Trends

యూపీఐ పేమెంట్స్ న్యూ రూల్స్.. ఇక మరాల్సిందే!

యూపీఐ ద్వారా లావాదేవీలు చేసే వినియోగదారులకు ఒక కీలక మార్పు రాబోతోంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజాగా కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, యూపీఐ లావాదేవీలకు సంబంధించిన ట్రాన్సాక్షన్ ఐడీలలో ప్రత్యేక అక్షరాలు (@, #, &) ఉంటే, ఆ లావాదేవీలు సక్సెస్ అవ్వవు. ఈ మార్పు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. దీంతో యూపీఐ ఆపరేటర్లు ఇకపై లావాదేవీల ట్రాకింగ్‌ను మరింత క్రమబద్ధంగా నిర్వహించగలుగుతారు.

ఈ నిబంధనను పాటించని యూపీఐ యాప్స్ ద్వారా వినియోగదారులు లావాదేవీలు జరపలేరు. ఎన్‌పీసీఐ తెలిపిన ప్రకారం, నకిలీ ఐడీలను అరికట్టడం, లావాదేవీల భద్రతను మరింత పెంచడం ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం. ఆల్ఫాన్యూమెరిక్ (ఇంగ్లిష్ అక్షరాలు, నంబర్లు) ఐడీలను మాత్రమే గుర్తించేలా కొత్త విధానం రూపొందించారని, దీంతో అవకతవకలకు అవకాశం తగ్గుతుందని వెల్లడించారు.

ఇటీవల యూపీఐ లావాదేవీల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఎన్‌పీసీఐ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, 2024 డిసెంబర్‌లో యూపీఐ ద్వారా 16.73 బిలియన్ లావాదేవీలు నమోదయ్యాయి. నవంబర్‌లో ఈ సంఖ్య 15.48 బిలియన్లుగా ఉండగా, ఒక్క నెలలోనే 8 శాతం వృద్ధి నమోదైంది. డిసెంబర్ నెలలో యూపీఐ లావాదేవీల మొత్తం విలువ రూ.23.25 లక్షల కోట్లకు చేరగా, నవంబర్‌లో ఇది రూ.21.55 లక్షల కోట్లుగా ఉంది.

రోజువారీ లావాదేవీల సంఖ్య కూడా పెరిగింది. నవంబర్‌లో 516.07 మిలియన్ లావాదేవీలు జరిగినప్పటికీ, డిసెంబర్‌లో 539.68 మిలియన్లకు చేరాయి. ఈ పెరుగుతున్న లావాదేవీల నేపథ్యంలో భద్రతను మరింత పటిష్ఠం చేయాలని ఎన్‌పీసీఐ ఫోకస్ చేస్తోంది. వినియోగదారులు కూడా ఈ మార్పులను గుర్తించి, తమ లావాదేవీలకు సంబంధించిన యాప్‌లు, ఐడీలను నవీకరించుకోవాల్సిన అవసరం ఉంది. ఫిబ్రవరి 1 తర్వాత ట్రాన్సాక్షన్ చేయడానికి ఈ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి.

This post was last modified on January 30, 2025 2:30 pm

Share

Recent Posts

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

36 minutes ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

49 minutes ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

60 minutes ago

పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ…

3 hours ago

బారికేడ్లు లేని హైవేలు.. ఏంటీ కొత్త విధానం!

ఒక ఊరు నుంచి మ‌రో ఊరుకు జాతీయ ర‌హ‌దారి(హైవే)పై ప్ర‌యాణించే స‌మ‌యంలో టోల్ గేట్లు దాట‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ టోల్…

4 hours ago

నాని వాళ్ళని ఎప్పటికీ వదలడు

నేచుర‌ల్ స్టార్ నాని అంటే ఒక‌ప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్కువ‌గా ఫ్యామిలీ ట‌చ్ ఉన్న…

7 hours ago