Trends

భారతీయులకు ఇలా జరగాల్సిందే… రాణా కామెంట్స్ వైరల్

26/11 ముంబై ఉగ్రదాడుల కేసులో కీలక నిందితుడైన తహవ్వుర్ హుస్సేన్ రాణా భారతదేశానికి అప్పగించబడటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెరికాలో అరెస్టై కొంతకాలంగా న్యాయపోరాటం చేసిన ఈ నిందితుడు, చివరకు భారత్‌కి రావాల్సి వచ్చింది. ఆయనను ఢిల్లీకి తీసుకొచ్చిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అధికారులు ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుపర్చగా, కోర్టు 18 రోజుల కస్టడీకి అనుమతిచ్చింది.

రాణా బాల్యమిత్రుడు డేవిడ్ హెడ్లీతో కలిసి ఈ దాడులకు కుట్ర పన్నినట్టు ఎన్ఐఏ ఇప్పటికే ఆరోపించింది. అంతేకాదు, దాడుల అనంతరం రాణా “భారతీయులు దీనికి అర్హులే… వాళ్లకు ఇలా జరగాల్సిందే” అన్నట్లుగా హెడ్లీతో మాట్లాడినట్లు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ వెల్లడించింది. ఈ వ్యాఖ్యలు దేశంలోని ప్రజలను తీవ్రంగా కలిచివేశాయి.

తహవ్వుర్ రాణా పాకిస్తాన్ ఆర్మీలో డాక్టరుగా పనిచేసిన తరువాత కెనడా పౌరుడిగా మారి అమెరికాలో వీసా కన్సల్టెంట్‌గా వ్యాపారం ప్రారంభించాడు. అదే వ్యాపారాన్ని ముసుగుగా ఉపయోగించి హెడ్లీకి మద్దతిచ్చినట్టు తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి లష్కరే తోయిబా ఉగ్రవాదుల కోసం ముంబైలోని టార్గెట్లను గుర్తించి దాడికి మార్గం సిద్ధం చేశారు.

ఈ కేసులో రాణా పేరును తొలిసారిగా వెల్లడించిన సమయంలోనే అమెరికా అతడిపై పలు కేసులు నమోదు చేసింది. భారత్ మాత్రం సుదీర్ఘ న్యాయప్రక్రియ ద్వారా ఆయనను భారత్‌కు తీసుకురావడానికి కృషి చేసింది. చివరికి, అమెరికా సుప్రీం కోర్టు ‘అప్పగింతకు ఎలాంటి అడ్డంకులు లేవు’ అని తేల్చడంతో అతడి ప్రయాణం భారత్ దిశగా సాగింది.

హోం మంత్రి అమిత్ షా స్పందిస్తూ, “ఇది 26/11 బాధితుల పక్షాన న్యాయం జరగే ఒక ప్రధాన ప్రక్రియ,” అన్నారు. ఎన్ఐఏ కూడా ఈ విచారణలో ముంబై దాడుల వెనుక ఉన్న అంతర్గత కుట్రలు బయటపడతాయని ఆశిస్తోంది. ఇక తహవ్వుర్ రాణా విచారణ ఏ మేరకు నూతన ఆధారాలు వెలుగులోకి తీసుకొస్తుందో చూడాలి.

This post was last modified on April 11, 2025 6:59 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

2 hours ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

3 hours ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

5 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

10 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

10 hours ago