యూపీఐ ద్వారా లావాదేవీలు చేసే వినియోగదారులకు ఒక కీలక మార్పు రాబోతోంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజాగా కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, యూపీఐ లావాదేవీలకు సంబంధించిన ట్రాన్సాక్షన్ ఐడీలలో ప్రత్యేక అక్షరాలు (@, #, &) ఉంటే, ఆ లావాదేవీలు సక్సెస్ అవ్వవు. ఈ మార్పు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. దీంతో యూపీఐ ఆపరేటర్లు ఇకపై లావాదేవీల ట్రాకింగ్ను మరింత క్రమబద్ధంగా నిర్వహించగలుగుతారు.
ఈ నిబంధనను పాటించని యూపీఐ యాప్స్ ద్వారా వినియోగదారులు లావాదేవీలు జరపలేరు. ఎన్పీసీఐ తెలిపిన ప్రకారం, నకిలీ ఐడీలను అరికట్టడం, లావాదేవీల భద్రతను మరింత పెంచడం ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం. ఆల్ఫాన్యూమెరిక్ (ఇంగ్లిష్ అక్షరాలు, నంబర్లు) ఐడీలను మాత్రమే గుర్తించేలా కొత్త విధానం రూపొందించారని, దీంతో అవకతవకలకు అవకాశం తగ్గుతుందని వెల్లడించారు.
ఇటీవల యూపీఐ లావాదేవీల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఎన్పీసీఐ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, 2024 డిసెంబర్లో యూపీఐ ద్వారా 16.73 బిలియన్ లావాదేవీలు నమోదయ్యాయి. నవంబర్లో ఈ సంఖ్య 15.48 బిలియన్లుగా ఉండగా, ఒక్క నెలలోనే 8 శాతం వృద్ధి నమోదైంది. డిసెంబర్ నెలలో యూపీఐ లావాదేవీల మొత్తం విలువ రూ.23.25 లక్షల కోట్లకు చేరగా, నవంబర్లో ఇది రూ.21.55 లక్షల కోట్లుగా ఉంది.
రోజువారీ లావాదేవీల సంఖ్య కూడా పెరిగింది. నవంబర్లో 516.07 మిలియన్ లావాదేవీలు జరిగినప్పటికీ, డిసెంబర్లో 539.68 మిలియన్లకు చేరాయి. ఈ పెరుగుతున్న లావాదేవీల నేపథ్యంలో భద్రతను మరింత పటిష్ఠం చేయాలని ఎన్పీసీఐ ఫోకస్ చేస్తోంది. వినియోగదారులు కూడా ఈ మార్పులను గుర్తించి, తమ లావాదేవీలకు సంబంధించిన యాప్లు, ఐడీలను నవీకరించుకోవాల్సిన అవసరం ఉంది. ఫిబ్రవరి 1 తర్వాత ట్రాన్సాక్షన్ చేయడానికి ఈ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి.
This post was last modified on January 30, 2025 2:30 pm
తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఏడాది నుంచి ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఈ లడ్డులో జంతు కొవ్వులు కలిశాయని…
నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ కార్యాలయంలోని కంప్యూటర్ ల్యాబ్ లో చెలరేగిన…
‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…