స్కూల్లో కాలేజీల్లో చదువుకునేటపుడు ఎన్నో టాలెంట్లు ప్రదర్శించి సరదాగా జీవితాన్ని గడిపేసే వ్యక్తులు.. ఆ తర్వాత సీరియస్గా సాగే వృత్తుల్లో పడి తమ ప్రతిభను మరుగున పడేస్తుంటారు. వాళ్లకు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఎప్పుడో కానీ రాదు. అలా వచ్చినపుడు వాళ్ల ప్రతిభ చూసిన కొత్త వ్యక్తులు ఆశ్చర్యపోతుంటారు. వీళ్లలో ఇంత టాలెంట్ ఉందా అనిపిస్తారు. తాజాగా ఒక వైద్యుడు అలాగే తన ప్రతిభను ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. సోషల్ మీడియాలో నిన్నట్నుంచి వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోకుండా ఉండలేరు.
అస్సాంకు చెందిన డాక్టర్ అరూప్ సేనాపతి అక్కడి ఒక కోవిడ్ ఆసుపత్రిలో పేషెంట్లకు చికిత్స అందిస్తున్నాడు. ఐతే ఆ పేషెంట్లకు బోర్ కొడుతుండటంతో వారిని వినోదపరిచేందుకు అరూప్ స్వయంగా డ్యాన్స్ వేయడానికి సిద్ధమయ్యాడు. పీపీఈ కిట్ ధరించి, ముఖానికి మాస్క్, ఫేస్ షీల్డ్ వేసుకోవడంతో ఆయన రూపం బయటికి కనిపించలేదు. ఐతే ఆయన స్టెప్పులు మాత్రం వారెవా అనిపించాయి. హృతిక్ రోషన్ నటించిన ‘వార్’ సినిమాలోని తు లమ్హే కరాబ్ కరే పాటకు చాలా స్టైలిష్గా, సింపుల్గా వేసిన స్టెప్పులు అరూప్ ఎంత మంచి డ్యాన్సరో తెలియజేశాయి.
ఇంకో డ్యాన్సర్ ఎవరైనా ఫ్లోర్ మీద ఈ డ్యాన్సులు వేస్తే అందులో విశేషం ఏమీ లేదు. కానీ పీపీఈ కిట్ ధరించి కోవిడ్ పేషెంట్లకు చికిత్స అందిస్తున్న డాక్టర్.. ఆసుపత్రిలో ఆ పేషెంట్ల ముందే ఇలా నృత్య ప్రతిభను ప్రదర్శించడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. స్వయంగా హృతిక్ రోషన్ సైతం ఈ వీడియోపై స్పందించాడు. తాను అరూప్ స్టెప్పులు చూసి నేర్చుకుంటానని.. ఏదో ఒక రోజు అస్సాంకు వచ్చి అతడి ముందు ఆ స్టెప్పులు వేయడానికి ప్రయత్నిస్తానని హృతిక్ ట్వీట్ చేయడం విశేషం. హృతిక్ స్పందించడంతో ఈ వీడియో మరింతగా పాపులర్ అవుతోంది.
This post was last modified on October 20, 2020 3:59 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…