ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రుతురాజ్ గైక్వాడ్కు గాయమవడంతో సీజన్ మొత్తానికి తప్పుకున్నాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన షార్ట్ బాల్ గాయపరిచిందని, దాంతో ఎల్బోలో హెయిర్లైన్ ఫ్రాక్చర్ వచ్చిందని చెన్నై హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ చరిత్రలో ఐదు ట్రోఫీలు అందించిన మహేంద్ర సింగ్ ధోనికి మళ్లీ నాయకత్వ బాధ్యతలు అప్పగించారు.
ధోని శుక్రవారం నుంచి కోల్కతా నైట్ రైడర్స్తో జరిగే మ్యాచ్తో మళ్లీ కెప్టెన్గా తలపడనున్నారు. ఇప్పటికే ఐపీఎల్ 2025లో చెన్నై ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. ఇప్పటివరకు ఐదు మ్యాచ్లలో నాలుగు ఓటములు చవిచూసిన సీఎస్కే.. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. జట్టు పతనాన్ని తడిపేందుకు మళ్లీ ధోని నాయకత్వం కీలకం కానుంది.
ఇక పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ధోని తన మార్క్ షాట్లతో అభిమానులను ఉర్రూతలూగించారు. కేవలం 12 బంతుల్లో 27 పరుగులు చేసిన మహీ.. చివరి ఓవర్లో అవుట్ కావడంతో మ్యాచ్ చేజారిపోయింది. కానీ ఆయన ఆటతీరు, బాడీ లాంగ్వేజ్ చూస్తే ఇంకా జోష్లో ఉన్నట్టు అర్థమవుతోంది. ధోనికి బ్యాటింగ్ ఆర్డర్లో ముందు అవకాశం ఇవ్వాలని మాజీ క్రికెటర్స్ కూడా వ్యాఖ్యానించారు.
ధోని ఆఖర్లో వచ్చే బదులు 4 లేదా 5వ స్థానాల్లో వస్తే సీఎస్కే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే, మళ్లీ కెప్టెన్గా ధోని మైదానంలో అడుగుపెడుతున్న తరుణంలో, ఈ కంబాక్ను టీమ్ సానుకూలంగా మలచుకుంటే ప్లే ఆఫ్స్ రేసులో నిలవవచ్చు. ధోని ఆటతీరు కంటే ఇప్పట్లో అభిమానులకు ఎంతో ముఖ్యమైన విషయం.. అతను మళ్లీ కెప్టెన్గా మైదానంలో కనిపించడమే అసలైన కిక్కు అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మరి మిస్టర్ కూల్ ఈ కఠిన సమయంలో ఎలాంటి విజయాలు అందిస్తాడో చూడాలి.
This post was last modified on April 10, 2025 6:56 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…