ఇండియాలో కరోనాను సీరియస్గా తీసుకునే రోజులు పోయాయి. గతంతో పోలిస్తే కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిన మాట వాస్తవం. కానీ ఇంకా ముప్పు మాత్రం తొలగిపోలేదు. ఇంకా కేసులో పెద్ద ఎత్తునే నమోదవుతున్నాయి. మరణాలు సంభవిస్తున్నాయి. కానీ ఇటు జనాలు, అటు నాయకుల తీరు మాత్రం అసలిప్పుడు కరోనా ప్రభావమే లేనట్లుగా ఉంటోంది.
కానీ ఒకవేళ కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టిందనుకున్నా.. మళ్లీ విజృంభించడానికి అవకాశాలు మెండుగానే ఉన్నాయని యూరప్ దేశాల్లో పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడా దేశాల్ని భయం గుప్పెటలోకి నెడుతోంది. ఒక్కసారిగా పెరిగిపోతున్న కేసులు, మరణాలతో ఆ దేశాలు వణికిపోతున్నాయి.
తొలిసారి కరోనా విజృంభణతో అల్లాడిన ఇటలీ, స్పెయిన్, జర్మనీ లాంటి దేశాలు.. కట్టుదిట్టమైన చర్యలతో కొన్ని నెలల్లోనే కోలుకున్నాయి. అక్కడ నెమ్మదిగా అన్ని కార్యకలాపాలూ పునరద్ధరించారు. జనం అన్ని పనులూ చేసుకున్నారు. వ్యవస్థలన్నీ పుంజుకున్నాయి. థియేటర్లు సైతం తెరుచుకున్నాయి. సినిమాల సందడి కూడా మొదలైంది. కానీ ఈ నెలలో మళ్లీ కరోనా విజృంభణ మొదలైంది. ఈ దేశాల్లో మళ్లీ రోజు వారీ వేలల్లో కేసులు నమోదువుతున్నాయి. మరణాలు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటున్నాయి. దీంతో ఆ దేశాల్లో థియేటర్లు, మాల్స్ మళ్లీ మూసేయాల్సి వచ్చింది. యూరప్ దేశాల్లో పరిస్థితి ఇలా ఉంటే.. మన దగ్గర కరోనా ఉనికే లేదన్నట్లుగా జనాలు మామూలుగా తిరిగేస్తుండటం ప్రమాద ఘంటికల్ని మోగించేదే.
This post was last modified on October 29, 2020 11:14 am
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…