మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా రూపొందిస్తున్న పెద్ది సినిమాకు సంబంధించి ప్రతి ప్రోమో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ కాంబినేషన్లో సినిమా అన్నపుడు మరీ అంచనాలేమీ లేవు. రామ్ చరణ్ వరుసగా రెండు డిజాస్టర్లను ఖాతాలో వేసుకోవడం, బుచ్చిబాబుకు ఒక చిన్న సినిమా తీసిన అనుభవం మాత్రమే ఉండడంతో ఈ ప్రాజెక్టు మీద అభిమానుల్లో సందేహాలు నెలకొన్నాయి.
కానీ పెద్ది నుంచి గత ఏడాది ఫస్ట్ గ్లింప్స్ వచ్చాక అంతా మారిపోయింది. ఆ గ్లింప్స్ సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసింది. విజువల్స్తో పాటు బీజీఎం అదిరిపోవడంతో ఇన్స్టంట్ హిట్టయిపోయింది ఆ గ్లింప్స్. అందులో మేజర్ హైలైట్.. రామ్ చరణ్ బ్యాటు పట్టి ముందుకు దూసుకొచ్చి వెరైటీగా కొట్టిన షాటే.
రీల్స్, షార్ట్స్లో ఈ షాట్ భలే పాపులర్ అయింది. సరిగ్గా గత ఏడాది ఐపీఎల్ ఆరంభానికి ముందు ఈ గ్లింప్స్ రిలీజ్ కావడం.. క్రికెటర్లతో పాటు చాలామంది ఆ షాట్ను అనుకరించడం.. ఐపీఎల్ ప్రమోషన్లలో కూడా అది భాగం కావడంతో సినిమాకు ప్రచారపరంగా భలే మైలేజీ వచ్చింది.
ఆపై చికిరి పాట పెద్ది హైప్ను ఇంకో స్థాయికి తీసుకెళ్లింది. తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన రారా రై రా పాట సైతం ఇన్స్టంట్ హిట్టయిపోయింది. ఇందులో రామ్ చరణ్ స్టెప్పుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ స్టెప్స్తో పాటే ఈ పాటలోనూ రామ్ చరణ్ కొట్టిన ఇంకో వెరైటీ క్రికెట్ షాట్ కూడా అందరి దృష్టినీ ఆకర్షించింది.
ఈ పాట ఐపీఎల్ ముంగిటే రిలీజ్ కావడంతో.. క్రికెట్ ప్రేమికులకు బాగా ఎక్కేస్తోంది. ఈ పాటకు క్రికెట్ విజువల్స్ జోడించి.. వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. చరణ్ కొత్త షాట్ కూడా బాగా పాపులరయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఈ నెల చివరి వారంలో ఐపీఎల్ కొత్త సీజన్ ఆరంభం కాబోతుండగా.. మళ్లీ చరణ్ పాట ఒక ఊపు ఊపేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న పెద్ది సినిమాలో జాన్వి కపూర్ కథానాయికగా నటించింది. వెంకట సతీష్ కిలారుతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు రవిశంకర్, నవీన్ యెర్నేని ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు. సుకుమార్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఏప్రల్ 30న పెద్ది ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on March 5, 2026 10:51 am
గత ఏడాది తండేల్ తో సూపర్ హిట్ అందుకున్న నాగ చైతన్య ఈసారి వృషకర్మగా రాబోతున్నాడు. సాయి ధరమ్ తేజ్…
ఫిబ్రవరి మొత్తం దాదాపుగా డ్రైగా గడిపేసిన టాలీవుడ్ బాక్సాఫీస్ మార్చిలో మంచి బోణీ కోసం ఎదురు చూస్తోంది. ఎంత పిల్లల…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. వచ్చే ఏప్రిల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో.. ఒంటరి పోరు చేస్తామంటూ..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై మరోసారి తన పట్టును గట్టిగా నిలబెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలోనూ ఆయన అనేక సందర్భాల్లో…
హఠాత్తుగా ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 19కి ప్రీ పోన్ అయ్యిందన్న వార్త ఒక్కసారిగా నిన్న సాయంత్రం సోషల్ మీడియాని…
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేస్తున్న యుద్ధం.. భారత్పై తీవ్ర ప్రభావం చూపిస్తుందా? ప్రజలకు కష్టాలు ప్రారంభం కానున్నాయా? అంటే..…