పరిమళ్ నత్వానీ. ఈ పేరు పెద్దగా పరిచయం లేదు. కానీ, ఈయన పెద్ద పారిశ్రామిక వేత్త. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈయన పేరు అందరికీ తెలుసు. ప్రముఖ వ్యాపార వేత్త, జియో అధినేత ముఖేష్ అంబానీకి అత్యంత ప్రియ మిత్రుడు. ఆటోమేటిక్గా ప్రధాని మోడీకి కూడా ఆయన విశ్వాసపాత్రుడు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. గతంలో ప్రధాని సూచనల మేరకు.. బీజేపీ కోరిక మేరకు.. వైసీపీ నత్వానీకి.. రాజ్యసభ సీటు ఇచ్చేసింది. తద్వారా ఆయన రాజ్యసభలో సభ్యుడయ్యారు.
అయితే.. ఈ ఏడాది జూన్తో నలుగురు సభ్యుల పదవీ కాలం పూర్తికానుంది. వీరిలో నత్వానీ కూడా ఉన్నారు. అప్పట్లో వైసీపీ నత్వానీకి టికెట్ ఇచ్చినప్పుడు.. సాయిరెడ్డి వంటివారు.. ఒక ప్రచారం చేశారు. తాము పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తున్నామని..తద్వారా ఏపీకి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని.. పారిశ్రామిక వేత్తలకు వైసీపీ వ్యతిరేకం కాదని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత.. నత్వానీ.. వైసీపీ తరఫున గళం ఒకటి రెండు సార్లు వినిపించారు.
ఇక, ఇప్పుడు నత్వానీ పదవీ కాలం పూర్తవుతుండడంతో ఆయనను మరోసారి సభకు పంపించాలన్నది బీజేపీ వ్యూహం. అయితే.. ఈ వ్యవహారంలో టీడీపీ జోక్యం చేసుకుందని సమాచారం. తాజాగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ల మధ్య జరిగిన చర్చలో కూడా నత్వానీ పేరు వినిపించిందని తెలిసింది. ఆయనను కొనసాగించాలని చంద్రబాబు చెప్పుకొచ్చారు. వైసీపీ తరఫున గతంలో సభకు వెళ్లినా.. ఇప్పుడు టీడీపీ తరఫున పంపించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించినట్టు సమాచారం.
కారణం ఇదే..
పారిశ్రామిక వేత్తలకు పెద్దపీట వేస్తున్న సీఎం చంద్రబాబు.. నత్వానీకి మరోసారి సభ్యత్వం ఇవ్వడం ద్వారా.. పారిశ్రామిక వేత్తల విషయంలో తన దృక్ఫథాన్ని వెల్లడించాలని నిర్నయించుకున్నారు. అదేసమయంలో ఉత్తరాదిలోనూ.. తన పేరును మరింత పటిష్టం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
నత్వానీకి ఇప్పుడు అవకాశం ఇస్తే.. అది జాతీయ స్థాయిలో మరింత ప్రచారానికి అవకాశం ఉంటుందని.. తద్వారా.. పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేస్తోందన్న భావన వస్తుందని అనుకుంటున్నారు. పార్టీలకు అతీతంగా నత్వానీని రెన్యువల్ చేయడం ద్వారా.. పారిశ్రామిక పురగతికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారట.
This post was last modified on March 4, 2026 4:46 pm
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…