పాకిస్తాన్ లాహోర్లోని గడ్డాఫీ స్టేడియం మరోసారి వివాదాస్పదంగా మారింది. న్యూజిలాండ్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్రకి తీవ్ర గాయం కావడం, ఆ గాయానికి స్టేడియంలోని ఫ్లడ్ లైట్లు కారణమని అనుమానాలు వెల్లువెత్తడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
బంతి వేగాన్ని అంచనా వేయలేకపోవడం, కళ్లకు వెలుతురు నేరుగా తాకడం వల్లే గాయం జరిగిందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఘటనతో పాకిస్తాన్లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై మరోసారి నమ్మకం తక్కువైందని పలువురు విమర్శిస్తున్నారు.
ఇదిలా ఉంటే, సోషల్ మీడియాలో ట్రోల్స్ గట్టిగానే వస్తున్నాయి. గతంలో కటక్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్ సమయంలో ఫ్లడ్ లైట్లు కొన్ని క్షణాలు ఆగిపోవడంతో, దానిని తేలికగా తీసుకుంటూ సోషల్ మీడియాలో పాక్ అభిమానులను ట్రోల్ చేశారు. అయితే, గడ్డాఫీ స్టేడియంలో ‘ది గ్రేట్ లైట్ షో’ పేరిట జరిగిన ఫ్లడ్ లైట్ డిస్ప్లే వీడియో బయటకు రావడంతో, నెటిజన్లు తిరిగి పాకిస్తాన్ను ఘాటుగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
ఐపీఎల్లో వర్షం కారణంగా నిలిచిపోయిన ఉప్పల్ మ్యాచ్లో జరిగిన లైట్ షోతో గడ్డాఫీ స్టేడియంలోని లైట్ షోను పోల్చుతూ సెటైర్లు వేస్తున్నారు. ఆర్సీబీ జెర్సీ లాంచ్ ఈవెంట్లో చేసిన లైట్ షో, సాధారణ డీజే ఓపరేటర్ ఉపయోగించిన లైటింగ్ను ట్యాగ్ చేస్తూ, “ఇది కూడా గడ్డాఫీ స్టేడియంలో జరిగిందా?” అంటూ నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు.
ఓ నెటిజన్ “ముంబై వీధుల్లోని పెళ్లిళ్లలో కూడా ఇంతకంటే మెరుగైన లైట్ షో ఉంటుంది” అని కామెంట్ చేయగా, మరొకరు “హైదరాబాద్లో ట్యాంక్ బండ్పై జరిగే లైట్ షో కూడా గడ్డాఫీ స్టేడియాన్ని మించి పోతుంది” అంటూ వ్యంగ్యంగా రాశారు. మొత్తంగా, గడ్డాఫీ స్టేడియంలో లైట్ షోపై తీవ్ర విమర్శలు, ట్రోలింగ్ కొనసాగుతుండటంతో, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దీనిపై స్పందించే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.
This post was last modified on February 10, 2025 11:13 am
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…
ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…