Trends

చెన్నై సూపర్ కింగ్స్ వదులుకున్న జాక్ పాట్

ఐపీఎల్‌లో ముంబయితో సమానంగా ఐదుసార్లు విజేతగా నిలిచిన జట్టు.. చెన్నై సూపర్ కింగ్స్. ముంబయి కంటే ఎక్కువగా ఫైనల్స్ ఆడిన, ప్లేఆఫ్స్ దాటిన నేపథ్యంలో ఆ జట్టును మోస్ట్ సక్సెస్ ఫుల్ టీంగానూ చెప్పొచ్చు. అంత ఘన చరిత్ర ఉన్న జట్టు.. ఈ సీజన్ల పేలవ ప్రదర్శన చేస్తోంది. విజయంతో సీజన్‌ను ఆరంభించిన ఆ జట్టు.. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది.

చెన్నై నాలుగో ఓటమిలో ప్రియాంశ్ ఆర్య అనే కుర్రాడు ముఖ్య పాత్ర పోషించాడు. ఢిల్లీకి చెందిన ఈ 24 ఏళ్ల కుర్రాడిని వేలంలో రూ.3.8 కోట్లకు కొనుక్కుంది పంజాబ్ జట్టు. ఈసారి ఐపీఎల్ ఆరంభానికి ముందు జరిగిన ఢిల్లీ ప్రిమియర్ లీగ్‌లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదడమే కాక.. 50 బంతుల్లోనే 120 పరుగులు సాధించాడతను.

ఈ కుర్రాడి ప్రతిభను గుర్తించిన చెన్నై సూపర్ కింగ్స్ టాలెంట్ స్కౌట్ కోచ్ ఒకరు.. జట్టు యాజమాన్యానికి తన గురించి చెప్పాడట. వేలంలో అతణ్ని కొనుక్కోమని సూచించాడట. కానీ చెన్నై యాజమాన్యం మాత్రం ప్రియాంశ్‌ను వదిలేసి.. రాహుల్ త్రిపాఠిని ఎంచుకుంది. అతనీ సీజన్లో పేలవ ప్రదర్శన చేసి జట్టులో చోటు కోల్పోయాడు. పంజాబ్ సొంతమైన ప్రియాంశ్ మాత్రం తొలి మ్యాచ్‌లోనే 47 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

చెన్నై మీద ఇంకా చెలరేగిపోయిన అతను.. కేవలం 39 బంతుల్లోనే సెంచరీ కొట్టి చెన్నైకి మ్యాచ్‌ను దూరం చేశాడు. ఈ మ్యాచ్ జరుగుతుండగానే ఒక వీడియో ఇంటర్వ్యూలో సదరు కోచ్.. చెన్నై యాజమాన్యం తన మాట వినకుండా ప్రియాంశ్‌ను ఎలా దూరం చేసుకుందో చెప్పాడు. దీంతో జట్టును సీనియర్ ఆటగాళ్లతో నింపి నాశనం చేస్తున్నారంటూ చెన్నై అభిమానులు యాజమాన్యాన్ని తిట్టిపోస్తున్నారు.

This post was last modified on April 9, 2025 2:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…

58 minutes ago

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న…

2 hours ago

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…

2 hours ago

బాబు ఎఫెక్ట్.. ఏపీకి మరో బడా కంపెనీ

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వ‌స్తున్న సంస్థ‌లు కూట‌మి ప్ర‌భుత్వం ప‌ట్ల‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ట్ల అత్యంత విశ్వ‌స‌నీయ‌త ప్ర‌ద‌ర్శిస్తున్న విష‌యం…

2 hours ago

మద్యం కేసులో క్లీన్ చిట్.. స్పీడు పెంచనున్న కవిత

ఢిల్లీ మ‌ద్యం కేసులో త‌న‌ను నిర‌ప‌రాధిగా పేర్కొన్న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టుకు తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు.. క‌విత కృత‌జ్ఞ‌త‌లు…

4 hours ago

రెహమాన్ మళ్ళీ గెలవడం పక్కానా

పెద్ది ప్రకటన టైంలో సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ని ఎంచుకోవడం గురించి మెగా ఫ్యాన్స్ అప్పట్లో రకరకాల అనుమానాలు…

4 hours ago