యూపీఐ ద్వారా లావాదేవీలు చేసే వినియోగదారులకు ఒక కీలక మార్పు రాబోతోంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజాగా కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, యూపీఐ లావాదేవీలకు సంబంధించిన ట్రాన్సాక్షన్ ఐడీలలో ప్రత్యేక అక్షరాలు (@, #, &) ఉంటే, ఆ లావాదేవీలు సక్సెస్ అవ్వవు. ఈ మార్పు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. దీంతో యూపీఐ ఆపరేటర్లు ఇకపై లావాదేవీల ట్రాకింగ్ను మరింత క్రమబద్ధంగా నిర్వహించగలుగుతారు.
ఈ నిబంధనను పాటించని యూపీఐ యాప్స్ ద్వారా వినియోగదారులు లావాదేవీలు జరపలేరు. ఎన్పీసీఐ తెలిపిన ప్రకారం, నకిలీ ఐడీలను అరికట్టడం, లావాదేవీల భద్రతను మరింత పెంచడం ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం. ఆల్ఫాన్యూమెరిక్ (ఇంగ్లిష్ అక్షరాలు, నంబర్లు) ఐడీలను మాత్రమే గుర్తించేలా కొత్త విధానం రూపొందించారని, దీంతో అవకతవకలకు అవకాశం తగ్గుతుందని వెల్లడించారు.
ఇటీవల యూపీఐ లావాదేవీల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఎన్పీసీఐ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, 2024 డిసెంబర్లో యూపీఐ ద్వారా 16.73 బిలియన్ లావాదేవీలు నమోదయ్యాయి. నవంబర్లో ఈ సంఖ్య 15.48 బిలియన్లుగా ఉండగా, ఒక్క నెలలోనే 8 శాతం వృద్ధి నమోదైంది. డిసెంబర్ నెలలో యూపీఐ లావాదేవీల మొత్తం విలువ రూ.23.25 లక్షల కోట్లకు చేరగా, నవంబర్లో ఇది రూ.21.55 లక్షల కోట్లుగా ఉంది.
రోజువారీ లావాదేవీల సంఖ్య కూడా పెరిగింది. నవంబర్లో 516.07 మిలియన్ లావాదేవీలు జరిగినప్పటికీ, డిసెంబర్లో 539.68 మిలియన్లకు చేరాయి. ఈ పెరుగుతున్న లావాదేవీల నేపథ్యంలో భద్రతను మరింత పటిష్ఠం చేయాలని ఎన్పీసీఐ ఫోకస్ చేస్తోంది. వినియోగదారులు కూడా ఈ మార్పులను గుర్తించి, తమ లావాదేవీలకు సంబంధించిన యాప్లు, ఐడీలను నవీకరించుకోవాల్సిన అవసరం ఉంది. ఫిబ్రవరి 1 తర్వాత ట్రాన్సాక్షన్ చేయడానికి ఈ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి.
This post was last modified on January 30, 2025 2:30 pm
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా రూపొందిస్తున్న పెద్ది సినిమాకు సంబంధించి ప్రతి ప్రోమో బ్లాక్…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై మరోసారి తన పట్టును గట్టిగా నిలబెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలోనూ ఆయన అనేక సందర్భాల్లో…
హఠాత్తుగా ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 19కి ప్రీ పోన్ అయ్యిందన్న వార్త ఒక్కసారిగా నిన్న సాయంత్రం సోషల్ మీడియాని…
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేస్తున్న యుద్ధం.. భారత్పై తీవ్ర ప్రభావం చూపిస్తుందా? ప్రజలకు కష్టాలు ప్రారంభం కానున్నాయా? అంటే..…
ఎవడో యుద్దం చేసుకోవటం.. మరెవరో దానికి సంబంధించిన మూల్యాన్ని చెల్లించాల్సి రావటం. నిజానికి యుద్దంతో ఇదే తంటా. మనకు ఏ…
పరిమళ్ నత్వానీ. ఈ పేరు పెద్దగా పరిచయం లేదు. కానీ, ఈయన పెద్ద పారిశ్రామిక వేత్త. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈయన…