ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడు సమీపంగా భారీ క్రీడా నగరాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. కృష్ణా నది తీరంలో 1,600 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్పోర్ట్స్ సిటీని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. పెదలంక, చిన్నలంక గ్రామాల పరిధిలో ఈ భూమిని గుర్తించగా, అమరావతికి సమీపంగా ఉండటం ఇది ప్రధాన ఆకర్షణగా మారింది. రాజధాని ప్రణాళికల్లోనే మొదట స్పోర్ట్స్ సిటీని నిర్మించాలనుకున్నా, అవసరమైన స్థలాభావం వల్ల ప్రత్యామ్నాయంగా మూలపాడు ప్రాంతాన్ని ఎంపిక చేశారు.
ఈ స్పోర్ట్స్ సిటీలో అన్ని రకాల క్రీడలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన భారీ క్రికెట్ స్టేడియాన్ని కూడా నిర్మించాలన్నది ఏపీ ప్రభుత్వ ఆలోచన. ప్రస్తుతం మంగళగిరిలో ఉన్న స్టేడియం అంతర్జాతీయ మ్యాచ్లకు తగినంతగా లేదన్న అభిప్రాయంతో, 25,000 మంది కూర్చునే సామర్థ్యంతో కూడిన క్రికెట్ స్టేడియాన్ని కొత్తగా నిర్మించాలని ఏపీ క్రికెట్ అసోసియేషన్ (ACA) ప్రతిపాదించింది.
ఈ నిర్మాణానికి కావాల్సిన మొత్తం వ్యయంలో 60 శాతాన్ని బీసీసీఐ భరిస్తుందని, మిగతా 40 శాతాన్ని ఏసీఏ సమకూర్చనుందని సమాచారం. స్టేడియం పూర్తయిన తర్వాత ఏటా కనీసం 10 అంతర్జాతీయ మ్యాచ్లను ఇక్కడ నిర్వహించే అవకాశముందని బీసీసీఐ హామీ ఇచ్చింది. దీనివల్ల రాష్ట్రానికి మరింత క్రీడా ప్రోత్సాహం లభించనుంది.
ప్రతిపాదిత ప్రాజెక్ట్పై పరిశీలన కోసం పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు కలిసి ప్రదేశాన్ని సందర్శించారు. స్పోర్ట్స్ సిటీ సాధ్యాసాధ్యాలపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ప్రతి భూమికి సరైన పరిహారం చెల్లించే దిశగా అడుగులు వేస్తోంది.
ఈ స్పోర్ట్స్ సిటీ పూర్తి అయితే, ఇది కేవలం రాష్ట్రానికే కాదు.. దేశవ్యాప్తంగా క్రీడా రంగానికి ఒక గొప్ప కేంద్రంగా నిలిచే అవకాశముంది. ఒలింపిక్ స్థాయి సదుపాయాలతో, అత్యాధునికంగా ఉండే ఈ క్రీడా నగరం అమరావతికి మరింత గౌరవాన్ని తీసుకురానుంది. ఇది క్రీడాకారులకు శిక్షణా కేంద్రంగా మారే క్రమంలో, యువతకు కొత్త అవకాశాలను సృష్టించనుంది.
This post was last modified on April 15, 2025 9:14 pm
స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది.…
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలు కూటమి ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల అత్యంత విశ్వసనీయత ప్రదర్శిస్తున్న విషయం…