అంతా సవ్యంగా ఉంది, మార్చి 19 నుంచి థియేటర్లలో నాన్ స్టాప్ ఇరవై నాలుగు గంటలు షోలు వేసుకుంటూ పెద్ద ఎత్తున వ్యాపారం చేయాలని ఎదురు చూస్తున్న బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ల నరాలు చిట్లిపోతున్నాయి. టాక్సిక్ వాయిదా పడిన ఆనందం ఇంకా పూర్తిగా ఆస్వాదించకుండా, దాన్ని ఆవిరి చేసేలా దురంధర్ 2 రివెంజ్ కూడా పోస్ట్ పోన్ అవ్వొచ్చనే వార్త వాళ్ళకు నిద్ర పట్టనివ్వడం లేదు. ఎందుకంటే ఒకవేళ నిజంగా తప్పుకుంటే డిస్ట్రిబ్యూటర్ల గుండెల్లో బాంబులు పడినట్టే.
ఎందుకంటే ఒక్క దురంధర్ 2 మీదే ప్రపంచవ్యాప్తంగా పదిహేను వందల కోట్లకు పైగా వ్యాపారం జరగాల్సి ఉంది. అదంతా పెండింగ్ లో పడితే ఎంత వడ్డీ నష్టమో ఊహకు అందదు. ఇప్పటికైతే నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ నుంచి ఎలాంటి ప్రకటన లేదు. చేతిలో కేవలం 15 రోజులు ఉన్నప్పటికీ ట్రైలర్ అప్డేట్ రాలేదు. పోనీ పాత్రలను పరిచయం చేస్తూ పోస్టర్ల లాంటివి ఏమైనా వదులుతున్నారా అంటే అదీ లేదు. ఇంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీకి ఆడియో సాంగ్స్ చాలా కీలకం. వాటి ఊసే లేదు.
తెలుగుతో సహా అన్ని ప్రధాన భాషల్లో డబ్బింగ్ ఉంటుందని గత ఏడాదే చెప్పారు. కానీ ఆ సూచనలు ప్రస్తుతానికి లేవు. దురంధర్ 2 తప్పుకునే సూచనలు గమనించే ఉస్తాద్ భగత్ సింగ్ ఒక వారం అడ్వాన్స్ గా మార్చి 19 విడుదల చేసేందుకు మైత్రి మూవీ మేకర్స్ రెడీ అవుతోంది. ఏ నిమిషమైనా అనౌన్స్ మెంట్ రావొచ్చు. వీలైనంత త్వరగా దురంధర్ టీమ్ నుంచి అఫీషియల్ నోట్ రావడం చాలా అవసరం. దాన్ని బట్టి ఇతర నిర్మాతలు ప్లాన్ చేసుకోవడానికి లేదు.
టాక్సిక్ న్యూస్ తెలియడం ఆలస్యం తమిళ, కన్నడ సినిమాలు ఆల్రెడీ ఆ స్లాట్ తీసుకునేందుకు రెడీ అవుతున్నాయి. మన దగ్గర ఉస్తాద్ భగత్ సింగ్ వస్తోంది కాబట్టి మిగిలినవాళ్లు రిస్క్ చేయరు. లేదూ దురంధర్ 2 డేట్ లో ఎలాంటి మార్పు లేదంటే మాత్రం అర్జెంట్ గా ప్రమోషన్ల స్పీడ్ పెంచాలి. సంకేతాలు చూస్తుంటే తప్పుకోవడం ఫిక్స్ అయినట్టే ఉంది. ఒకవేళ అలాంటి నిర్ణయమే తీసుకోవాల్సి వస్తే ఆగస్ట్ కి వెళ్లడం మినహా దురంధర్ 2కి వేరే ఆప్షన్ ఉండకపోవచ్చు.
This post was last modified on March 4, 2026 7:11 pm
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…