Trends

2.5 ల‌క్ష‌ల మంది మెడ‌పై హెచ్‌1బీ క‌త్తి

అగ్ర‌రాజ్యం అమెరికా క‌ల‌లు క‌ల్ల‌లు అవుతున్నాయి. ఓ వైపు క‌రోనా కల‌క‌ల‌కం కొన‌సాగుతుండ‌గానే మ‌రోవైపు ఆ దేశంలో నివ‌సిస్తున్న వారికి ఉద్యోగ ఉపాధి అవ‌కాశాలు స‌మ‌స్యాత్మ‌కంగా మారడ‌మే కాకుండా నివ‌సించ‌డమే ఇబ్బందిగా మారుతోంది.

ఔను. అమెరికాలో పని చేస్తున్న లక్షలాది మంది విదేశీ ఉద్యోగుల భవిష్యత్‌ కలలపై కరోనా నీళ్లు చల్లింది. జూన్‌ చివరినాటికి దాదాపు 2 లక్షల మంది హెచ్‌1బీ వీసాదారులు చట్టబద్ధంగా ఆ దేశంలో నివసించే హక్కును కోల్పోనున్నారు. ఇందులో షాకింగ్ ప‌రిణామం బాధితుల్లోభారతీయులే అత్యధికం!

గత 2 నెలల్లో అమెరికాలో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. కంపెనీలు వారిని వేతనం లేని సెలవుపై పంపడం, వేతనాన్ని తగ్గించడం లేదా వర్క్‌ ఫ్రం హోమ్‌కు అనుమతించడం వంటివి చేస్తున్నాయి.

హెచ్‌1బీ వీసాదారులు వేతనం లేకుండా కేవలం 60 రోజులు మాత్రమే అక్కడ చట్టబద్ధంగా నివసించేందుకు హక్కు ఉంటుంది. అంటే, వారి వీసా గడువు ఈ జూన్‌తో ముగియబోతోంది. సుమారు 2,50,000 మంది ఉద్యోగులు అమెరికాలో గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్నారు.

వారిలో దాదాపు 2 లక్షల మంది హెచ్‌1బీ వీసాదారులకు ఈ జూన్‌తో గడువు ముగియబోతోంది. ఇంతేకాకుండా నివాస హోదా కోరని మరో వేలాది మంది కూడా స్వస్థలాలకు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది.

మ‌రోవైపు అమెరికాలో ఉన్న స్థానికులతో పోలిస్తే విదేశీ ఉద్యోగులకు ఇంకో స‌మ‌స్య ఎదుర‌వుతోంది. ఎందుకంటే, గ‌డ‌వు ముగిసిన త‌ర్వాత నివ‌సించ‌డం వీసా నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది. ఉద్యోగం కోల్పోయిన హెచ్‌1బీ వీసాదారులు 60 రోజుల్లో మరో ఉద్యోగం వెతుక్కోవాల్సి ఉంటుంది.

లేనిపక్షంలో వేరే వీసాకు మారడం లేదా దేశాన్ని వదిలి వెళ్లాల్సి ఉంటుంది. అయితే, కరోనా కారణంగా విదేశీ రాకపోకలను భారత్‌ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అటు అమెరికాలో ఉండలేక, ఇటు భారత్‌కు వచ్చే దారిలేక వారు మానసిక క్షోభను అనుభవిస్తున్నారు.

Satya

Recent Posts

ఏడాది తర్వాత… అటు జగన్, ఇటు కేటీఆర్ !

మరో ఏడాది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పాదయాత్రల సందడి మొదలుకానుంది. ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు…

21 minutes ago

డిజిటల్ పాఠం నేర్పిస్తున్న పెద్ది ఫలితం

థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…

50 minutes ago

పోక్సో కేసు నిందితుడికి బెయిలు రానివ్వకూడదు: రేవంత్ తో పవన్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘ‌ట‌న దారుణం`` అని…

1 hour ago

ప్రజాధనం అంటే పవన్ ఒప్పుకోరు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…

1 hour ago

ముద్ర‌గ‌డ పాడె మోసిన జ‌గ‌న్‌

కాపు ఉద్య‌మ నాయ‌కుడు, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అంత్య‌క్రియ‌లు ముగిశాయి. తూర్పుగోదావ‌రి జిల్లా కిర్లంపూడిలోని ఆయ‌న ఇంటి ప్రాంగ‌ణంలోనే…

2 hours ago

బాబు సర్కారును పొగిడిన కేటీఆర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్‌నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…

2 hours ago