఊగిపోయాడు. ఉన్నదానిలో మెజారిటీ వాటాను కూతురికే ఇస్తే… ఇక తన జీవితం ఏం కావాలని ఆగ్రహానికి గురయ్యాడు. అంతే తన పేరిట ఉన్న పొలంలో కొంత భాగాన్ని అమ్ముతానని… అందుకోసం ట్రాక్టర్ తో ఆ భూమిని చదును చేసేందుకు ఓ ట్రాక్టర్ తో పొలానికి వెళ్లాడు. తల్లిదండ్రులు వారించినంతనే అతడిలోని కర్కోటకుడు బయటకు వచ్చాడు. అంతే వారు భయంతో పరుగులు పెట్టినా వదలకుండా వారిపైకి ట్రాక్టర్ ను ఎక్కించి వారి ప్రాణాలను తీశాడు. అనంతరం తన సతీమణితో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
This post was last modified on April 27, 2025 10:08 am
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…
ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…
మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిషన్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…