Trends

పట్టుకుంటే ఊడిపోయే జుట్టు.. అసలు కారణమిదే..

మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఇటీవల ఊహించని పరిణామం సంచలనం సృష్టించింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది తల వెంట్రుకలు ఒక్కసారిగా రాలిపోవడం ప్రారంభమైంది. ఈ పరిస్థితి 18 గ్రామాల్లో 279 మందిని ప్రభావితం చేసింది. ఆడవారు, పిల్లలు, వృద్ధులు ఇలా అందరూ ఈ సమస్యతో సతమతమవుతుండగా, అసలు కారణం ఏమిటో అర్థం కాక కొన్నాళ్ళు ప్రజలు ఆందోళనకు గురయ్యారు.

ప్రభావితుల తల వెంట్రుకలు, రక్త నమూనాలను సేకరించి పరిశీలించిన వైద్య నిపుణులు అసలు సమస్యను గుర్తించారు. ఆ జిల్లాలో వినియోగిస్తున్న గోధుమల్లో అధిక స్థాయిలో సెలీనియం ఉన్నట్టుగా తేలింది. పంజాబ్, హర్యానా నుంచి దిగుమతి చేసుకున్న గోధుమల్లో సాధారణ స్థాయికి 600 రెట్లు ఎక్కువగా సెలీనియం ఉందని, ఈ గోధుమలను ఆహారంలో ఎక్కువగా ఉపయోగించడం వల్ల జుట్టు రాలే సమస్య ఏర్పడిందని పరిశోధకులు తెలిపారు.

సెలీనియం అనేది శరీరానికి అవసరమైన ఖనిజ పదార్థమే అయినా, మోతాదుకు మించి తీసుకుంటే గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యంగా జుట్టు రాలిపోవడమే కాకుండా తలనొప్పి, జ్వరం, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. బుల్దానా జిల్లాలో బాధితులలో ఈ లక్షణాలు కూడా కనిపించడం గమనార్హం.

అయితే, ఆ ప్రాంతంలో ఉన్న గోధుమలను మార్చడం ద్వారా సమస్య తగ్గుముఖం పట్టింది. వైద్య నిపుణుల సూచన మేరకు స్థానిక గోధుమలను ఉపయోగించడం ప్రారంభించడంతో చాలా మందిలో జుట్టు రాలే సమస్య తగ్గిపోయిందని అధికారులు వెల్లడించారు. ఒక సాధారణ ఆహార పదార్థం, మోతాదు తప్పితే ఎంతటి సమస్యను తెచ్చిపెట్టొచ్చో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.

This post was last modified on February 25, 2025 8:34 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Maharashtra

Recent Posts

తమ్ముడితో హిట్టు కొడితే అన్నయ్యతో పక్కా

ఎల్లుండి విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మీద దర్శకుడు హరీష్ శంకర్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో చూస్తున్నాం.…

2 hours ago

ప్రేక్షకులు కన్విన్స్ అవుతారా సూర్యా

నిన్న విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ వచ్చేసింది. దాపరికం లేకుండా స్టోరీ ఏంటో నిమిషంన్నరలోనే చెప్పేశారు. కొన్ని ఎలిమెంట్స్ దాచి…

3 hours ago

ఇక్కడ మాత్రం శ్రీలీలపై రాశిదే పైచేయి

ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే…

4 hours ago

ఎల‌క్ష‌న్ మూడ్‌: మోడీ మ్యానియా ఫ‌లించేనా?

దేశంలో ప్ర‌స్తుతం ఎన్నిక‌ల మూడ్ నెల‌కొంది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. వీటిలో బీజేపీ పాలిత అస్సాం, బీజేపీ…

4 hours ago

అభిమానులను ఊరిస్తున్న ‘ఉస్తాద్’ తొలిప్రేమ

ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…

5 hours ago

రీల్ కోసం స్టంట్… ప్రాణం తీసిన తుపాకీ

ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…

6 hours ago