Trends

భారత్ రక్షణ శక్తి పెరుగుతోంది… ఏరో ఇండియా 2025లో హైలైట్స్!

ఏషియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శనగా పేరుగాంచిన ఏరో ఇండియా 2025 బెంగళూరులో ఘనంగా ప్రారంభమైంది. ఈ ఎయిర్ షోలో భారత నౌకాదళం, వైమానిక దళం, డిఫెన్స్ రంగానికి చెందిన అనేక సంస్థలు తమ అత్యాధునిక వైమానిక సామర్థ్యాలను ప్రదర్శించాయి.

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇండియా పావిలియన్ లో భారతదేశ ఆత్మనిర్భరతకు సంబంధించిన ప్రాజెక్టులను ప్రదర్శిస్తున్నారు.

ఈవెంట్‌లో భారత నౌకాదళం అధునాతన సాంకేతికతను ప్రదర్శిస్తూ, తన భవిష్యత్ అవసరాలు, అభివృద్ధి చేసే కొత్త వైమానిక ప్రణాళికలను విశ్లేషిస్తోంది. ఇందులో మిగ్-29కే, హాక్ 132, పీ8ఐ లాంటి అధునాతన యుద్ధ విమానాలతో పాటు, నౌకాదళం కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న టెడ్‌బీఎఫ్ (ట్విన్ ఇంజిన్ డెక్-బేస్డ్ ఫైటర్) స్కేల్డ్ మోడల్‌ను ప్రదర్శిస్తున్నారు.

అలాగే, భారత్ అభివృద్ధి చేస్తున్న నావికా వైమానిక రంగానికి సంబంధించిన ఆత్మనిర్భర్ ఇండియన్ నేవల్ ఏవియేషన్ – టెక్నలాజికల్ రోడ్‌మ్యాప్ 2047 అనే దృక్పథ పత్రాన్ని విడుదల చేయనున్నారు.

ఈ ఎయిర్ షోలో దేశీయ అంతర్జాతీయ డిఫెన్స్ సంస్థలు పాల్గొంటున్నాయి. అమెరికా, ఫ్రాన్స్, రష్యా, దక్షిణ కొరియా, యుకే, జపాన్, ఇజ్రాయెల్, బ్రెజిల్ వంటి 19 దేశాలకు చెందిన 55 కంపెనీలు ఇందులో ప్రదర్శనలు ఇస్తుండగా, భారత్ తరఫున లార్సెన్ & టుబ్రో, ఆదాని డిఫెన్స్, మహీంద్రా డిఫెన్స్, బ్రహ్మోస్ ఏరోస్పేస్, అశోక్ లేలాండ్ డిఫెన్స్ వంటి 35 కంపెనీలు పాల్గొన్నాయి.

ఈ కార్యక్రమంలో భారత నావికా వైమానిక విభాగానికి చెందిన పీ8ఐ, మిగ్-29కే, కామోవ్ 31, సీకింగ్ 42బీ, ఎంహెచ్ 60ఆర్ వంటి ఆధునిక యుద్ధ విమానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే, దేశీయంగా అభివృద్ధి చేస్తున్న అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్, కాంబాట్ ఎయిర్ టీమింగ్ సిస్టమ్ వంటి భారీ ప్రాజెక్టులను ప్రదర్శనకు ఉంచారు.

మొత్తం మీద, ఈ ఏరో ఇండియా 2025 భారతదేశ వైమానిక రంగ పురోగతికి అద్దం పట్టేలా ఉంటూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైమానిక, రక్షణ రంగ పరిశ్రమలకు భారతదేశాన్ని ఆకర్షించే వేదికగా నిలుస్తోంది.

This post was last modified on February 10, 2025 5:57 pm

Share

Recent Posts

చిన్న శ్రీను శాంపిల్ మాత్ర‌మే.. మ‌రింత మంది సైకిల్ ఎక్కేస్తారా?

వైసీపీకి డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్త‌రాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్య‌వ‌హారంతో పాటు.. పార్టీలో మ‌రింత మంది…

5 hours ago

ఏఐ వాడకం… ముంచుకొస్తున్న ప్రమాదం

జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…

6 hours ago

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

9 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

10 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

10 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

10 hours ago