26/11 ముంబై ఉగ్రదాడుల కేసులో కీలక నిందితుడైన తహవ్వుర్ హుస్సేన్ రాణా భారతదేశానికి అప్పగించబడటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెరికాలో అరెస్టై కొంతకాలంగా న్యాయపోరాటం చేసిన ఈ నిందితుడు, చివరకు భారత్కి రావాల్సి వచ్చింది. ఆయనను ఢిల్లీకి తీసుకొచ్చిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అధికారులు ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుపర్చగా, కోర్టు 18 రోజుల కస్టడీకి అనుమతిచ్చింది.
రాణా బాల్యమిత్రుడు డేవిడ్ హెడ్లీతో కలిసి ఈ దాడులకు కుట్ర పన్నినట్టు ఎన్ఐఏ ఇప్పటికే ఆరోపించింది. అంతేకాదు, దాడుల అనంతరం రాణా “భారతీయులు దీనికి అర్హులే… వాళ్లకు ఇలా జరగాల్సిందే” అన్నట్లుగా హెడ్లీతో మాట్లాడినట్లు యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వెల్లడించింది. ఈ వ్యాఖ్యలు దేశంలోని ప్రజలను తీవ్రంగా కలిచివేశాయి.
తహవ్వుర్ రాణా పాకిస్తాన్ ఆర్మీలో డాక్టరుగా పనిచేసిన తరువాత కెనడా పౌరుడిగా మారి అమెరికాలో వీసా కన్సల్టెంట్గా వ్యాపారం ప్రారంభించాడు. అదే వ్యాపారాన్ని ముసుగుగా ఉపయోగించి హెడ్లీకి మద్దతిచ్చినట్టు తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి లష్కరే తోయిబా ఉగ్రవాదుల కోసం ముంబైలోని టార్గెట్లను గుర్తించి దాడికి మార్గం సిద్ధం చేశారు.
ఈ కేసులో రాణా పేరును తొలిసారిగా వెల్లడించిన సమయంలోనే అమెరికా అతడిపై పలు కేసులు నమోదు చేసింది. భారత్ మాత్రం సుదీర్ఘ న్యాయప్రక్రియ ద్వారా ఆయనను భారత్కు తీసుకురావడానికి కృషి చేసింది. చివరికి, అమెరికా సుప్రీం కోర్టు ‘అప్పగింతకు ఎలాంటి అడ్డంకులు లేవు’ అని తేల్చడంతో అతడి ప్రయాణం భారత్ దిశగా సాగింది.
హోం మంత్రి అమిత్ షా స్పందిస్తూ, “ఇది 26/11 బాధితుల పక్షాన న్యాయం జరగే ఒక ప్రధాన ప్రక్రియ,” అన్నారు. ఎన్ఐఏ కూడా ఈ విచారణలో ముంబై దాడుల వెనుక ఉన్న అంతర్గత కుట్రలు బయటపడతాయని ఆశిస్తోంది. ఇక తహవ్వుర్ రాణా విచారణ ఏ మేరకు నూతన ఆధారాలు వెలుగులోకి తీసుకొస్తుందో చూడాలి.
This post was last modified on April 11, 2025 6:59 pm
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…