భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న మహా కుంభేళాలో 16వ రోజు అయిన బుధవారం తెల్లవారుజామున ఊహించని రీతిలో జరిగిన తొక్కిసలాట ఒక్కసారిగా దేశాన్ని షాక్ కు గురి చేసింది. మౌని అమావాస్య కావడంతో బుధవారం పుణ్య స్నానాలతో అంతా మంచే జరుగుతుందన్న భావనతో కోట్లాది మంది భక్తులు ప్రయాగ్ రాజ్ కు తరలి వచ్చారు.
మంగళవారం రాత్రికి ఇలా ఏకంగా 10 కోట్ల మంది దాకా భక్తులు అక్కడికి చేరుకున్నారట. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున తొక్కిసలాట జరగ్గా… ఇప్పటిదాకా 20 మంది దాకా ప్రానాలు కోల్పోయినట్లు సమాచారం. మరో 40 మంది దాకా గాయపడినట్టు తెలుస్తోంది. ప్రమాద తీవ్రతపై ఇప్పటిదాకా అధికార ప్రకటన వెలువడలేదు.
ఇదిలా ఉంటే… మహా కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలి వస్తారని ఉత్తరప్రదేశ్ సర్కారు ముందే ఊహించింది. ఆ మేరకు ఏర్పాట్లను కూడా భారీగానే చేసింది. అయినా కూడా బుధవారం తొక్కిసలాట జరగడం, అందులో 20 మంది దాకా భక్తులు ప్రాణాలు కోల్పోవడం యోగి సర్కారును అయోయంలో పడేసింది.
దీంతో వెంటనే రంగంలోకి దిగిపోయిన యోగి… ప్రమాదానికి గల కారణాలు ఏమిటన్న దానిని నిగ్గు తేల్చాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో ప్రమాద స్తలాన్ని పరిశీలించిన డీఐజీ వైభవ్ కృష్ణ… ప్రమాదానికి దారి తీసిన కారణాన్ని గుర్తించారు.
నదిలో పుణ్య స్నానాలు చేసిన తర్వాత భక్తులు దుస్తులు మార్చుకునేందుకు ఛేంజింగ్ రూమ్ లను అక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. బుధవారం ఒక్కసారిగా భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడం, వచ్చినవాళ్లు వచ్చినట్లే పుణ్య స్నానాలు చేయడం, ఆ తర్వాత ఛేంజింగ్ రూములకు వచ్చి దుస్తులు మార్చుకోవడం… ఆపై అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు.
ఈ సందర్భంగా ఓ ఛేంజింగ్ రూం వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్ లో ఓ భక్తుడి కాలు ఇరుక్కుపోగా,… తన కాలును తీసుకునేందుకు ఆ భక్తుడు బారీకేడ్ ను ఒకింత నెట్టాడట. దీంతో ఆ బారీకేడ్ ఆ పక్కనే ఉన్న భక్తులపై పడిపోవడం… దాంతో మిగిలిన భక్తులంతా భయాందోళనకు గురి కావడంతో ఈ ప్రమాదం సంభవించినట్లుగా వైభవ్ కృష్ణ తెలిపారు.
మాజీ సీఎం జగన్ మీడియా ముందుకు వస్తే చాలు…ఆయన నోటి నుంచి ఏం ఆణిముత్యాలు రాలుతాయో అని టీడీపీ, జనసేనకు…
పాము పగబట్టడం విన్నాం... మనిషిపై మరో మనిషి పగబట్టడడమూ చూశాం. కానీ ఓ ఏనుగు పగబట్టడం... అది కూడా ఏళ్ల…
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…