Trends

విమానంలో హైజాకర్ దాడి.. హత్య చేసిన ప్రయాణికుడు

బెలిజ్ దేశంలో ఓ చిన్నపాటి విమానంలో హైజాక్ యత్నం తీవ్ర కలకలం రేపింది. ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో ఒక్కసారిగా కత్తితో దాడికి దిగిన వ్యక్తిని, మరో ప్రయాణికుడు తుపాకీతో కాల్చి చంపిన ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన గురువారం మెక్సికో సరిహద్దుకు సమీపంలోని కొరోజల్ పట్టణం నుండి శాన్ పెడ్రో నగరానికి బయలుదేరిన ట్రోపిక్ ఎయిర్ విమానంలో జరిగింది.

ఈ విమానంలో మొత్తం 14 మంది ప్రయాణికులు ఉన్నారు. అమెరికాకు చెందిన అకిన్యేల సావా టేలర్ అనే వ్యక్తి తన వద్ద ఉన్న కత్తితో పైలట్‌పై దాడి చేస్తూ, విమానాన్ని దేశం వెలుపలికి మళ్లించాలని డిమాండ్ చేశాడు. అంతేకాకుండా, ఇంధనం నింపేందుకు ల్యాండ్ చేయాలంటూ హడావుడి చేశాడు. ఈ గందరగోళంలో పైలట్‌తో పాటు మరో ఇద్దరు ప్రయాణికులు కత్తి దాడిలో గాయపడ్డారు. విమానంలో బీభత్స వాతావరణం నెలకొంది.

అయితే, అదే సమయంలో గాయపడిన ప్రయాణికుల్లో ఒకరికి లైసెన్స్ ఉన్న తుపాకీ ఉండటంతో, అతను తీవ్రంగా స్పందించాడు. విమానం ల్యాండ్ కావడానికి కాస్త ముందే, హైజాకర్ టేలర్‌పై కాల్పులు జరిపాడు. బుల్లెట్ టేలర్ ఛాతీకి తగలడంతో అతను కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

గాయపడిన ముగ్గురు బెలిజ్ పౌరులకు ప్రస్తుతానికి వైద్య సాయం అందిస్తున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విమానం ఇంధనం కూడా అయిపోతున్న పరిస్థితిలో ఉన్నా, పైలట్ చాకచక్యంగా విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడం ప్రాణాపాయం నుంచి అందరిని కాపాడింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

This post was last modified on April 18, 2025 3:21 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

కొత్త ట్విస్టు… కేరళ స్టోరీ 2 వస్తోంది

స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…

31 minutes ago

డీఎంకే స్ట్రోక్… బీజేపీకి షాక్!

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాల‌ని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ త‌గిలింది.…

52 minutes ago

జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…

2 hours ago

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న…

3 hours ago

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…

3 hours ago

బాబు ఎఫెక్ట్.. ఏపీకి మరో బడా కంపెనీ

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వ‌స్తున్న సంస్థ‌లు కూట‌మి ప్ర‌భుత్వం ప‌ట్ల‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ట్ల అత్యంత విశ్వ‌స‌నీయ‌త ప్ర‌ద‌ర్శిస్తున్న విష‌యం…

3 hours ago