Trends

పాడిపంటల పండుగ సంక్రాంతి విశిష్టత మీకు తెలుసా?

తెలుగింటి సంక్రాంతి అంటే సంబరాల పండుగ అని ప్రసిద్ధి. మూడు రోజులపాటు ఎంతో ముచ్చటగా జరుపుకునే ఈ పండుగ వెనుక ఎంతో మంచి పరమార్ధం దాగివుంది. ఈ పండుగ సూర్యుడు ధనుస్సు రాశి నుండి మకర రాశికి ప్రయాణం చేసే సమయంలో జరుపుకుంటారు. ఇది ఉత్తరాయణ కాలంలో సంభవించడంతో, ఈ పండుగ ప్రత్యేకమైనదిగా మారింది. సూర్యుని గమనం మారడం వల్ల వాతావరణం మారి, పంటలు మంచి ఫలితాన్ని ఇవ్వడం అందుకు సూచనగా మారుతుంది.

సంక్రాంతి పండుగను ముఖ్యంగా రైతుల పండుగగా భావిస్తారు. పంటలు చేతికి వచ్చి ఇంటికి చేరిన తర్వాత, రైతులు ఆనందంతో ఈ పండుగను జరుపుకుంటారు. కొత్త ధాన్యంతో అన్నం వండకుండా, ఆ బియ్యంతో పరమాన్నం, అప్పాలు, అరిసెలు, చక్కిలాలు తయారు చేస్తారు. ఇది జీర్ణ సమస్యలను నివారిస్తుంది. తమిళనాడులో ఈ పండుగను ‘పొంగల్’ అని పిలుస్తారు, అక్కడ కొత్త బియ్యంతో పొంగల్ చేసి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు. ఈ పండుగను ప్రకృతిని, పశువులను కూడా పూజించడానికి సంబంధించినది.

సంక్రాంతి పండుగలో నువ్వుల ప్రత్యేకత కూడా ఉంది. నువ్వులు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనవి. అవి శరీరానికి వేడి ఇస్తాయి, దీంతో వాతావరణంలో మార్పులు వచ్చే సమయంలో శరీరం అలవాటు పడుతుంది. సంక్రాంతి పండుగ భోగితో ప్రారంభమవుతుంది.. తెల్లవారుజామున ప్రజలు ఉత్తమ ఇంటిముందు భోగిమంటలు వేస్తారు. ధనుర్మాసం మొదటి రోజు నుంచి వైష్ణవాలయాలలో గోదాదేవి తిరుప్పావై పాశురాలతో దేవుడిని ఆరాధిస్తారు. తిరుప్పావై తో రంగనాథుణ్ణి ఆరాధించిన గోదాదేవి భోగి పండుగ రోజు స్వామిని వివాహమాడి ఆయనలో లీనమైంది. అందుకే ధనుర్మాస వ్రతాన్ని బోగితో ముగిస్తారు.

ఇక ఇళ్లలో చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోయడం కూడా ఒక సాంప్రదాయమే. రేగిపళ్ళలు బదరీ ఫలాలు అని పిలుస్తారు.. సూర్యుడి కాంతిని తనలో నిలుపుకునే శక్తి కలిగిన రేగి పండ్లు పిల్లలపై పోయడం వల్ల వారికి సూర్యుడికి ఉన్నంత శక్తి సమకూరుతుంది అని పెద్దలు భావిస్తారు. అందుకే ఇంట్లో చిన్న పిల్లలకు రేగి పండ్లు, చెరుకు ముక్కలు, చిల్లర, నవధాన్యాలు కలిపి భోగి పళ్ళు పోస్తారు.

ఇక సంక్రాంతి అంటే ఇళ్ళ ముందు ముగ్గులు.. గొబ్బెమ్మలు.. అంబరాన్ని తాకే గాలిపటాల సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పల్లెటూర్లలో ఈ పండగ సమయంలో వీధుల్లో హరిదాసులు, బుడబుక్కలవారు, గంగిరెద్దులు తిరుగుతూ సందడి చేస్తారు. ఇక సంక్రాంతి రోజున పెద్దలకు పూజ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇక సంక్రాంతి సమయంలో చేసే దానాల వల్ల పితృ దోషాలు తొలగుతాయని చాలామంది నమ్ముతారు.

ఇక సంక్రాంతి సంబరాలు చివరి రోజును సంవత్సరం మొత్తం తమ యజమానుల కోసం కష్టపడి పంట పండించడానికి సహాయపడిన పశుపక్షాదులను పూజించే కనుమ. ఆరోజు ఆవులను, ఎద్దులను, బర్రెలను ముస్తాబు చేస్తారు.. రైతన్నకు నేస్తాలైన పక్షుల కోసం ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులను కడతారు. ఇలా సంక్రాంతి అనేది మనిషి ప్రకృతిలో మమేకమౌతూ చేసుకునే ఓ గొప్ప సంబరం.

This post was last modified on January 4, 2025 7:51 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

టంగ్ స్లిప్ లతో టీడీపీని ఇబ్బందుల్లోకి నెడుతున్న దీపక్ రెడ్డి

టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…

4 minutes ago

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

2 hours ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

2 hours ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

5 hours ago

ఇక ‘నెంబర్ వన్’ హీరోయిన్ లేనట్టేనా?

ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…

8 hours ago

విమానాల్లో లోపాలు.. ఎయిర్ ఇండియా, ఇండిగో టాప్!

మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…

8 hours ago