ఇండియాలో కరోనాను సీరియస్గా తీసుకునే రోజులు పోయాయి. గతంతో పోలిస్తే కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిన మాట వాస్తవం. కానీ ఇంకా ముప్పు మాత్రం తొలగిపోలేదు. ఇంకా కేసులో పెద్ద ఎత్తునే నమోదవుతున్నాయి. మరణాలు సంభవిస్తున్నాయి. కానీ ఇటు జనాలు, అటు నాయకుల తీరు మాత్రం అసలిప్పుడు కరోనా ప్రభావమే లేనట్లుగా ఉంటోంది.
కానీ ఒకవేళ కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టిందనుకున్నా.. మళ్లీ విజృంభించడానికి అవకాశాలు మెండుగానే ఉన్నాయని యూరప్ దేశాల్లో పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడా దేశాల్ని భయం గుప్పెటలోకి నెడుతోంది. ఒక్కసారిగా పెరిగిపోతున్న కేసులు, మరణాలతో ఆ దేశాలు వణికిపోతున్నాయి.
తొలిసారి కరోనా విజృంభణతో అల్లాడిన ఇటలీ, స్పెయిన్, జర్మనీ లాంటి దేశాలు.. కట్టుదిట్టమైన చర్యలతో కొన్ని నెలల్లోనే కోలుకున్నాయి. అక్కడ నెమ్మదిగా అన్ని కార్యకలాపాలూ పునరద్ధరించారు. జనం అన్ని పనులూ చేసుకున్నారు. వ్యవస్థలన్నీ పుంజుకున్నాయి. థియేటర్లు సైతం తెరుచుకున్నాయి. సినిమాల సందడి కూడా మొదలైంది. కానీ ఈ నెలలో మళ్లీ కరోనా విజృంభణ మొదలైంది. ఈ దేశాల్లో మళ్లీ రోజు వారీ వేలల్లో కేసులు నమోదువుతున్నాయి. మరణాలు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటున్నాయి. దీంతో ఆ దేశాల్లో థియేటర్లు, మాల్స్ మళ్లీ మూసేయాల్సి వచ్చింది. యూరప్ దేశాల్లో పరిస్థితి ఇలా ఉంటే.. మన దగ్గర కరోనా ఉనికే లేదన్నట్లుగా జనాలు మామూలుగా తిరిగేస్తుండటం ప్రమాద ఘంటికల్ని మోగించేదే.
This post was last modified on October 29, 2020 11:14 am
గత ఏడాది ప్రతిష్ఠాత్మకంగా గద్దర్ అవార్డులను మొదలుపెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. ఒకేసారి చాలా ఏళ్లకు కలిపి అవార్డులు ప్రకటించిన సంగతి…
దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…