Trends

మొబైల్ ఫోన్ సిగ్న‌ల్స్‌ ప్ర‌దాత.. రంగ‌న్ మృతి!

నేడు దేశంలో 60-70 శాతం మంది ప్ర‌జ‌లు వినియోగిస్తున్న మొబైల్ ఫోన్ల‌కు సిగ్న‌ల్స్ అందించే ఉప‌గ్ర‌హ ప్ర‌యోగాల‌కు.. ఆద్యుడు.. భార‌త అంత‌రిక్ష ప్ర‌యోగాల్లోనే సువ‌ర్ణ అధ్యాయానికి శ్రీకారం చుట్టిన క‌స్తూరి రంగ‌న్‌.. ఉర‌ఫ్ కృష్ణ‌స్వామి క‌స్తూరి రంగ‌న్ ఇక లేరు. 84 ఏళ్ల వ‌య‌సులో బెంగ‌ళూరులో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం.. 1 గంట‌కు ఆయ‌న క‌న్నుమూశారు. గ‌త కొద్దికాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న రంగ‌న్‌.. ఓ ఆసుప‌త్రిలో తుదిశ్వాస విడిచారు.

1940, అక్టోబ‌రు 24న కేర‌ళ‌లోని కొచ్చిన్‌లో జ‌న్మించిన రంగ‌న్‌.. భార‌త అంత‌రిక్ష రంగంలో అనేక ప్ర‌యోగాల‌కు `వేదిక‌గా` నిలిచారు. ముఖ్యంగా సాంతికేత వినియోగంలో ప్ర‌పంచ దేశాల‌కు దీటుగా భార‌త్ ను ముందుకు న‌డిపించాల‌ని క‌ల‌లు క‌న్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న 1980ల‌లో మొబైల్ ఫోన్ల‌కు సిగ్న‌ళ్ల‌కు అందించే వ్య‌వ‌స్థ‌కు శ్రీకారం చుట్టారు. సుమారు 15 సంవ‌త్స‌రాల పాటు.. ఆయ‌న చేసిన కృషి ఫ‌లించి.. భార‌త్‌లో తొలిసారి మొబైల్ సిగ్న‌ళ్లు 1998-99 ప్రాంతంలో అందివ‌చ్చాయి.

ఆత‌ర్వాత‌.. జ‌రిగిన విస్తృత ప‌రిశోధ‌న‌లు.. మొబైళ్ల సిగ్న‌ళ్ల‌తోపాటు.. ఇత‌ర సాంకేతిక స‌హ‌కారాల‌ను కూడా అందించాయి. ఒక్క మొబైల్ సిగ్న‌ళ్లే కాకుండా.. అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌లో మానవ ర‌హిత ప్ర‌యోగాల‌కు కూడా.. ఆయ‌న అప్ప‌ట్లోనే జీవం పోశారు. ఆయ‌న రాసిన‌.. 200ల‌కు పైగా ప‌త్రాలు.. నేటికీ శాస్త్ర‌వేత్త‌ల‌కు ప‌విత్ర గ్రంధాల‌తో స‌మానంగా భావిస్తారు. సుదీర్ఘ కాలం పాటు ఆయ‌న భార‌త అంత‌రిక్ష రంగానికి సేవ‌లు అందించారు.

ప్ర‌స్తుతం చిటికెలో మొబైల్ సిగ్న‌ళ్ల‌ను అందుకునే వ్య‌వ‌స్థ‌కు ఆయ‌నే జ‌వం… జీవం.. పోశారంటూ.. 2000 సంవ‌త్స‌రంలో ఆయ‌న‌కు ప‌ద్మ‌విభూష‌ణ్ ప్ర‌క‌టించిన సంద‌ర్భంగా కేంద్రం వేనోళ్ల కొనియాడింది. కాగా.. ఆయ‌న కు కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్య‌త్వాన్ని కూడా ఇచ్చింది. ఈ క్ర‌మంలోనే క్షేత్ర‌స్థాయిలో విద్యార్థు లకు అంత‌రిక్షంపై అవ‌గాహ‌న పెంచేందుకు పాఠ్యాంశాలు మార్చాలని సూచించారు. కానీ.. అది సాకారం కాలేదు.

This post was last modified on April 25, 2025 4:13 pm

Share

Recent Posts

సీఎం సినిమా తడబడుతుంది

అసలే తెలుగు నుంచి తమిళంలోకి రీమేక్ అయిన సినిమా. పైగా విడుదల చాలా ఆలస్యం అయింది. మధ్యలో సినిమా ఆన్…

51 minutes ago

పాత రోజుల్లోకి నారా రోహిత్

రాజకీయాలకు పేరుపడ్డ నారా కుటుంబం నుంచి ఒక నటుడు వస్తున్నాడంటే మొదట్లో అందరూ ఆశ్చర్యపోయారు. ఇతను ఏమాత్రం సక్సెస్ అవుతాడో…

1 hour ago

అఖిల్ భారతీయుడు కాదా?

భారతీయులకు విదేశీ పౌరసత్వాలు దక్కడం కొత్తేమీ కాదు. ముందు ఇండియాలోనే పుట్టి పెరిగి.. తర్వాత విదేశాలకు వెళ్లి అక్కడ స్థిరపడ్డాక…

2 hours ago

ష‌ర్మిల ఎక్క‌డున్నారు… ఫోన్ స్విచ్ఛాఫ్‌!?

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ ష‌ర్మిల ఎక్క‌డున్నారు? ఏం చేస్తున్నారు? అనే విష‌యాలు పార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ప్ర‌స్తుతం…

3 hours ago

మోడీ పై ఆర్ ఎస్ ఎస్ గుస్సా…?

కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వానికి.. రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్‌కు మ‌ధ్య అవినాభావ సంబంధం ఉన్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో…

5 hours ago

అన్ని దారులు `ధ‌ర్మేంద్ర` వైపే..!

కేంద్ర ప్ర‌భుత్వం ఎన్ని రూపాల్లో ప్ర‌య‌త్నించినా.. విద్యార్థుల ఆందోళ‌న‌ల‌ను నిలువ‌రించ‌లేక‌పోతోంది. ఇప్ప‌టికే బ‌ల ప్ర‌యోగం చేయ‌డంతో ఇది తీవ్ర వివాదానికి…

7 hours ago