దుర్మార్గాలపై కేసులు తప్పవు : జనసేన మనోహర్!

మొన్నటి ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి రికార్డు విక్టరీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వరుసబెట్టి వైసీపీ అక్రమాలపై కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటిదాకా ఈ కేసులన్నీ దాదాపుగా టీడీపీ తరఫు నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగానే నమోదు అయ్యాయని చెప్పాలి. ఇప్పుడు కూటమిలోని మరో భాగస్వామి జనసేన నుంచి కూడా వైసీపీకి ఈ తరహా ఇబ్బందులు తప్పేలా లేవు. ఈ మేరకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు, మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి కృష్ణా- గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మద్దతుగా జరిగిన జనసేన సమావేశంలో ప్రసంగించిన సందర్భంగా మంగళవారం మనోహర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో జనసేన శ్రేణులు… ప్రత్యేకించి వీర మహిళలపై వైసీపీ శ్రేణులు చేసిన అసభ్య వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. పార్టీ కోసం వీర మహిళలు పోరాటం చేస్తూ ఉంటే… వీర మహిళలపై వైసీపీ నేతలు చవకబారు వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. అంతేకాకుండా జనసేన శ్రేణులపై వైసీపీ శ్రేణులు దాడులకూ పాల్పడ్డాయన్నారు. ఈ దాడులను ఎదుర్కొంటూనే జనసేన శ్రేణులు ముందుకు సాగిన వైనాన్ని మనోహర్ కొనియాడారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చేసుకోవాల్సిన అవసరం ఎప్పుడూ లేదని ఆయన చెప్పారు. అయితే అందుకు విరుద్ధంగా వైసీపీ శ్రేణులు వ్యవహరించాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేనకు చెందిన ఎంతో మందిని వైసీపీ నేతలు ఇబ్బందులు పెట్టారన్నారు. కేసులు పెట్టడంతో పాటుగా చాలా మందిని జైలుకు పంపారన్నారు.

గడచిన ఐదేళ్ల పాలనలో వైసీపీ చేసిన ఈ దుర్మార్గాలను జనసేనకు చెందిన ఏ ఒక్కరు కూడా మరచిపోరాదని మనోహన్ అన్నారు. అధికారంలోకి వచ్చిన మనం… కక్షసాధింపు దిశగా కాకుండా గతంలో ఎవరైతే పొరపాట్లు చేశారో.. ఎవరైతే కావాలని మనల్ని ఇబ్బంది పెట్టారో… ఎవరైతే దౌర్జన్యంగా వ్యవహరించారో… వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని ఆయన అన్నారు. దానికి కొంత సమయం పట్టినా సరే… అందరం కలసికట్టుగా ఉండి దుర్మార్గులకు స్పష్టమైన సందేశం పంపాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. శాసనమండలిలో గతంలో జరిగిన దురాగతాలను కూడా మననం చేసుకుని… అలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే.. సభలో కూటమి సంఖ్యాబలాన్ని పెంచుకోవాల్సి ఉందన్నారు. అందులో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికలను కూటమి పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని మనోహర్ పిలుపునిచ్చారు. వెరసి టీడీపీ ఫిర్యాదులకు తోడు ఇప్పుడు జనసేన ఫిర్యాదులు కూడా తోడు కానున్నాయని.. ఫలితంగా వైసీపీకి ఇక బ్యాండుబాజానేనని మనోహర్ స్పష్టమైన సంకేతాలిచ్చారు.

This post was last modified on February 18, 2025 11:31 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

6 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

8 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago