కరోనా వల్ల దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉన్నందున అత్యవసర సేవలు మినహా దాదాపుగా అన్ని రంగాలు షట్ డౌన్ అయ్యాయి. ఆసుపత్రులు, నిత్యావసరాలతో పాటు బ్యాంకింగ్ సేవలు పాక్షికంగా కొనసాగుతున్నాయి. ఓ వైపు ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవ్వగా….మరోవైపు బ్యాంకుల్లో ఉన్న కొద్దిపాటి సొమ్ముతో కాలం వెళ్లదీయాలని చాలామంది బ్యాంకుల ముందు క్యూ కడుతున్నారు.
జన్ ధన్ ఖాతాల్లో వేసిన రూ.500 తీసుకోవడం కోసం మొదలు…రకరకాల లావాదేవీల కోసం జనాలు బ్యాంకుల ముందు బారులు తీరుతున్నారు. కరోనా నేపథ్యంలో ఇప్పటికే బ్యాంకు సేవల సమయం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కుదించారు. దీంతో, బ్యాంకుల ముందు తాకిడి మరింత పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా మే నెలలో ఆ తాకిడి మరింత పెరిగే అవకాశముంది.
ఎందుకంటే మే నెలలో ఏకంగా 10 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. మే 3 తర్వాత లాక్ డౌన్ ఎత్తివేసినా కూడా బ్యాంకింగ్ నిబంధనల్లో సోషల్ డిస్టెన్స్..ఇతరత్రా నిబంధనలు యధావిధిగా కొనసాగే అవకాశముంది. దీంతో, మే నెలలో బ్యాంకు లావాదేవీలు చేసేవారు ఏఏ తేదీల్లో సెలవులు వచ్చాయో ఓ లుక్కేయడం మంచింది. మే నెలలో రెండు శనివారాలు, ఐదు ఆదివారాలు, బుద్ధ పూర్ణిమ, రంజాన్, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం(మే 1), మే 7 – బుద్ద పూర్ణిమ ఇలా సెలవలు రాబోతున్నాయి. వీటితోపాటు స్టాక్ మార్కెట్లు మే 1, మే 25న బంద్ అవుతాయి.
బ్యాంకుల సెలవుల జాబితా ఇదే
మే 1 – అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం
మే 3 – ఆదివారం
మే 7 – బుద్ద పూర్ణిమ
మే 9 – రెండో శనివారం
మే 10 – ఆదివారం
మే 17 – ఆదివారం
మే 23 – నాలుగో శనివారం
మే 24 – ఆదివారం
మే 25 – రంజాన్
మే 31 – ఆదివారం
This post was last modified on April 29, 2020 7:06 pm
వైసీపీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి.. ఆ రెండు పదవులు వదులుకున్న విషయం తెలిసిందే. అయితే.. సాయిరెడ్డి…
బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిని ఉద్దేశించి ఆయన…
ఏపీ అసెంబ్లీలో తనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని.. ఆలా అయితేనే తాను అసెంబ్లీకి వస్తానని వైసీపీ అధినేత…
తమిళ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ రాజకీయాల్లోకి శరవేగంగా దూసుకువస్తున్నారు. ఇప్పటికే తమిళగ వెట్రిగ కజగం పేరిట రాజకీయ పార్టీని…
ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తంలో జరుగుతున్న చర్చ ఒక్కటే. గేమ్ ఛేంజర్ నుంచి తండేల్ దాకా అసలు హెచ్డి ప్రింట్స్ పైరసీ…
ఏపీ సీఎం చంద్రబాబు లౌక్యం ప్రదర్శించారు. కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత.. అనేక నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. వీటిలో…