Trends

అమ్మానాన్నల పై ట్రాక్టర్ ఎక్కించి చంపేశాడు

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చల్లవానితోట పంచాయతీ పరిధిలోని నడుపూరి కల్లాలు గ్రామానికి చెందిన రాజశేఖర్ అనే యువకుడు చేసిన దారుణం సభ్య సమాజాన్ని భయ కంపితులను చేస్తోంది. కనిపెంచిన తల్లిదండ్రులనే కడతేర్చిన ఇతడిని ఏమని పిలవాలో కూడా తెలియడం లేదు. నవ మాసాలు మోసిన తల్లి ఓ వైపు, పెంచి పెద్ద చేసి ఓ ప్రయోజకుడిని చేసిన తండ్రి మరోవైపు… వారిద్దరూ ప్రాణ భయంతో పరుగులు పెడుతుంటే… ఈ కసాయి కొడుకు వికటాట్ట హాసం చేస్తూ వారిపైకి ట్రాక్టర్ ను ఎక్కించేశాడు. చూస్తుండగానే..తల్లిదండ్రుల ఇద్దరి ప్రాణాలను బలిగొన్నాడు. ఆనక నేరుగా పోలీసులకు లొంగిపోయాడు.

ఈ ఘటన జరిగిన తీరును తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. కొడుకు నడుపుకుంటూ వస్తున్న ట్రాక్టర్ ఎక్కడ తమ ప్రాణాలను తీస్తుందోనని ఆ తల్లిదండ్రులు ఇద్దరూ భయంతో పరుగులు తీసిన దృశ్యాలను గుర్తు చేసుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. కనిపెంచిన అమ్మానాన్నలు భయంతో పరుగుతు తీస్తుంటే..వారిపైకి అతడు ట్రాక్టర్ ను ఎక్కించిన తీరును గుర్తు చేసుకుంటే… సమాజంలో ఇలాంటి వారు కూడా ఉంటారా? అన్న ఏవగింపు పుడుతుంది. ఎక్కడో ఓ మూలనే జరిగినా ఈ ఘటన యావత్తు ప్రపంచాన్నే కలరవపాటుకు గురి చేసిందని చెప్పక తప్పదు.

రాజశేఖర్ తల్లిదండ్రులు పాండ్రంకి అప్పలనాయుడు (55), జయ (45)లు చేసిన తప్పేమీ కూడా లేదనే చెప్పాలి. తమకున్న ఎకరం పొలంలో రాజశేఖర్ తో పాటు అతడి సోదరి రాధాకుమారికి కూడా వాటి ఇవ్వడమే వారు చేసిన పొరపాటుగా చెప్పాలి. రాజశేఖర్ తో పాటు రాధాకుమారి కూడా వారి కడుపున పుట్టిన బిడ్డే కదా. రాధాకుమారికి పెళ్లి సందర్భంగా ఎకరం భూమిలో 20 సెంట్లను రాసివ్వగా… భర్త చనిపోవడంతో రాధాకుమారికి మరింతగా అండగా నిలిచేందుకు పొలాన్ని విక్రయించగా వచ్చే మొత్తాన్ని కూడా ఆమెకే ఇవ్వాని వారు భావించారు.

ఈ నిర్ణయమే రాజశేఖర్ ను రాక్షసుడిగా మార్చివేసింది. పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన రాధాకుమారికి ఇంకెంత కాలం సహకరిస్తారని అతడు ఊగిపోయాడు. ఉన్నదానిలో మెజారిటీ వాటాను కూతురికే ఇస్తే… ఇక తన జీవితం ఏం కావాలని ఆగ్రహానికి గురయ్యాడు. అంతే తన పేరిట ఉన్న పొలంలో కొంత భాగాన్ని అమ్ముతానని… అందుకోసం ట్రాక్టర్ తో ఆ భూమిని చదును చేసేందుకు ఓ ట్రాక్టర్ తో పొలానికి వెళ్లాడు. తల్లిదండ్రులు వారించినంతనే అతడిలోని కర్కోటకుడు బయటకు వచ్చాడు. అంతే వారు భయంతో పరుగులు పెట్టినా వదలకుండా వారిపైకి ట్రాక్టర్ ను ఎక్కించి వారి ప్రాణాలను తీశాడు. అనంతరం తన సతీమణితో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

This post was last modified on April 27, 2025 10:08 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేవంత్ రెడ్డి `వ‌న్ మ్యాన్ ఆర్మీ`… సరిపోవట్లేదా?

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో వ‌న్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి క‌నిపిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి…

3 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో ఎవరిది పైచేయి?

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌న్న టాక్ వినిపిస్తోంది. కీల‌క నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

3 hours ago

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

7 hours ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

8 hours ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

9 hours ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

9 hours ago