Trends

అమెరికాలో భారత విద్యార్థులకు బిగ్ షాక్: వీసాల రద్దుపై కలకలం

అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థులపై కొత్త ఆంక్షలు పడుతున్నాయి. ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు ఇది ఆందోళన కలిగించే పరిణామంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న తాజా చర్యలతో దాదాపు 327 మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దయ్యాయి. అతి కీలకమైన ఎస్ఈవీఐఎస్ (SEVIS) రికార్డులను కూడా తొలగించడంతో విద్యార్థులు న్యాయపోరాటానికి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ రద్దయిన వీసాల సంఖ్యలో సగం మంది భారతీయులే ఉన్నారని అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ (AILA) పేర్కొంది. వీసా రద్దు చేసిన విద్యార్థుల్లో 14 శాతం చైనా దేశానికి చెందిన వారు కాగా, మిగతా వారు దక్షిణ కొరియా, నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాలవారు. ఎలాంటి స్పష్టత లేకుండా వీసాలను రద్దు చేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉందని ఎయిలా హితవు పలికింది.

ఈ చర్యలపై పారదర్శకత ఉండాల్సిందని, తప్పుగా తొలగించిన ఎస్ఈవీఐఎస్ రికార్డులపై విద్యార్థులకు విన్నవించుకునే అవకాశం కల్పించాలని అసోసియేషన్ సూచించింది. ఇప్పటికే మాసాచుసెట్స్, మోంటానా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, వాషింగ్టన్ డీసీ వంటి రాష్ట్రాల్లోని న్యాయమూర్తులు విద్యార్థుల హక్కులను రక్షిస్తూ తాత్కాలిక ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయాలు కొన్ని వీసా రద్దులను నిలిపివేసే దిశగా మారాయి.

ప్రస్తుతం దాదాపు 21 ఏళ్ల క్రిష్ ఇస్సర్‌దాసాని అనే భారతీయ విద్యార్థి కేసు అమెరికాలో హాట్ టాపిక్ అయింది. విస్కాన్సిన్‌లోని ఓ బార్‌ దగ్గర జరిగిన ఓ చిన్న గొడవ కారణంగా అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ కేసు లేకుండానే ఏప్రిల్ 4న అతడి ఎస్ఈవీఐఎస్ రికార్డును యూనివర్సిటీ రద్దు చేసింది. ఇది చట్ట విరుద్ధమని న్యాయమూర్తి పేర్కొనడం మరింత చర్చకు దారి తీసింది.

ఇలాంటి నిర్ణయాల వల్ల అమెరికాలో ఉన్న విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడే ప్రమాదం ఉంది. ట్రంప్ పాలనలో వీసా వ్యవహారాలు మరింత కఠినంగా మారుతుండడంతో, భారత ప్రభుత్వం కూడా ఈ అంశంపై స్పందించే అవకాశం కనిపిస్తోంది. త్వరలోనే ఈ వ్యవహారంపై అంతర్జాతీయ స్థాయిలో చర్చలు జరగనున్నట్టు తెలుస్తోంది.

This post was last modified on April 19, 2025 10:10 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

1 hour ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

2 hours ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

2 hours ago

శర్వానంద్ భోగికి అసలైన ఛాలెంజ్

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

3 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

3 hours ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

4 hours ago