Trends

శిలాతోరణం వద్ద చిరుత… వెంకన్న భక్తుల్లో వణుకు

అడవుల్లో ఫ్రీగా సంచరించాల్సిన వన్య ప్రాణులు, క్రూర మృగాలు ఇప్పుడు జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయి. ఇందుకు దారి తీస్తున్న కారణాలను అలా పక్కనపెడితే… నానాటికీ జనాలను సమీపిస్తున్న క్రూర మృగాల కారణంగా అటవీ శాఖ అధికారులకు కంటి మీద కునుకు పడటం లేదు. నిత్యం ఎక్కడి నుంచి ఏ క్రూర మృగం గుచించిన సమాచారం వస్తుందోనన్న ఆందోళన వారిని వెంటాడుతోంది.

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల దట్టమైన శేషాచలం అడవుల్లో ఉన్న సంగతి తెలిసిందే. శేషాచలం కొండల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో అరుదైన వన్య ప్రాణులతో పాటుగా పులి, చిరుత, ఎలుగు లాంటి క్రూర మృగాలు కూడా బారీ సంఖ్యలోనే ఉన్నాయి.

మొన్నటిదాకా వీటి వల్ల వెంకన్న భక్తులకు గానీ, సమీప ప్రాంతాల ప్రజలకు గానీ వీటి వల్ల ఎలాంటి ఆపద ఎదురు కాలేదు. అయితే ఇటీవలి కాలంలో తరచుగా వెంకన్న భక్తులకు చిరుతలు, పులులు కనిపిస్తున్నాయి. వారిని భయాందోళనలకు గురి చేస్తున్నాయి.

తాజాగా గురువారం తిరుమలకు అతి సమీపంలోకి చిరుత వచ్చేసింది. తిరుమల పరిదిలోని శిలాతోరణం వద్ద ఓ భారీ చిరుత అలా ఎంచక్కా ఓ రాతి మీద కూర్చుని కనిపించింది. ఈ దృశ్యాన్ని సర్వదర్శనం క్యూ లైన్ కు సమీపంలో ఉన్న భక్తులకు కనిపించింది. శిలాతోరణం సమీపాన… సర్వదర్శనం క్యూ లైన్ సమీపంలోని వారికి కనిపించే దగ్గరకు చిరుత చేరిందంటే… ఇంకొన్నాళ్లు పోతే.. ఏకంగా చిరుతలు, పులులు తిరుమలలోకీ ప్రవేశిస్తాయేమోనన్న భయాందోళనలు నెలకొన్నాయి.

చిరుతను చూసిన భక్తులు టీటీడీ అధికారులకు సమాచారాన్ని చేరవేశారు. శిలా తోరణం వద్ద అలా ఠీవీగా కూర్చున్న చిరుత ఫొటోలు,వీడియోలు వైరల్ గా మారాయి.

This post was last modified on January 30, 2025 10:23 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పాపం కాదు… బాగుంది ప్రయత్నం అనిపించాలి

తిరువీర్ అంటే రెగ్యులర్ సినిమాలు చూసే ప్రేక్షకులకు సుపరిచితుడే కానీ సెలెక్టివ్ గా థియేటర్లకు వెళ్లే వాళ్లకు మాత్రం కొంచెం…

1 minute ago

ఇక ఎవరొచ్చినా అమరావతిని ముట్టుకోలేరు

తెలుగు నేల విభజన తర్వాత రాజధాని లేకుండానే ఆంధ్ర ప్రదేశ్ తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాల్సి వచ్చింది. ఓ వైపు రాజధాని లేమి,…

25 minutes ago

బస్సు ప్రమాదం… కత్తితో 8 మందిని కాపాడిన రియల్ హీరో

మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే ప్రమాదంలో మరోవైపు…

1 hour ago

సంక్షోభాన్ని అడ్డుకునేందుకు భారత్ ప్లాన్ బీ

పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ భారత్ తన ఇంధన అవసరాల కోసం వ్యూహాలను వేగవంతం చేస్తోంది. చమురు, గ్యాస్…

2 hours ago

పవన్ భార్యకు కూడా చిరు అన్నయే…

​మెగా కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. చిరంజీవి అంటే తమ్ముళ్లు నాగబాబు, పవన్ కల్యాణ్…

2 hours ago

‘ఉస్తాద్’కు లాస్ట్ ఛాన్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ముందు అనుకున్న ప్రకారం అయితే ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ…

3 hours ago