Trends

పాడిపంటల పండుగ సంక్రాంతి విశిష్టత మీకు తెలుసా?

తెలుగింటి సంక్రాంతి అంటే సంబరాల పండుగ అని ప్రసిద్ధి. మూడు రోజులపాటు ఎంతో ముచ్చటగా జరుపుకునే ఈ పండుగ వెనుక ఎంతో మంచి పరమార్ధం దాగివుంది. ఈ పండుగ సూర్యుడు ధనుస్సు రాశి నుండి మకర రాశికి ప్రయాణం చేసే సమయంలో జరుపుకుంటారు. ఇది ఉత్తరాయణ కాలంలో సంభవించడంతో, ఈ పండుగ ప్రత్యేకమైనదిగా మారింది. సూర్యుని గమనం మారడం వల్ల వాతావరణం మారి, పంటలు మంచి ఫలితాన్ని ఇవ్వడం అందుకు సూచనగా మారుతుంది.

సంక్రాంతి పండుగను ముఖ్యంగా రైతుల పండుగగా భావిస్తారు. పంటలు చేతికి వచ్చి ఇంటికి చేరిన తర్వాత, రైతులు ఆనందంతో ఈ పండుగను జరుపుకుంటారు. కొత్త ధాన్యంతో అన్నం వండకుండా, ఆ బియ్యంతో పరమాన్నం, అప్పాలు, అరిసెలు, చక్కిలాలు తయారు చేస్తారు. ఇది జీర్ణ సమస్యలను నివారిస్తుంది. తమిళనాడులో ఈ పండుగను ‘పొంగల్’ అని పిలుస్తారు, అక్కడ కొత్త బియ్యంతో పొంగల్ చేసి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు. ఈ పండుగను ప్రకృతిని, పశువులను కూడా పూజించడానికి సంబంధించినది.

సంక్రాంతి పండుగలో నువ్వుల ప్రత్యేకత కూడా ఉంది. నువ్వులు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనవి. అవి శరీరానికి వేడి ఇస్తాయి, దీంతో వాతావరణంలో మార్పులు వచ్చే సమయంలో శరీరం అలవాటు పడుతుంది. సంక్రాంతి పండుగ భోగితో ప్రారంభమవుతుంది.. తెల్లవారుజామున ప్రజలు ఉత్తమ ఇంటిముందు భోగిమంటలు వేస్తారు. ధనుర్మాసం మొదటి రోజు నుంచి వైష్ణవాలయాలలో గోదాదేవి తిరుప్పావై పాశురాలతో దేవుడిని ఆరాధిస్తారు. తిరుప్పావై తో రంగనాథుణ్ణి ఆరాధించిన గోదాదేవి భోగి పండుగ రోజు స్వామిని వివాహమాడి ఆయనలో లీనమైంది. అందుకే ధనుర్మాస వ్రతాన్ని బోగితో ముగిస్తారు.

ఇక ఇళ్లలో చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోయడం కూడా ఒక సాంప్రదాయమే. రేగిపళ్ళలు బదరీ ఫలాలు అని పిలుస్తారు.. సూర్యుడి కాంతిని తనలో నిలుపుకునే శక్తి కలిగిన రేగి పండ్లు పిల్లలపై పోయడం వల్ల వారికి సూర్యుడికి ఉన్నంత శక్తి సమకూరుతుంది అని పెద్దలు భావిస్తారు. అందుకే ఇంట్లో చిన్న పిల్లలకు రేగి పండ్లు, చెరుకు ముక్కలు, చిల్లర, నవధాన్యాలు కలిపి భోగి పళ్ళు పోస్తారు.

ఇక సంక్రాంతి అంటే ఇళ్ళ ముందు ముగ్గులు.. గొబ్బెమ్మలు.. అంబరాన్ని తాకే గాలిపటాల సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పల్లెటూర్లలో ఈ పండగ సమయంలో వీధుల్లో హరిదాసులు, బుడబుక్కలవారు, గంగిరెద్దులు తిరుగుతూ సందడి చేస్తారు. ఇక సంక్రాంతి రోజున పెద్దలకు పూజ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇక సంక్రాంతి సమయంలో చేసే దానాల వల్ల పితృ దోషాలు తొలగుతాయని చాలామంది నమ్ముతారు.

ఇక సంక్రాంతి సంబరాలు చివరి రోజును సంవత్సరం మొత్తం తమ యజమానుల కోసం కష్టపడి పంట పండించడానికి సహాయపడిన పశుపక్షాదులను పూజించే కనుమ. ఆరోజు ఆవులను, ఎద్దులను, బర్రెలను ముస్తాబు చేస్తారు.. రైతన్నకు నేస్తాలైన పక్షుల కోసం ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులను కడతారు. ఇలా సంక్రాంతి అనేది మనిషి ప్రకృతిలో మమేకమౌతూ చేసుకునే ఓ గొప్ప సంబరం.

This post was last modified on January 4, 2025 7:51 pm

Share

Recent Posts

త‌మిళ ప్రేక్ష‌కులకో దండం

ఒకప్పుడు త‌మిళ ప్రేక్ష‌కుల అభిరుచి గురించి ఇత‌ర భాష‌ల వాళ్లు గొప్ప‌గా చెప్పుకునేవాళ్లు. కొత్త త‌ర‌హా సినిమాల‌ను, ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌ను…

3 minutes ago

లోక‌ల్ ఫైట్‌: జ‌గ‌న్‌ ముందే చేతులెత్తేశారా?

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు ముహూర్తం రెడీ అవుతోంది. ప్ర‌భుత్వం వైపు నుంచి ఈ ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేసింది.…

20 minutes ago

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా..?

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా? ఆ పార్టీ చెబుతున్న‌ట్టు 40 శాతం ఓటు బ్యాంకు వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు అలానే…

31 minutes ago

థియేటర్లకు జై కొడుతున్న తెలుగు ప్రేక్షకులు

జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…

31 minutes ago

కాక్రోచులను వెనక్కి తరిమిన వారెవరు?

విద్యార్థి ఉద్య‌మాల‌కు తెర‌దీసిన కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు తొలిసారి ప‌రాభవం ఎదురైంది. ఇటీవ‌ల నీట్ ప్ర‌శ్న ప‌త్రం…

44 minutes ago

పూర్ణ డాన్సులో రజినీకాంత్ కనిపించట్లేదు

ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…

2 hours ago