ఈ సంక్రాంతి ఏపీకి వెరీ వెరీ స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే… పండుగకు ముందు ప్రభుత్వం మారింది. కూటమి కొత్త సర్కారు పాలన మొదలు కాగానే… రాష్ట్రంలో ఓ నూతన ఒరవడి కనిపించింది. పాలనలో దూకుడుతో వెళుతున్న కూటమి సర్కారు ఎక్కడిక్కడ తనదైన శైలి నిర్ణయాలు తీసుకుంటోంది. ఫలితంగా రాష్ట్రంలో కొత్త ఉత్సాహం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. అదే ఉత్సాహం సంక్రాంతి వేడుకల్లో కనిపించింది.
బుధవారంతో సంక్రాంతి వేడుకలు పూర్తీ కాగా… సొంతూళ్లకు వెళ్లిన వారంతా బుధవారం రాత్రి నుంచే తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో ఆయా ప్రాంతాల నుంచి పట్టణాలు… ప్రత్యేకించి హైదరాబాద్ కు దారితీసే ప్రధాన రహదారులు అన్నీ రద్దీగా మారిపోయాయి. ఈ రద్దీతో ఏపీఎస్ఆర్టీసీకి భారీ లాభాలు వచ్చాయి. గత సంక్రాంతి కంటే కూడా ఈ సంక్రాంతికి రద్దీ పెరిగిందని చెప్పిన ఏపీఎస్ఆర్టీసీ.. అందుకు అనుగుణంగానే లాభాలు కూడా రెట్టింపుగా వచ్చాయని తెలిపింది.
సంక్రాంతి వేడుకలు ఏపీలో ఘనంగా జరుగుతున్నా సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి ఏపీకి భారీ ఎత్తున ప్రయాణాలు ఉంటున్నాయి. ఈ సారి కూడా అదే జోరు కొనసాగింది. ఈ సంక్రాంతికి ఏపీకి ఏకంగా 4.3 లక్షల మంది జనం వెళ్లారని అంచనా. వేడుకలు ముగిసిన నేపథ్యంలో ఇప్పుడిప్పుడే తిరుగు ప్రయాణాలు మొదలయ్యాయి. తిరుగు ప్రయాణాలు కూడా పూర్తీ అయితే మొత్తంగా 8 లక్షల మంది దాకా ఏపీఎస్ఆర్టీసీలో ప్రయాణించినట్టు అవుతుంది.
ప్రస్తుతానికి… ఏపీఎస్ఆర్టీసీకి ఈ ప్రయాణాల ద్వారా రూ.12 కోట్ల దాకా వాచినట్టు అధికారులు చెబుతున్నారు. తిరుగు ప్రయాణాలు కూడా పూర్తీ అయితే ఈ ఆదాయం మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. గతేడాది సంక్రాంతికి మొత్తంగా 4.త్రీ కోట్ల మంది తమ బస్సుల్లో ప్రయాణించారని ఏపీఎస్ఆర్టీసీ చెప్పింది. ఈ లెక్కన ఈ సంక్రాంతికి ఏపీకి వెళ్లిన వారి సంఖ్యా దాదాపుగా డబల్ అయిపోయిందని చెప్పొచ్చు.
This post was last modified on January 17, 2025 2:00 pm
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…