అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థులపై కొత్త ఆంక్షలు పడుతున్నాయి. ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు ఇది ఆందోళన కలిగించే పరిణామంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న తాజా చర్యలతో దాదాపు 327 మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దయ్యాయి. అతి కీలకమైన ఎస్ఈవీఐఎస్ (SEVIS) రికార్డులను కూడా తొలగించడంతో విద్యార్థులు న్యాయపోరాటానికి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ రద్దయిన వీసాల సంఖ్యలో సగం మంది భారతీయులే ఉన్నారని అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ (AILA) పేర్కొంది. వీసా రద్దు చేసిన విద్యార్థుల్లో 14 శాతం చైనా దేశానికి చెందిన వారు కాగా, మిగతా వారు దక్షిణ కొరియా, నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాలవారు. ఎలాంటి స్పష్టత లేకుండా వీసాలను రద్దు చేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉందని ఎయిలా హితవు పలికింది.
ఈ చర్యలపై పారదర్శకత ఉండాల్సిందని, తప్పుగా తొలగించిన ఎస్ఈవీఐఎస్ రికార్డులపై విద్యార్థులకు విన్నవించుకునే అవకాశం కల్పించాలని అసోసియేషన్ సూచించింది. ఇప్పటికే మాసాచుసెట్స్, మోంటానా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, వాషింగ్టన్ డీసీ వంటి రాష్ట్రాల్లోని న్యాయమూర్తులు విద్యార్థుల హక్కులను రక్షిస్తూ తాత్కాలిక ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయాలు కొన్ని వీసా రద్దులను నిలిపివేసే దిశగా మారాయి.
ప్రస్తుతం దాదాపు 21 ఏళ్ల క్రిష్ ఇస్సర్దాసాని అనే భారతీయ విద్యార్థి కేసు అమెరికాలో హాట్ టాపిక్ అయింది. విస్కాన్సిన్లోని ఓ బార్ దగ్గర జరిగిన ఓ చిన్న గొడవ కారణంగా అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ కేసు లేకుండానే ఏప్రిల్ 4న అతడి ఎస్ఈవీఐఎస్ రికార్డును యూనివర్సిటీ రద్దు చేసింది. ఇది చట్ట విరుద్ధమని న్యాయమూర్తి పేర్కొనడం మరింత చర్చకు దారి తీసింది.
ఇలాంటి నిర్ణయాల వల్ల అమెరికాలో ఉన్న విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడే ప్రమాదం ఉంది. ట్రంప్ పాలనలో వీసా వ్యవహారాలు మరింత కఠినంగా మారుతుండడంతో, భారత ప్రభుత్వం కూడా ఈ అంశంపై స్పందించే అవకాశం కనిపిస్తోంది. త్వరలోనే ఈ వ్యవహారంపై అంతర్జాతీయ స్థాయిలో చర్చలు జరగనున్నట్టు తెలుస్తోంది.
ఏపీ సీఎం చంద్రబాబు.. పాలన, ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు, భవిష్యత్తు ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణం.. వంటి పలు…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…
జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…
ఏపీలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందని.. మళ్లీ మళ్లీ ప్రభుత్వం మారే పరిస్థితి కూడా ఉండదని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఆ…