Trends

శిలాతోరణం వద్ద చిరుత… వెంకన్న భక్తుల్లో వణుకు

అడవుల్లో ఫ్రీగా సంచరించాల్సిన వన్య ప్రాణులు, క్రూర మృగాలు ఇప్పుడు జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయి. ఇందుకు దారి తీస్తున్న కారణాలను అలా పక్కనపెడితే… నానాటికీ జనాలను సమీపిస్తున్న క్రూర మృగాల కారణంగా అటవీ శాఖ అధికారులకు కంటి మీద కునుకు పడటం లేదు. నిత్యం ఎక్కడి నుంచి ఏ క్రూర మృగం గుచించిన సమాచారం వస్తుందోనన్న ఆందోళన వారిని వెంటాడుతోంది.

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల దట్టమైన శేషాచలం అడవుల్లో ఉన్న సంగతి తెలిసిందే. శేషాచలం కొండల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో అరుదైన వన్య ప్రాణులతో పాటుగా పులి, చిరుత, ఎలుగు లాంటి క్రూర మృగాలు కూడా బారీ సంఖ్యలోనే ఉన్నాయి.

మొన్నటిదాకా వీటి వల్ల వెంకన్న భక్తులకు గానీ, సమీప ప్రాంతాల ప్రజలకు గానీ వీటి వల్ల ఎలాంటి ఆపద ఎదురు కాలేదు. అయితే ఇటీవలి కాలంలో తరచుగా వెంకన్న భక్తులకు చిరుతలు, పులులు కనిపిస్తున్నాయి. వారిని భయాందోళనలకు గురి చేస్తున్నాయి.

తాజాగా గురువారం తిరుమలకు అతి సమీపంలోకి చిరుత వచ్చేసింది. తిరుమల పరిదిలోని శిలాతోరణం వద్ద ఓ భారీ చిరుత అలా ఎంచక్కా ఓ రాతి మీద కూర్చుని కనిపించింది. ఈ దృశ్యాన్ని సర్వదర్శనం క్యూ లైన్ కు సమీపంలో ఉన్న భక్తులకు కనిపించింది. శిలాతోరణం సమీపాన… సర్వదర్శనం క్యూ లైన్ సమీపంలోని వారికి కనిపించే దగ్గరకు చిరుత చేరిందంటే… ఇంకొన్నాళ్లు పోతే.. ఏకంగా చిరుతలు, పులులు తిరుమలలోకీ ప్రవేశిస్తాయేమోనన్న భయాందోళనలు నెలకొన్నాయి.

చిరుతను చూసిన భక్తులు టీటీడీ అధికారులకు సమాచారాన్ని చేరవేశారు. శిలా తోరణం వద్ద అలా ఠీవీగా కూర్చున్న చిరుత ఫొటోలు,వీడియోలు వైరల్ గా మారాయి.

This post was last modified on January 30, 2025 10:23 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago