మరణం ఎలా వస్తుందో ఊహించడం కష్టమనే మాటను ఈ ఘటన రుజువు చేస్తుంది. ప్రముఖ యువ పవర్ లిఫ్టర్ యశ్తికా ఆచార్య.. రెప్పపాటులో కన్నుమూశారు. త్వరలోనే జరగనున్న అంతర్జాతీయ పోటీలకు ప్రిపేర్ అవుతున్న ఆమె.. అదే ఆటలో ప్రాణాలు కోల్పోయారు. ఆటగదరా శివా! అన్నట్టుగా యశ్తికా మరణం చోటు చేసుకోవడం చిత్రం. 270 కిలోల బరువు ఎత్తేందుకు శిక్షణ తీసుకుంటున్న క్రమంలో ఆమె ఆ బరువు తన మెడపై పడడంతో అక్కడికక్కడే కుప్పకూలారు. ఆ వెంటనే ప్రాణాలు కోల్పోయారు. దీనికిసంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాజస్థాన్కు చెందిన యశ్తికా ఆచార్యకు 17 సంవత్సరాలు. ఆది నుంచి వెయిట్ లిఫ్టింగ్లో దూసుకుపోయారు. జూనియర్ నేషనల్ గేమ్స్లోనూ ఆమె స్వర్ణ పతకాన్ని సాధించారు. త్వరలోనే అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 250 కిలోలకు పైగా బరువునుఎత్తే ప్రాక్టీస్లో నిమగ్నమయ్యారు. దీనికిగాను ఆమెనిరంతరం సాధన చేస్తున్నారు. బుధవారం యధావిధిగా ప్రాక్టీస్ ప్రారంభించిన యశ్తికా ఆచార్య.. ఏకంగా 270 కిలోల బరువును ఎత్తే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమె ట్రైనర్ కూడా ఆమెకు మెళకువలు నేర్పారు.
మొత్తానికి 270 కిలోల బరువును భుజాలపైకి ఎత్తుకుని పైకి లేపేందుకు ప్రయత్నించారు. అయితే.. అంత బరువును.. మోయ లేక.. కిందకు వాలిపోయారు. ఈ క్రమంలో 270 కిలోల వెయిట్ యశ్తిక మెడపై నుంచి తల మీదుగా కిందకు జారింది. దీంతో నాడులు పూర్తిగా నలిగిపోయి.. ఆమె అక్కడికక్కడే కుప్పకూలారు. ఈ ఘటనలో ట్రైనర్కు సైతం కుడి భుజానికి గాయమైంది. ఆ వెంటనే యశ్తికాను ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే ఆమెమృతి చెందిన వైద్యులు తెలిపారు. పోస్టు మార్టమ్ అనంతరం.. ఆమె మృత దేహాన్నికుటుంబానికి అప్పగించారు. కాగా.. ఈ ఘటన దేశవ్యాప్తంగా క్రీడాకారుల్లో విషాదాన్ని నింపింది.
This post was last modified on February 19, 2025 7:59 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…