మరణం ఎలా వస్తుందో ఊహించడం కష్టమనే మాటను ఈ ఘటన రుజువు చేస్తుంది. ప్రముఖ యువ పవర్ లిఫ్టర్ యశ్తికా ఆచార్య.. రెప్పపాటులో కన్నుమూశారు. త్వరలోనే జరగనున్న అంతర్జాతీయ పోటీలకు ప్రిపేర్ అవుతున్న ఆమె.. అదే ఆటలో ప్రాణాలు కోల్పోయారు. ఆటగదరా శివా! అన్నట్టుగా యశ్తికా మరణం చోటు చేసుకోవడం చిత్రం. 270 కిలోల బరువు ఎత్తేందుకు శిక్షణ తీసుకుంటున్న క్రమంలో ఆమె ఆ బరువు తన మెడపై పడడంతో అక్కడికక్కడే కుప్పకూలారు. ఆ వెంటనే ప్రాణాలు కోల్పోయారు. దీనికిసంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాజస్థాన్కు చెందిన యశ్తికా ఆచార్యకు 17 సంవత్సరాలు. ఆది నుంచి వెయిట్ లిఫ్టింగ్లో దూసుకుపోయారు. జూనియర్ నేషనల్ గేమ్స్లోనూ ఆమె స్వర్ణ పతకాన్ని సాధించారు. త్వరలోనే అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 250 కిలోలకు పైగా బరువునుఎత్తే ప్రాక్టీస్లో నిమగ్నమయ్యారు. దీనికిగాను ఆమెనిరంతరం సాధన చేస్తున్నారు. బుధవారం యధావిధిగా ప్రాక్టీస్ ప్రారంభించిన యశ్తికా ఆచార్య.. ఏకంగా 270 కిలోల బరువును ఎత్తే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమె ట్రైనర్ కూడా ఆమెకు మెళకువలు నేర్పారు.
మొత్తానికి 270 కిలోల బరువును భుజాలపైకి ఎత్తుకుని పైకి లేపేందుకు ప్రయత్నించారు. అయితే.. అంత బరువును.. మోయ లేక.. కిందకు వాలిపోయారు. ఈ క్రమంలో 270 కిలోల వెయిట్ యశ్తిక మెడపై నుంచి తల మీదుగా కిందకు జారింది. దీంతో నాడులు పూర్తిగా నలిగిపోయి.. ఆమె అక్కడికక్కడే కుప్పకూలారు. ఈ ఘటనలో ట్రైనర్కు సైతం కుడి భుజానికి గాయమైంది. ఆ వెంటనే యశ్తికాను ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే ఆమెమృతి చెందిన వైద్యులు తెలిపారు. పోస్టు మార్టమ్ అనంతరం.. ఆమె మృత దేహాన్నికుటుంబానికి అప్పగించారు. కాగా.. ఈ ఘటన దేశవ్యాప్తంగా క్రీడాకారుల్లో విషాదాన్ని నింపింది.
టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్…
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…