అగ్రరాజ్యం అమెరికా కలలు కల్లలు అవుతున్నాయి. ఓ వైపు కరోనా కలకలకం కొనసాగుతుండగానే మరోవైపు ఆ దేశంలో నివసిస్తున్న వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు సమస్యాత్మకంగా మారడమే కాకుండా నివసించడమే ఇబ్బందిగా మారుతోంది.
ఔను. అమెరికాలో పని చేస్తున్న లక్షలాది మంది విదేశీ ఉద్యోగుల భవిష్యత్ కలలపై కరోనా నీళ్లు చల్లింది. జూన్ చివరినాటికి దాదాపు 2 లక్షల మంది హెచ్1బీ వీసాదారులు చట్టబద్ధంగా ఆ దేశంలో నివసించే హక్కును కోల్పోనున్నారు. ఇందులో షాకింగ్ పరిణామం బాధితుల్లోభారతీయులే అత్యధికం!
గత 2 నెలల్లో అమెరికాలో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. కంపెనీలు వారిని వేతనం లేని సెలవుపై పంపడం, వేతనాన్ని తగ్గించడం లేదా వర్క్ ఫ్రం హోమ్కు అనుమతించడం వంటివి చేస్తున్నాయి.
హెచ్1బీ వీసాదారులు వేతనం లేకుండా కేవలం 60 రోజులు మాత్రమే అక్కడ చట్టబద్ధంగా నివసించేందుకు హక్కు ఉంటుంది. అంటే, వారి వీసా గడువు ఈ జూన్తో ముగియబోతోంది. సుమారు 2,50,000 మంది ఉద్యోగులు అమెరికాలో గ్రీన్కార్డు కోసం ఎదురుచూస్తున్నారు.
వారిలో దాదాపు 2 లక్షల మంది హెచ్1బీ వీసాదారులకు ఈ జూన్తో గడువు ముగియబోతోంది. ఇంతేకాకుండా నివాస హోదా కోరని మరో వేలాది మంది కూడా స్వస్థలాలకు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది.
మరోవైపు అమెరికాలో ఉన్న స్థానికులతో పోలిస్తే విదేశీ ఉద్యోగులకు ఇంకో సమస్య ఎదురవుతోంది. ఎందుకంటే, గడవు ముగిసిన తర్వాత నివసించడం వీసా నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది. ఉద్యోగం కోల్పోయిన హెచ్1బీ వీసాదారులు 60 రోజుల్లో మరో ఉద్యోగం వెతుక్కోవాల్సి ఉంటుంది.
లేనిపక్షంలో వేరే వీసాకు మారడం లేదా దేశాన్ని వదిలి వెళ్లాల్సి ఉంటుంది. అయితే, కరోనా కారణంగా విదేశీ రాకపోకలను భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అటు అమెరికాలో ఉండలేక, ఇటు భారత్కు వచ్చే దారిలేక వారు మానసిక క్షోభను అనుభవిస్తున్నారు.
This post was last modified on April 30, 2020 4:07 pm
‘అఖండ 2.. తాండవం’ బాక్సాఫీస్ దగ్గర తాండవం ఆడుతూ దూసుకెళ్తోంది. సినిమాకు మిక్స్డ్ రివ్యూలు, టాక్ వచ్చినప్పటికీ.. తొలి రోజు…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య వచ్చిన ‘అఖండ-2’కు మిక్స్డ్ టాక్ వచ్చిన సంగతి…
టాలెంట్, రూపం రెండూ ఉన్న నటుడు ఆది పినిశెట్టి. మొదట హీరోగా పరిచయమైనా సరైనోడులో విలన్ గా మెప్పించాక ఒక్కసారిగా…
ఇప్పుడు పాడటం లేదు కానీ ఇరవై సంవత్సరాల క్రితం తెలుగు సంగీతంలో పాప్ మ్యూజిక్ అనే ఒరవడి తేవడంలో గాయని…
ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కొనసాగుతోంది. దీనికి డెడ్లైన్ను మళ్లీ…
సంగీత దర్శకుడు తమన్ అఖండ 2 కోసం ఇచ్చిన సంగీతం మీద మిశ్రమ స్పందనే దక్కింది. ఆడియో శివ భక్తులకు…