ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడు సమీపంగా భారీ క్రీడా నగరాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. కృష్ణా నది తీరంలో 1,600 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్పోర్ట్స్ సిటీని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. పెదలంక, చిన్నలంక గ్రామాల పరిధిలో ఈ భూమిని గుర్తించగా, అమరావతికి సమీపంగా ఉండటం ఇది ప్రధాన ఆకర్షణగా మారింది. రాజధాని ప్రణాళికల్లోనే మొదట స్పోర్ట్స్ సిటీని నిర్మించాలనుకున్నా, అవసరమైన స్థలాభావం వల్ల ప్రత్యామ్నాయంగా మూలపాడు ప్రాంతాన్ని ఎంపిక చేశారు.
ఈ స్పోర్ట్స్ సిటీలో అన్ని రకాల క్రీడలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన భారీ క్రికెట్ స్టేడియాన్ని కూడా నిర్మించాలన్నది ఏపీ ప్రభుత్వ ఆలోచన. ప్రస్తుతం మంగళగిరిలో ఉన్న స్టేడియం అంతర్జాతీయ మ్యాచ్లకు తగినంతగా లేదన్న అభిప్రాయంతో, 25,000 మంది కూర్చునే సామర్థ్యంతో కూడిన క్రికెట్ స్టేడియాన్ని కొత్తగా నిర్మించాలని ఏపీ క్రికెట్ అసోసియేషన్ (ACA) ప్రతిపాదించింది.
ఈ నిర్మాణానికి కావాల్సిన మొత్తం వ్యయంలో 60 శాతాన్ని బీసీసీఐ భరిస్తుందని, మిగతా 40 శాతాన్ని ఏసీఏ సమకూర్చనుందని సమాచారం. స్టేడియం పూర్తయిన తర్వాత ఏటా కనీసం 10 అంతర్జాతీయ మ్యాచ్లను ఇక్కడ నిర్వహించే అవకాశముందని బీసీసీఐ హామీ ఇచ్చింది. దీనివల్ల రాష్ట్రానికి మరింత క్రీడా ప్రోత్సాహం లభించనుంది.
ప్రతిపాదిత ప్రాజెక్ట్పై పరిశీలన కోసం పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు కలిసి ప్రదేశాన్ని సందర్శించారు. స్పోర్ట్స్ సిటీ సాధ్యాసాధ్యాలపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ప్రతి భూమికి సరైన పరిహారం చెల్లించే దిశగా అడుగులు వేస్తోంది.
ఈ స్పోర్ట్స్ సిటీ పూర్తి అయితే, ఇది కేవలం రాష్ట్రానికే కాదు.. దేశవ్యాప్తంగా క్రీడా రంగానికి ఒక గొప్ప కేంద్రంగా నిలిచే అవకాశముంది. ఒలింపిక్ స్థాయి సదుపాయాలతో, అత్యాధునికంగా ఉండే ఈ క్రీడా నగరం అమరావతికి మరింత గౌరవాన్ని తీసుకురానుంది. ఇది క్రీడాకారులకు శిక్షణా కేంద్రంగా మారే క్రమంలో, యువతకు కొత్త అవకాశాలను సృష్టించనుంది.
This post was last modified on April 15, 2025 9:14 pm
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…
ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…
మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిషన్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…