భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న మహా కుంభేళాలో 16వ రోజు అయిన బుధవారం తెల్లవారుజామున ఊహించని రీతిలో జరిగిన తొక్కిసలాట ఒక్కసారిగా దేశాన్ని షాక్ కు గురి చేసింది. మౌని అమావాస్య కావడంతో బుధవారం పుణ్య స్నానాలతో అంతా మంచే జరుగుతుందన్న భావనతో కోట్లాది మంది భక్తులు ప్రయాగ్ రాజ్ కు తరలి వచ్చారు.
మంగళవారం రాత్రికి ఇలా ఏకంగా 10 కోట్ల మంది దాకా భక్తులు అక్కడికి చేరుకున్నారట. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున తొక్కిసలాట జరగ్గా… ఇప్పటిదాకా 20 మంది దాకా ప్రానాలు కోల్పోయినట్లు సమాచారం. మరో 40 మంది దాకా గాయపడినట్టు తెలుస్తోంది. ప్రమాద తీవ్రతపై ఇప్పటిదాకా అధికార ప్రకటన వెలువడలేదు.
ఇదిలా ఉంటే… మహా కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలి వస్తారని ఉత్తరప్రదేశ్ సర్కారు ముందే ఊహించింది. ఆ మేరకు ఏర్పాట్లను కూడా భారీగానే చేసింది. అయినా కూడా బుధవారం తొక్కిసలాట జరగడం, అందులో 20 మంది దాకా భక్తులు ప్రాణాలు కోల్పోవడం యోగి సర్కారును అయోయంలో పడేసింది.
దీంతో వెంటనే రంగంలోకి దిగిపోయిన యోగి… ప్రమాదానికి గల కారణాలు ఏమిటన్న దానిని నిగ్గు తేల్చాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో ప్రమాద స్తలాన్ని పరిశీలించిన డీఐజీ వైభవ్ కృష్ణ… ప్రమాదానికి దారి తీసిన కారణాన్ని గుర్తించారు.
నదిలో పుణ్య స్నానాలు చేసిన తర్వాత భక్తులు దుస్తులు మార్చుకునేందుకు ఛేంజింగ్ రూమ్ లను అక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. బుధవారం ఒక్కసారిగా భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడం, వచ్చినవాళ్లు వచ్చినట్లే పుణ్య స్నానాలు చేయడం, ఆ తర్వాత ఛేంజింగ్ రూములకు వచ్చి దుస్తులు మార్చుకోవడం… ఆపై అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు.
ఈ సందర్భంగా ఓ ఛేంజింగ్ రూం వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్ లో ఓ భక్తుడి కాలు ఇరుక్కుపోగా,… తన కాలును తీసుకునేందుకు ఆ భక్తుడు బారీకేడ్ ను ఒకింత నెట్టాడట. దీంతో ఆ బారీకేడ్ ఆ పక్కనే ఉన్న భక్తులపై పడిపోవడం… దాంతో మిగిలిన భక్తులంతా భయాందోళనకు గురి కావడంతో ఈ ప్రమాదం సంభవించినట్లుగా వైభవ్ కృష్ణ తెలిపారు.
This post was last modified on January 29, 2025 3:36 pm
స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది.…
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలు కూటమి ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల అత్యంత విశ్వసనీయత ప్రదర్శిస్తున్న విషయం…