Trends

అమెరికాలో భారత విద్యార్థులకు బిగ్ షాక్: వీసాల రద్దుపై కలకలం

అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థులపై కొత్త ఆంక్షలు పడుతున్నాయి. ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు ఇది ఆందోళన కలిగించే పరిణామంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న తాజా చర్యలతో దాదాపు 327 మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దయ్యాయి. అతి కీలకమైన ఎస్ఈవీఐఎస్ (SEVIS) రికార్డులను కూడా తొలగించడంతో విద్యార్థులు న్యాయపోరాటానికి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ రద్దయిన వీసాల సంఖ్యలో సగం మంది భారతీయులే ఉన్నారని అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ (AILA) పేర్కొంది. వీసా రద్దు చేసిన విద్యార్థుల్లో 14 శాతం చైనా దేశానికి చెందిన వారు కాగా, మిగతా వారు దక్షిణ కొరియా, నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాలవారు. ఎలాంటి స్పష్టత లేకుండా వీసాలను రద్దు చేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉందని ఎయిలా హితవు పలికింది.

ఈ చర్యలపై పారదర్శకత ఉండాల్సిందని, తప్పుగా తొలగించిన ఎస్ఈవీఐఎస్ రికార్డులపై విద్యార్థులకు విన్నవించుకునే అవకాశం కల్పించాలని అసోసియేషన్ సూచించింది. ఇప్పటికే మాసాచుసెట్స్, మోంటానా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, వాషింగ్టన్ డీసీ వంటి రాష్ట్రాల్లోని న్యాయమూర్తులు విద్యార్థుల హక్కులను రక్షిస్తూ తాత్కాలిక ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయాలు కొన్ని వీసా రద్దులను నిలిపివేసే దిశగా మారాయి.

ప్రస్తుతం దాదాపు 21 ఏళ్ల క్రిష్ ఇస్సర్‌దాసాని అనే భారతీయ విద్యార్థి కేసు అమెరికాలో హాట్ టాపిక్ అయింది. విస్కాన్సిన్‌లోని ఓ బార్‌ దగ్గర జరిగిన ఓ చిన్న గొడవ కారణంగా అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ కేసు లేకుండానే ఏప్రిల్ 4న అతడి ఎస్ఈవీఐఎస్ రికార్డును యూనివర్సిటీ రద్దు చేసింది. ఇది చట్ట విరుద్ధమని న్యాయమూర్తి పేర్కొనడం మరింత చర్చకు దారి తీసింది.

ఇలాంటి నిర్ణయాల వల్ల అమెరికాలో ఉన్న విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడే ప్రమాదం ఉంది. ట్రంప్ పాలనలో వీసా వ్యవహారాలు మరింత కఠినంగా మారుతుండడంతో, భారత ప్రభుత్వం కూడా ఈ అంశంపై స్పందించే అవకాశం కనిపిస్తోంది. త్వరలోనే ఈ వ్యవహారంపై అంతర్జాతీయ స్థాయిలో చర్చలు జరగనున్నట్టు తెలుస్తోంది.

This post was last modified on April 19, 2025 10:10 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

2 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

2 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

4 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

6 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

7 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

7 hours ago