యూపీఐ ద్వారా లావాదేవీలు చేసే వినియోగదారులకు ఒక కీలక మార్పు రాబోతోంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజాగా కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, యూపీఐ లావాదేవీలకు సంబంధించిన ట్రాన్సాక్షన్ ఐడీలలో ప్రత్యేక అక్షరాలు (@, #, &) ఉంటే, ఆ లావాదేవీలు సక్సెస్ అవ్వవు. ఈ మార్పు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. దీంతో యూపీఐ ఆపరేటర్లు ఇకపై లావాదేవీల ట్రాకింగ్ను మరింత క్రమబద్ధంగా నిర్వహించగలుగుతారు.
ఈ నిబంధనను పాటించని యూపీఐ యాప్స్ ద్వారా వినియోగదారులు లావాదేవీలు జరపలేరు. ఎన్పీసీఐ తెలిపిన ప్రకారం, నకిలీ ఐడీలను అరికట్టడం, లావాదేవీల భద్రతను మరింత పెంచడం ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం. ఆల్ఫాన్యూమెరిక్ (ఇంగ్లిష్ అక్షరాలు, నంబర్లు) ఐడీలను మాత్రమే గుర్తించేలా కొత్త విధానం రూపొందించారని, దీంతో అవకతవకలకు అవకాశం తగ్గుతుందని వెల్లడించారు.
ఇటీవల యూపీఐ లావాదేవీల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఎన్పీసీఐ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, 2024 డిసెంబర్లో యూపీఐ ద్వారా 16.73 బిలియన్ లావాదేవీలు నమోదయ్యాయి. నవంబర్లో ఈ సంఖ్య 15.48 బిలియన్లుగా ఉండగా, ఒక్క నెలలోనే 8 శాతం వృద్ధి నమోదైంది. డిసెంబర్ నెలలో యూపీఐ లావాదేవీల మొత్తం విలువ రూ.23.25 లక్షల కోట్లకు చేరగా, నవంబర్లో ఇది రూ.21.55 లక్షల కోట్లుగా ఉంది.
రోజువారీ లావాదేవీల సంఖ్య కూడా పెరిగింది. నవంబర్లో 516.07 మిలియన్ లావాదేవీలు జరిగినప్పటికీ, డిసెంబర్లో 539.68 మిలియన్లకు చేరాయి. ఈ పెరుగుతున్న లావాదేవీల నేపథ్యంలో భద్రతను మరింత పటిష్ఠం చేయాలని ఎన్పీసీఐ ఫోకస్ చేస్తోంది. వినియోగదారులు కూడా ఈ మార్పులను గుర్తించి, తమ లావాదేవీలకు సంబంధించిన యాప్లు, ఐడీలను నవీకరించుకోవాల్సిన అవసరం ఉంది. ఫిబ్రవరి 1 తర్వాత ట్రాన్సాక్షన్ చేయడానికి ఈ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి.
This post was last modified on January 30, 2025 2:30 pm
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీసుకున్న వినూత్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బీకాం చదువుకున్న ఓ…
ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో చేతికి వెళ్లడం సినీ పరిశ్రమలో కామన్ వ్యవహారం. ఇలా మిస్ అయిన…
ఇరవై ఏడు సంవత్సరాల క్రితం వచ్చిన దేవి సినిమాకు టాలీవుడ్ లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అమ్మోరు లాంటి…
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై అదే పార్టీ నుంచి ఎంపీగా విజయం దక్కించుకుని.. ప్రస్తుతం…
తాము నిర్మించే సినిమాలు ఎంత నష్టం తెచ్చిపెట్టినా… తమను ఎంతగా కుదేలు చేసినా.. వాటి గురించి ఓపెన్ అవ్వడానికి నిర్మాతలు…
వైసీపీలో మరోసారి సజ్జల రామకృష్ణారెడ్డి శకం ప్రారంభం అవుతుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్..…