అడవుల్లో ఫ్రీగా సంచరించాల్సిన వన్య ప్రాణులు, క్రూర మృగాలు ఇప్పుడు జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయి. ఇందుకు దారి తీస్తున్న కారణాలను అలా పక్కనపెడితే… నానాటికీ జనాలను సమీపిస్తున్న క్రూర మృగాల కారణంగా అటవీ శాఖ అధికారులకు కంటి మీద కునుకు పడటం లేదు. నిత్యం ఎక్కడి నుంచి ఏ క్రూర మృగం గుచించిన సమాచారం వస్తుందోనన్న ఆందోళన వారిని వెంటాడుతోంది.
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల దట్టమైన శేషాచలం అడవుల్లో ఉన్న సంగతి తెలిసిందే. శేషాచలం కొండల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో అరుదైన వన్య ప్రాణులతో పాటుగా పులి, చిరుత, ఎలుగు లాంటి క్రూర మృగాలు కూడా బారీ సంఖ్యలోనే ఉన్నాయి.
మొన్నటిదాకా వీటి వల్ల వెంకన్న భక్తులకు గానీ, సమీప ప్రాంతాల ప్రజలకు గానీ వీటి వల్ల ఎలాంటి ఆపద ఎదురు కాలేదు. అయితే ఇటీవలి కాలంలో తరచుగా వెంకన్న భక్తులకు చిరుతలు, పులులు కనిపిస్తున్నాయి. వారిని భయాందోళనలకు గురి చేస్తున్నాయి.
తాజాగా గురువారం తిరుమలకు అతి సమీపంలోకి చిరుత వచ్చేసింది. తిరుమల పరిదిలోని శిలాతోరణం వద్ద ఓ భారీ చిరుత అలా ఎంచక్కా ఓ రాతి మీద కూర్చుని కనిపించింది. ఈ దృశ్యాన్ని సర్వదర్శనం క్యూ లైన్ కు సమీపంలో ఉన్న భక్తులకు కనిపించింది. శిలాతోరణం సమీపాన… సర్వదర్శనం క్యూ లైన్ సమీపంలోని వారికి కనిపించే దగ్గరకు చిరుత చేరిందంటే… ఇంకొన్నాళ్లు పోతే.. ఏకంగా చిరుతలు, పులులు తిరుమలలోకీ ప్రవేశిస్తాయేమోనన్న భయాందోళనలు నెలకొన్నాయి.
చిరుతను చూసిన భక్తులు టీటీడీ అధికారులకు సమాచారాన్ని చేరవేశారు. శిలా తోరణం వద్ద అలా ఠీవీగా కూర్చున్న చిరుత ఫొటోలు,వీడియోలు వైరల్ గా మారాయి.
This post was last modified on January 30, 2025 10:23 pm
మార్చి 28 హరిహర వీరమల్లు రావడం లేదనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే అయినప్పటికీ నిర్మాణ సంస్థ నుంచి అధికారిక…
2019 లో స్వయంగా పోటీ చేసిన రెండు చోట్ల ఓడినప్పటికి, ఎంతో అభిమానగణం ఉన్నా, అభిమానాన్ని ఓట్ల రూపంలోకి మార్చే…
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్కు ఇప్పటికే రెండుసార్లు పెళ్లయింది. ముందుగా తన చిన్ననాటి స్నేహితురాలు రీనా దత్తాను ప్రేమించి…
హీరోగా ఎంత స్థాయిలో ఉన్నా అభిరుచి కలిగిన నిర్మాతగానూ ఋజువు చేసుకోవాలని తాపత్రయపడుతున్న న్యాచురల్ స్టార్ నాని స్వంత బ్యానర్…
కూటమి పాలనలో ఏపీ పారిశ్రామికంగా పరుగులు పెడుతోంది. కూటమి పాలన మొదలైన తొలి 9 నెలల్లోనే దాదాపుగా రూ.7 లక్షల కోట్ల…
వైసీపీ మరింత డీలా పడనుందా? ఆ పార్టీ వాయిస్ మరింత తగ్గనుందా? అంటే.. ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ప్రస్తుతం…