Trends

2.5 ల‌క్ష‌ల మంది మెడ‌పై హెచ్‌1బీ క‌త్తి

అగ్ర‌రాజ్యం అమెరికా క‌ల‌లు క‌ల్ల‌లు అవుతున్నాయి. ఓ వైపు క‌రోనా కల‌క‌ల‌కం కొన‌సాగుతుండ‌గానే మ‌రోవైపు ఆ దేశంలో నివ‌సిస్తున్న వారికి ఉద్యోగ ఉపాధి అవ‌కాశాలు స‌మ‌స్యాత్మ‌కంగా మారడ‌మే కాకుండా నివ‌సించ‌డమే ఇబ్బందిగా మారుతోంది.

ఔను. అమెరికాలో పని చేస్తున్న లక్షలాది మంది విదేశీ ఉద్యోగుల భవిష్యత్‌ కలలపై కరోనా నీళ్లు చల్లింది. జూన్‌ చివరినాటికి దాదాపు 2 లక్షల మంది హెచ్‌1బీ వీసాదారులు చట్టబద్ధంగా ఆ దేశంలో నివసించే హక్కును కోల్పోనున్నారు. ఇందులో షాకింగ్ ప‌రిణామం బాధితుల్లోభారతీయులే అత్యధికం!

గత 2 నెలల్లో అమెరికాలో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. కంపెనీలు వారిని వేతనం లేని సెలవుపై పంపడం, వేతనాన్ని తగ్గించడం లేదా వర్క్‌ ఫ్రం హోమ్‌కు అనుమతించడం వంటివి చేస్తున్నాయి.

హెచ్‌1బీ వీసాదారులు వేతనం లేకుండా కేవలం 60 రోజులు మాత్రమే అక్కడ చట్టబద్ధంగా నివసించేందుకు హక్కు ఉంటుంది. అంటే, వారి వీసా గడువు ఈ జూన్‌తో ముగియబోతోంది. సుమారు 2,50,000 మంది ఉద్యోగులు అమెరికాలో గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్నారు.

వారిలో దాదాపు 2 లక్షల మంది హెచ్‌1బీ వీసాదారులకు ఈ జూన్‌తో గడువు ముగియబోతోంది. ఇంతేకాకుండా నివాస హోదా కోరని మరో వేలాది మంది కూడా స్వస్థలాలకు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది.

మ‌రోవైపు అమెరికాలో ఉన్న స్థానికులతో పోలిస్తే విదేశీ ఉద్యోగులకు ఇంకో స‌మ‌స్య ఎదుర‌వుతోంది. ఎందుకంటే, గ‌డ‌వు ముగిసిన త‌ర్వాత నివ‌సించ‌డం వీసా నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది. ఉద్యోగం కోల్పోయిన హెచ్‌1బీ వీసాదారులు 60 రోజుల్లో మరో ఉద్యోగం వెతుక్కోవాల్సి ఉంటుంది.

లేనిపక్షంలో వేరే వీసాకు మారడం లేదా దేశాన్ని వదిలి వెళ్లాల్సి ఉంటుంది. అయితే, కరోనా కారణంగా విదేశీ రాకపోకలను భారత్‌ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అటు అమెరికాలో ఉండలేక, ఇటు భారత్‌కు వచ్చే దారిలేక వారు మానసిక క్షోభను అనుభవిస్తున్నారు.

This post was last modified on April 30, 2020 4:07 pm

Share

Recent Posts

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

16 minutes ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

38 minutes ago

జగన్ మతమార్పిడులు ప్రోత్సహించారు.. విజయసాయి సంచలన ఆరోపణ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

1 hour ago

ప్యారడైజ్ కోసం ప్రాణాలు పెట్టేస్తున్నారు

సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…

2 hours ago

బుచ్చిబాబు మిస్ చేసుకున్న ఎలిమెంట్స్

ఎవరో జ్వాలలు రగిలించారు ఎవరో దానికి టార్గెట్ అయ్యారని సామెత చెప్పినట్టు ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయం మెగా ఫాన్స్…

2 hours ago

ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి కుటుంబాల్లో సమస్యలు లేవా…?

పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల్లోనే సమస్యలు ఉన్నాయి.. ప్రతి ఇంటిలోనూ అందరికీ సమస్యలు ఉంటాయి.. అంటూ మాజీ మంత్రి వైసిపి…

3 hours ago