ఎలక్ట్రిక్ వాహనాల ప్రపంచంలో అగ్రగామిగా నిలిచిన టెస్లా భారత్కు రావడానికి ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ముంబయి–పుణె ఎక్స్ప్రెస్వేపై ఓ టెస్లా కార్ భారీ క్యామోఫ్లాజ్తో ప్రయాణించడాన్ని కొందరు ట్రాఫిక్ ప్యాసింజర్లు గుర్తించగా, దాని వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇది కేవలం టెస్ట్ డ్రైవ్ కాదన్న భావన బలపడుతోంది. భారత్ మార్కెట్లో ప్రవేశానికి టెస్లా పక్కా ప్లాన్ చేస్తోందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
ఈ కారు టెస్లా ‘మోడల్ వై’కి సంబంధించిన ఫేస్లిఫ్ట్ వెర్షన్ అని గుర్తించబడింది. అంతర్జాతీయంగా ఈ మోడల్ను ‘జూనిపర్’ కోడ్ నేమ్తో పిలుస్తున్నారు. దీని రూపకల్పనలో సరికొత్త డిజైన్ అంశాలు కనిపించగా, ముఖ్యంగా సీ-షేప్ టెయిల్ లైట్లు, మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్, గ్లాస్ రూఫ్ వంటి ప్రత్యేకతలు ఈ కారులో కనిపించాయి. అంటే, ఇది సాధారణ మోడల్ కాదని స్పష్టమవుతోంది.
గ్లోబల్ వెర్షన్ స్పెసిఫికేషన్ల ప్రకారం, మోడల్ వై ఓ ఆల్ వీల్ డ్రైవ్ ఎస్యూవీ. దీని టాప్ వేరియంట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 520 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. 0 నుంచి 100 కి.మీ వేగాన్ని కేవలం 4.6 సెకన్లలో చేరుకుంటుంది. అంతేకాదు, 15.4 అంగుళాల టచ్స్క్రీన్, వెనుక ప్రయాణికుల కోసం 8 అంగుళాల సెకండరీ స్క్రీన్ వంటి టెక్ ఫీచర్లు ఇందులో ఉండే అవకాశముంది.
అయితే భారత్లో విడుదలయ్యే మోడల్ స్పెసిఫికేషన్లలో కొంత భిన్నత ఉండొచ్చని వాహన పరిశ్రమ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ధర, బ్యాటరీ రేంజ్, ఫీచర్లు భారత వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఉండేలా స్థానికీకరణ జరిపే అవకాశముంది. అంతేకాకుండా, చైనా లేదా ఇండోనేషియా అసెంబ్లీ యూనిట్ల నుంచి వాహనాలు దిగుమతి చేసే వ్యూహాన్ని టెస్లా అనుసరించవచ్చని టాక్.
This post was last modified on April 17, 2025 4:04 pm
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…
ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…
మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిషన్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…