మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఇటీవల ఊహించని పరిణామం సంచలనం సృష్టించింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది తల వెంట్రుకలు ఒక్కసారిగా రాలిపోవడం ప్రారంభమైంది. ఈ పరిస్థితి 18 గ్రామాల్లో 279 మందిని ప్రభావితం చేసింది. ఆడవారు, పిల్లలు, వృద్ధులు ఇలా అందరూ ఈ సమస్యతో సతమతమవుతుండగా, అసలు కారణం ఏమిటో అర్థం కాక కొన్నాళ్ళు ప్రజలు ఆందోళనకు గురయ్యారు.
ప్రభావితుల తల వెంట్రుకలు, రక్త నమూనాలను సేకరించి పరిశీలించిన వైద్య నిపుణులు అసలు సమస్యను గుర్తించారు. ఆ జిల్లాలో వినియోగిస్తున్న గోధుమల్లో అధిక స్థాయిలో సెలీనియం ఉన్నట్టుగా తేలింది. పంజాబ్, హర్యానా నుంచి దిగుమతి చేసుకున్న గోధుమల్లో సాధారణ స్థాయికి 600 రెట్లు ఎక్కువగా సెలీనియం ఉందని, ఈ గోధుమలను ఆహారంలో ఎక్కువగా ఉపయోగించడం వల్ల జుట్టు రాలే సమస్య ఏర్పడిందని పరిశోధకులు తెలిపారు.
సెలీనియం అనేది శరీరానికి అవసరమైన ఖనిజ పదార్థమే అయినా, మోతాదుకు మించి తీసుకుంటే గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యంగా జుట్టు రాలిపోవడమే కాకుండా తలనొప్పి, జ్వరం, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. బుల్దానా జిల్లాలో బాధితులలో ఈ లక్షణాలు కూడా కనిపించడం గమనార్హం.
అయితే, ఆ ప్రాంతంలో ఉన్న గోధుమలను మార్చడం ద్వారా సమస్య తగ్గుముఖం పట్టింది. వైద్య నిపుణుల సూచన మేరకు స్థానిక గోధుమలను ఉపయోగించడం ప్రారంభించడంతో చాలా మందిలో జుట్టు రాలే సమస్య తగ్గిపోయిందని అధికారులు వెల్లడించారు. ఒక సాధారణ ఆహార పదార్థం, మోతాదు తప్పితే ఎంతటి సమస్యను తెచ్చిపెట్టొచ్చో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.
This post was last modified on February 25, 2025 8:34 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…