Trends

పాడిపంటల పండుగ సంక్రాంతి విశిష్టత మీకు తెలుసా?

తెలుగింటి సంక్రాంతి అంటే సంబరాల పండుగ అని ప్రసిద్ధి. మూడు రోజులపాటు ఎంతో ముచ్చటగా జరుపుకునే ఈ పండుగ వెనుక ఎంతో మంచి పరమార్ధం దాగివుంది. ఈ పండుగ సూర్యుడు ధనుస్సు రాశి నుండి మకర రాశికి ప్రయాణం చేసే సమయంలో జరుపుకుంటారు. ఇది ఉత్తరాయణ కాలంలో సంభవించడంతో, ఈ పండుగ ప్రత్యేకమైనదిగా మారింది. సూర్యుని గమనం మారడం వల్ల వాతావరణం మారి, పంటలు మంచి ఫలితాన్ని ఇవ్వడం అందుకు సూచనగా మారుతుంది.

సంక్రాంతి పండుగను ముఖ్యంగా రైతుల పండుగగా భావిస్తారు. పంటలు చేతికి వచ్చి ఇంటికి చేరిన తర్వాత, రైతులు ఆనందంతో ఈ పండుగను జరుపుకుంటారు. కొత్త ధాన్యంతో అన్నం వండకుండా, ఆ బియ్యంతో పరమాన్నం, అప్పాలు, అరిసెలు, చక్కిలాలు తయారు చేస్తారు. ఇది జీర్ణ సమస్యలను నివారిస్తుంది. తమిళనాడులో ఈ పండుగను ‘పొంగల్’ అని పిలుస్తారు, అక్కడ కొత్త బియ్యంతో పొంగల్ చేసి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు. ఈ పండుగను ప్రకృతిని, పశువులను కూడా పూజించడానికి సంబంధించినది.

సంక్రాంతి పండుగలో నువ్వుల ప్రత్యేకత కూడా ఉంది. నువ్వులు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనవి. అవి శరీరానికి వేడి ఇస్తాయి, దీంతో వాతావరణంలో మార్పులు వచ్చే సమయంలో శరీరం అలవాటు పడుతుంది. సంక్రాంతి పండుగ భోగితో ప్రారంభమవుతుంది.. తెల్లవారుజామున ప్రజలు ఉత్తమ ఇంటిముందు భోగిమంటలు వేస్తారు. ధనుర్మాసం మొదటి రోజు నుంచి వైష్ణవాలయాలలో గోదాదేవి తిరుప్పావై పాశురాలతో దేవుడిని ఆరాధిస్తారు. తిరుప్పావై తో రంగనాథుణ్ణి ఆరాధించిన గోదాదేవి భోగి పండుగ రోజు స్వామిని వివాహమాడి ఆయనలో లీనమైంది. అందుకే ధనుర్మాస వ్రతాన్ని బోగితో ముగిస్తారు.

ఇక ఇళ్లలో చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోయడం కూడా ఒక సాంప్రదాయమే. రేగిపళ్ళలు బదరీ ఫలాలు అని పిలుస్తారు.. సూర్యుడి కాంతిని తనలో నిలుపుకునే శక్తి కలిగిన రేగి పండ్లు పిల్లలపై పోయడం వల్ల వారికి సూర్యుడికి ఉన్నంత శక్తి సమకూరుతుంది అని పెద్దలు భావిస్తారు. అందుకే ఇంట్లో చిన్న పిల్లలకు రేగి పండ్లు, చెరుకు ముక్కలు, చిల్లర, నవధాన్యాలు కలిపి భోగి పళ్ళు పోస్తారు.

ఇక సంక్రాంతి అంటే ఇళ్ళ ముందు ముగ్గులు.. గొబ్బెమ్మలు.. అంబరాన్ని తాకే గాలిపటాల సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పల్లెటూర్లలో ఈ పండగ సమయంలో వీధుల్లో హరిదాసులు, బుడబుక్కలవారు, గంగిరెద్దులు తిరుగుతూ సందడి చేస్తారు. ఇక సంక్రాంతి రోజున పెద్దలకు పూజ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇక సంక్రాంతి సమయంలో చేసే దానాల వల్ల పితృ దోషాలు తొలగుతాయని చాలామంది నమ్ముతారు.

ఇక సంక్రాంతి సంబరాలు చివరి రోజును సంవత్సరం మొత్తం తమ యజమానుల కోసం కష్టపడి పంట పండించడానికి సహాయపడిన పశుపక్షాదులను పూజించే కనుమ. ఆరోజు ఆవులను, ఎద్దులను, బర్రెలను ముస్తాబు చేస్తారు.. రైతన్నకు నేస్తాలైన పక్షుల కోసం ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులను కడతారు. ఇలా సంక్రాంతి అనేది మనిషి ప్రకృతిలో మమేకమౌతూ చేసుకునే ఓ గొప్ప సంబరం.

Kumar

Recent Posts

మళ్ళీ మౌనవ్రతం చేస్తున్న స్లమ్ డాగ్

పూరి జగన్నాథ్ సినిమా అంటే ప్రేక్షకుల్లో అదో రకమైన స్పెషల్ క్రేజ్ ఉండేది. స్టార్ హీరోతో చేసినా, కొత్తవాళ్లతో తీసినా…

5 minutes ago

సుకుమార్ వేసిన దారిలో ఎందరో

ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…

9 hours ago

దురంధర్ విలన్ ‘ఇక్కా’ ఎలా ఉంది

ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…

9 hours ago

ధనుష్ మురుగన్… త్రివిక్రమ్ రియాక్షన్ ఏంటో

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…

10 hours ago

అక్క రాజ్యం చూపిస్తానంటున్న కవిత

తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత విశ్వ‌రూపం చూపించారు. ప‌దునైన మాట‌ల‌తో విరుచుకుప‌డ్డారు. ``ఇప్ప‌టి వ‌ర‌కు మీరు అన్న‌..…

10 hours ago

‘భాగ్యశ్రీ’ భాగ్యరేఖ మారినట్టేనా

మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…

10 hours ago