Political News

ప‌ట్టు నిలుపుకొన్న రేవంత్ రెడ్డి!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై మ‌రోసారి త‌న ప‌ట్టును గ‌ట్టిగా నిల‌బెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గ‌తంలోనూ ఆయ‌న అనేక సంద‌ర్భాల్లో పార్టీలో త‌న మాట‌నే నెగ్గించుకున్నారు. తాజాగా రాజ్య‌స‌భ ఎన్నిక‌ల వేళ అనేక మంది పోటీలో ఉన్నా, ఏకంగా రాష్ట్ర పార్టీ వ్య‌వ‌హారాల ఇంచార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్ సైతం ఓ అభ్య‌ర్థిని సిఫార‌సు చేసినా, ఇక సీనియ‌ర్లు వీ. హ‌నుమంత‌రావు వంటివారు నేను సైతం అంటూ ఢిల్లీలోనే పంచాయ‌తీ పెట్టినా సీఎం రేవంత్ రెడ్డి త‌న‌దైన శైలిలో మ‌రోసారి చ‌క్రం తిప్పి త‌న విధేయుడికి టికెట్ ద‌క్కేలా చేసుకున్నారు.

తాజాగా జ‌రుగుతున్న రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిలో ఒక‌టి బీఆర్ ఎస్ నేత సురేష్ రెడ్డిది కాగా మరొక‌టి కాంగ్రెస్ పార్టీకే చెందిన జాతీయ స్థాయి నాయ‌కుడు అభిషేక్ మ‌ను సింఘ్వీ సీటు. ఈ రెండు స్థానాలు కూడా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఖాళీ అవుతున్నాయి. దీంతో కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ ఇచ్చింది. నామినేష‌న్ల‌కు గ‌డువు గురువారం మార్చి 5వ తేదీతో ముగియ‌నుంది.

ఈ రెండు స్థానాలు కూడా అసెంబ్లీ స‌భ్యుల ఓట్ల‌తోనే జ‌రుగుతాయి కాబ‌ట్టి ప్ర‌స్తుతం మెజారిటీ కాంగ్రెస్‌కే ఉన్న నేప‌థ్యంలో ఈ రెండు సీట్లూ కాంగ్రెస్‌కే ద‌క్క‌నున్నాయి. ఒక సీటును మ‌రోసారి అభిషేక్ మ‌ను సింఘ్వీకే ఇస్తార‌ని ఆది నుంచి ప్రచారంలో ఉంది. చివ‌ర‌కు దానినే ఏఐసీసీ ఖ‌రారు చేసింది.

ఇక మిగిలిన మ‌రో సీటు వ్య‌వ‌హారంపైనే నాయ‌కులు నువ్వా నేనా అన్న‌ట్టుగా కుస్తీ ప‌ట్టారు. కొంద‌రు సీనియ‌ర్ నేత‌ల‌ను క‌లుసుకుని సిఫార‌సులు చేయించుకున్నారు. వీ. హ‌నుమంత‌రావు నేరుగా ఢిల్లీ వెళ్లి ఈసారికి ఇవ్వారాదే అంటూ ప్రాధేయ ప‌డ్డారు. అయినా చివ‌ర‌కు సీఎం రేవంత్ రెడ్డి ముందు నుంచి సిఫారసు చేసిన వేం న‌రేంద్ర‌రెడ్డికే కాంగ్రెస్ అధిష్టానం తాజాగా సీటును ఖ‌రారు చేసింది. దీంతో గురువారం ఆయ‌న నామినేష‌న్ వేయ‌నున్నారు. మొత్తంగా ఇంత మంది బ‌రిలో ఉన్నా చివ‌ర‌కు రేవంత్ త‌న ప‌ట్టును నిల‌బెట్టుకోవ‌డం గ‌మ‌నార్హం.

రేవంత్‌తో పాటే వేం!

కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డితో పాటే వేం న‌రేంద్ర‌రెడ్డి కూడా వ‌చ్చారు. గ‌తంలో ఇరువురు నేత‌లు టీడీపీలో క‌లిసి ప‌నిచేశారు. అప్ప‌టి నుంచే రేవంత్‌కు విధేయుడిగా వేం వ్య‌వ‌హ‌రించారు. అత్యంత స‌న్నిహితుడిగా కూడా మారారు. ఫ్యామిలీ ఫ్రెండ్‌గా కూడా పేరు తెచ్చుకున్నారు.

టీడీపీ త‌ర‌ఫున 2004 ఎన్నిక‌ల‌లో మహబూబాబాద్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వేం పోటీ చేసి గెలిచారు. అనంత‌రం 2012లో జరిగిన ఉప ఎన్నికలో హనుమకొండ నుంచి పోటీ చేసినా ప‌రాజ‌యం పాల‌య్యారు. ఇక 2015లో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి మ‌రోసారి ఓడిపోయారు. ప్ర‌స్తుతం ముఖ్య‌మంత్రికి స‌ల‌హాదారుగా వేం వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Satya

Recent Posts

రేట్ల కోసం వెట్ చెయ్… కోట్లు పోగొట్టుకో

ఒక‌ప్పుడు ఎంత పెద్ద సినిమా వ‌చ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బ‌డ్జెట్ ఎంత అయినా స‌రే.. ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన…

2 hours ago

5 రూపాయల డాక్టరుగా సూర్య ?

కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…

4 hours ago

పవన్ వ్యాఖలకు తెలంగాణ నాయకుల కౌంటర్… ఇదేం స్పీడు గురు

తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…

4 hours ago

పవన్ 11 రోజులు అన్నం తిననిది ఇందుకా

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…

4 hours ago

జగన్ తో అమరావతి రైతుల భేటీ నిజమేనా…?

వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…

5 hours ago

ఉత్తరాది బుకింగ్స్ ఎలా ఉన్నాయి

పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…

5 hours ago