Trends

ఎన్టీఆర్ జిల్లాలో స్పోర్ట్స్ సిటీ.. నది తీరాన అత్యంత భారీగా..

ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడు సమీపంగా భారీ క్రీడా నగరాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. కృష్ణా నది తీరంలో 1,600 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్పోర్ట్స్ సిటీని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. పెదలంక, చిన్నలంక గ్రామాల పరిధిలో ఈ భూమిని గుర్తించగా, అమరావతికి సమీపంగా ఉండటం ఇది ప్రధాన ఆకర్షణగా మారింది. రాజధాని ప్రణాళికల్లోనే మొదట స్పోర్ట్స్ సిటీని నిర్మించాలనుకున్నా, అవసరమైన స్థలాభావం వల్ల ప్రత్యామ్నాయంగా మూలపాడు ప్రాంతాన్ని ఎంపిక చేశారు.

ఈ స్పోర్ట్స్ సిటీలో అన్ని రకాల క్రీడలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన భారీ క్రికెట్ స్టేడియాన్ని కూడా నిర్మించాలన్నది ఏపీ ప్రభుత్వ ఆలోచన. ప్రస్తుతం మంగళగిరిలో ఉన్న స్టేడియం అంతర్జాతీయ మ్యాచ్‌లకు తగినంతగా లేదన్న అభిప్రాయంతో, 25,000 మంది కూర్చునే సామర్థ్యంతో కూడిన క్రికెట్ స్టేడియాన్ని కొత్తగా నిర్మించాలని ఏపీ క్రికెట్ అసోసియేషన్ (ACA) ప్రతిపాదించింది.

ఈ నిర్మాణానికి కావాల్సిన మొత్తం వ్యయంలో 60 శాతాన్ని బీసీసీఐ భరిస్తుందని, మిగతా 40 శాతాన్ని ఏసీఏ సమకూర్చనుందని సమాచారం. స్టేడియం పూర్తయిన తర్వాత ఏటా కనీసం 10 అంతర్జాతీయ మ్యాచ్‌లను ఇక్కడ నిర్వహించే అవకాశముందని బీసీసీఐ హామీ ఇచ్చింది. దీనివల్ల రాష్ట్రానికి మరింత క్రీడా ప్రోత్సాహం లభించనుంది.

ప్రతిపాదిత ప్రాజెక్ట్‌పై పరిశీలన కోసం పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు కలిసి ప్రదేశాన్ని సందర్శించారు. స్పోర్ట్స్ సిటీ సాధ్యాసాధ్యాలపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ప్రతి భూమికి సరైన పరిహారం చెల్లించే దిశగా అడుగులు వేస్తోంది.

ఈ స్పోర్ట్స్ సిటీ పూర్తి అయితే, ఇది కేవలం రాష్ట్రానికే కాదు.. దేశవ్యాప్తంగా క్రీడా రంగానికి ఒక గొప్ప కేంద్రంగా నిలిచే అవకాశముంది. ఒలింపిక్ స్థాయి సదుపాయాలతో, అత్యాధునికంగా ఉండే ఈ క్రీడా నగరం అమరావతికి మరింత గౌరవాన్ని తీసుకురానుంది. ఇది క్రీడాకారులకు శిక్షణా కేంద్రంగా మారే క్రమంలో, యువతకు కొత్త అవకాశాలను సృష్టించనుంది.

This post was last modified on April 15, 2025 9:14 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

23 minutes ago

పెంపుడు పిల్లి చ‌నిపోయింద‌ని.. ఉరేసుకున్న విద్యార్థిని!

పెంపుడు జంతువుల ప‌ట్ల య‌జ‌మానులు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రేమ‌ను పెంచుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయా జంతువులు…

45 minutes ago

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

2 hours ago

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

5 hours ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

5 hours ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

6 hours ago