భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న మహా కుంభేళాలో 16వ రోజు అయిన బుధవారం తెల్లవారుజామున ఊహించని రీతిలో జరిగిన తొక్కిసలాట ఒక్కసారిగా దేశాన్ని షాక్ కు గురి చేసింది. మౌని అమావాస్య కావడంతో బుధవారం పుణ్య స్నానాలతో అంతా మంచే జరుగుతుందన్న భావనతో కోట్లాది మంది భక్తులు ప్రయాగ్ రాజ్ కు తరలి వచ్చారు.
మంగళవారం రాత్రికి ఇలా ఏకంగా 10 కోట్ల మంది దాకా భక్తులు అక్కడికి చేరుకున్నారట. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున తొక్కిసలాట జరగ్గా… ఇప్పటిదాకా 20 మంది దాకా ప్రానాలు కోల్పోయినట్లు సమాచారం. మరో 40 మంది దాకా గాయపడినట్టు తెలుస్తోంది. ప్రమాద తీవ్రతపై ఇప్పటిదాకా అధికార ప్రకటన వెలువడలేదు.
ఇదిలా ఉంటే… మహా కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలి వస్తారని ఉత్తరప్రదేశ్ సర్కారు ముందే ఊహించింది. ఆ మేరకు ఏర్పాట్లను కూడా భారీగానే చేసింది. అయినా కూడా బుధవారం తొక్కిసలాట జరగడం, అందులో 20 మంది దాకా భక్తులు ప్రాణాలు కోల్పోవడం యోగి సర్కారును అయోయంలో పడేసింది.
దీంతో వెంటనే రంగంలోకి దిగిపోయిన యోగి… ప్రమాదానికి గల కారణాలు ఏమిటన్న దానిని నిగ్గు తేల్చాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో ప్రమాద స్తలాన్ని పరిశీలించిన డీఐజీ వైభవ్ కృష్ణ… ప్రమాదానికి దారి తీసిన కారణాన్ని గుర్తించారు.
నదిలో పుణ్య స్నానాలు చేసిన తర్వాత భక్తులు దుస్తులు మార్చుకునేందుకు ఛేంజింగ్ రూమ్ లను అక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. బుధవారం ఒక్కసారిగా భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడం, వచ్చినవాళ్లు వచ్చినట్లే పుణ్య స్నానాలు చేయడం, ఆ తర్వాత ఛేంజింగ్ రూములకు వచ్చి దుస్తులు మార్చుకోవడం… ఆపై అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు.
ఈ సందర్భంగా ఓ ఛేంజింగ్ రూం వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్ లో ఓ భక్తుడి కాలు ఇరుక్కుపోగా,… తన కాలును తీసుకునేందుకు ఆ భక్తుడు బారీకేడ్ ను ఒకింత నెట్టాడట. దీంతో ఆ బారీకేడ్ ఆ పక్కనే ఉన్న భక్తులపై పడిపోవడం… దాంతో మిగిలిన భక్తులంతా భయాందోళనకు గురి కావడంతో ఈ ప్రమాదం సంభవించినట్లుగా వైభవ్ కృష్ణ తెలిపారు.
This post was last modified on January 29, 2025 3:36 pm
‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…