Trends

మొబైల్ ఫోన్ సిగ్న‌ల్స్‌ ప్ర‌దాత.. రంగ‌న్ మృతి!

నేడు దేశంలో 60-70 శాతం మంది ప్ర‌జ‌లు వినియోగిస్తున్న మొబైల్ ఫోన్ల‌కు సిగ్న‌ల్స్ అందించే ఉప‌గ్ర‌హ ప్ర‌యోగాల‌కు.. ఆద్యుడు.. భార‌త అంత‌రిక్ష ప్ర‌యోగాల్లోనే సువ‌ర్ణ అధ్యాయానికి శ్రీకారం చుట్టిన క‌స్తూరి రంగ‌న్‌.. ఉర‌ఫ్ కృష్ణ‌స్వామి క‌స్తూరి రంగ‌న్ ఇక లేరు. 84 ఏళ్ల వ‌య‌సులో బెంగ‌ళూరులో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం.. 1 గంట‌కు ఆయ‌న క‌న్నుమూశారు. గ‌త కొద్దికాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న రంగ‌న్‌.. ఓ ఆసుప‌త్రిలో తుదిశ్వాస విడిచారు.

1940, అక్టోబ‌రు 24న కేర‌ళ‌లోని కొచ్చిన్‌లో జ‌న్మించిన రంగ‌న్‌.. భార‌త అంత‌రిక్ష రంగంలో అనేక ప్ర‌యోగాల‌కు `వేదిక‌గా` నిలిచారు. ముఖ్యంగా సాంతికేత వినియోగంలో ప్ర‌పంచ దేశాల‌కు దీటుగా భార‌త్ ను ముందుకు న‌డిపించాల‌ని క‌ల‌లు క‌న్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న 1980ల‌లో మొబైల్ ఫోన్ల‌కు సిగ్న‌ళ్ల‌కు అందించే వ్య‌వ‌స్థ‌కు శ్రీకారం చుట్టారు. సుమారు 15 సంవ‌త్స‌రాల పాటు.. ఆయ‌న చేసిన కృషి ఫ‌లించి.. భార‌త్‌లో తొలిసారి మొబైల్ సిగ్న‌ళ్లు 1998-99 ప్రాంతంలో అందివ‌చ్చాయి.

ఆత‌ర్వాత‌.. జ‌రిగిన విస్తృత ప‌రిశోధ‌న‌లు.. మొబైళ్ల సిగ్న‌ళ్ల‌తోపాటు.. ఇత‌ర సాంకేతిక స‌హ‌కారాల‌ను కూడా అందించాయి. ఒక్క మొబైల్ సిగ్న‌ళ్లే కాకుండా.. అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌లో మానవ ర‌హిత ప్ర‌యోగాల‌కు కూడా.. ఆయ‌న అప్ప‌ట్లోనే జీవం పోశారు. ఆయ‌న రాసిన‌.. 200ల‌కు పైగా ప‌త్రాలు.. నేటికీ శాస్త్ర‌వేత్త‌ల‌కు ప‌విత్ర గ్రంధాల‌తో స‌మానంగా భావిస్తారు. సుదీర్ఘ కాలం పాటు ఆయ‌న భార‌త అంత‌రిక్ష రంగానికి సేవ‌లు అందించారు.

ప్ర‌స్తుతం చిటికెలో మొబైల్ సిగ్న‌ళ్ల‌ను అందుకునే వ్య‌వ‌స్థ‌కు ఆయ‌నే జ‌వం… జీవం.. పోశారంటూ.. 2000 సంవ‌త్స‌రంలో ఆయ‌న‌కు ప‌ద్మ‌విభూష‌ణ్ ప్ర‌క‌టించిన సంద‌ర్భంగా కేంద్రం వేనోళ్ల కొనియాడింది. కాగా.. ఆయ‌న కు కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్య‌త్వాన్ని కూడా ఇచ్చింది. ఈ క్ర‌మంలోనే క్షేత్ర‌స్థాయిలో విద్యార్థు లకు అంత‌రిక్షంపై అవ‌గాహ‌న పెంచేందుకు పాఠ్యాంశాలు మార్చాలని సూచించారు. కానీ.. అది సాకారం కాలేదు.

This post was last modified on April 25, 2025 4:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

2 hours ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

2 hours ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

5 hours ago

ఇక ‘నెంబర్ వన్’ హీరోయిన్ లేనట్టేనా?

ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…

7 hours ago

విమానాల్లో లోపాలు.. ఎయిర్ ఇండియా, ఇండిగో టాప్!

మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…

8 hours ago

‘కేసీఆర్ కుటుంబాన్ని కిషన్ రెడ్డి కాపాడుతున్నారు’

బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిష‌న్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…

8 hours ago