Trends

కుంభమేళా తొక్కిసలాట ఎలా జరిగిందంటే..?

భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న మహా కుంభేళాలో 16వ రోజు అయిన బుధవారం తెల్లవారుజామున ఊహించని రీతిలో జరిగిన తొక్కిసలాట ఒక్కసారిగా దేశాన్ని షాక్ కు గురి చేసింది. మౌని అమావాస్య కావడంతో బుధవారం పుణ్య స్నానాలతో అంతా మంచే జరుగుతుందన్న భావనతో కోట్లాది మంది భక్తులు ప్రయాగ్ రాజ్ కు తరలి వచ్చారు.

మంగళవారం రాత్రికి ఇలా ఏకంగా 10 కోట్ల మంది దాకా భక్తులు అక్కడికి చేరుకున్నారట. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున తొక్కిసలాట జరగ్గా… ఇప్పటిదాకా 20 మంది దాకా ప్రానాలు కోల్పోయినట్లు సమాచారం. మరో 40 మంది దాకా గాయపడినట్టు తెలుస్తోంది. ప్రమాద తీవ్రతపై ఇప్పటిదాకా అధికార ప్రకటన వెలువడలేదు.

ఇదిలా ఉంటే… మహా కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలి వస్తారని ఉత్తరప్రదేశ్ సర్కారు ముందే ఊహించింది. ఆ మేరకు ఏర్పాట్లను కూడా భారీగానే చేసింది. అయినా కూడా బుధవారం తొక్కిసలాట జరగడం, అందులో 20 మంది దాకా భక్తులు ప్రాణాలు కోల్పోవడం యోగి సర్కారును అయోయంలో పడేసింది.

దీంతో వెంటనే రంగంలోకి దిగిపోయిన యోగి… ప్రమాదానికి గల కారణాలు ఏమిటన్న దానిని నిగ్గు తేల్చాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో ప్రమాద స్తలాన్ని పరిశీలించిన డీఐజీ వైభవ్ కృష్ణ… ప్రమాదానికి దారి తీసిన కారణాన్ని గుర్తించారు.

నదిలో పుణ్య స్నానాలు చేసిన తర్వాత భక్తులు దుస్తులు మార్చుకునేందుకు ఛేంజింగ్ రూమ్ లను అక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. బుధవారం ఒక్కసారిగా భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడం, వచ్చినవాళ్లు వచ్చినట్లే పుణ్య స్నానాలు చేయడం, ఆ తర్వాత ఛేంజింగ్ రూములకు వచ్చి దుస్తులు మార్చుకోవడం… ఆపై అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు.

ఈ సందర్భంగా ఓ ఛేంజింగ్ రూం వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్ లో ఓ భక్తుడి కాలు ఇరుక్కుపోగా,… తన కాలును తీసుకునేందుకు ఆ భక్తుడు బారీకేడ్ ను ఒకింత నెట్టాడట. దీంతో ఆ బారీకేడ్ ఆ పక్కనే ఉన్న భక్తులపై పడిపోవడం… దాంతో మిగిలిన భక్తులంతా భయాందోళనకు గురి కావడంతో ఈ ప్రమాదం సంభవించినట్లుగా వైభవ్ కృష్ణ తెలిపారు.

Kumar

Recent Posts

ప్రెగ్నెంట్ అన్నారు… క్రేజీ మూవీ చేస్తోంది

టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌…

1 hour ago

మృణాల్… ఫ్లాపులు కూడా తాకలేని అందం

టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…

2 hours ago

కొరియన్ మార్కెట్ పై వంగా డార్క్ స్ట్రాటజీ

పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…

5 hours ago

‘ఓం’ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు

ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…

8 hours ago

ఆ నిర్మాతకు మళ్లీ జాక్‌పాటేనా?

తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…

9 hours ago

సీబీఐ విచారణకు జగన్ డిమాండ్

విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…

11 hours ago