సంక్రాంతి అంటేనే సందడితో కూడుకున్న పండుగ.. ప్రతి ఇంటిలో సంక్రాంతి అంటే ఇంటిముందు ముచ్చట గొలిపే రంగవల్లులే కాదు ఆకాశంలో చుక్కలను తాకుతూ ఎగిరే రంగురంగుల పతంగులు దర్శనమిస్తాయి. అందరికీ ఎంతో ఆనందాన్ని పంచాల్సిన ఈ పండుగ.. కొన్ని కారణాల వల్ల చాలా మంది జీవితాల్లో చీకటిని మిగులుస్తోంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో సాగే పతంగుల సందడి కారణంగా కొన్ని ప్రమాదకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి ముఖ్య కారణం పతంగులను ఎగుర వేయడానికి ఉపయోగిస్తున్న మాంజా అనడంలో సందేహం లేదు.
పతంగుల పోటీలలో మన గాలిపటం ఎంత ఎత్తుకు ఎగురుతుంది అనేదానికంటే కూడా పక్కన వాళ్ళ గాలిపటాన్ని పడగొట్టడంలోనే చాలామంది మజా ఫీల్ అవుతారు. ఇక ఇందుకోసం చాలా గట్టిగా ఉండే దారం అవసరం అవుతుంది.. ఇందుకోసం గత కొద్దికాలంగా పతంగుల పోటీలలో ఎక్కువగా ఉపయోగిస్తున్న దారం చైనా మాంజా. గాజుపొడితో పాటు కొన్ని ప్రమాదకరమైన రసాయనాల కలయికతో తయారు చేసే ఈ మాంజా కారణంగా పర్యావరణానికి నష్టం కలగడంతో పాటు ఎందరో ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు.
తాజాగా ఒక సైనికుడు కూడా దీని వలన తన ప్రాణాలను కోల్పోవడంతో పోలీసు అధికారులు ఇది కొన్నా, అమ్మినా చాలా పెద్ద నేరంగా పరిగణనలోకి తీసుకొని తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
ఇటు ఈ మాంజా వల్ల అని ఎన్నో పక్షజాతులు అంతరించిపోతున్నాయి. మార్కెట్లో దొరికే గాలిపటానికి ఉపయోగించే తాళ్లతో పోల్చుకుంటే ఈ చైనా మాంజా చాలా తక్కువ ధరకి వస్తుంది. కంటికి నచ్చే ఆహ్లాదకరమైన రంగులలో చాలా బలంగా ఉంటుంది. ఇది మంచి పదును మీద ఉన్న దారం కాబట్టి పతంగి పోటీలలో గెలవడానికి చాలా ఉపయోగపడుతుంది. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ప్రస్తుతం ఈ చైనా మాంజ ఉపయోగంపై నిషేధం ఉంది.
అవును ఈ చైనా మాంజా ని ఉపయోగించినా.. విక్రయించినా అది చట్టరీత్యా నేరం కిందే పరిగణించబడుతుంది. అయినా కానీ మార్కెట్లో ఈ దారాలు విరివిగా దొరుకుతున్నాయి. ఒకపక్క ప్రభుత్వం వీటిపై చర్యలు తీసుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఎక్కడో ఒక దగ్గర వీటి కారణంగా ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఇంకా సంక్రాంతి మొదలు కూడా కాకముందే అక్కడక్కడ ఈ చైనా మంజ కారణంగా ఎందరో ప్రమాదాల పాలైన వార్తలు మనం చదువుతూనే ఉన్నాము.
ద్విచక్ర వాహనదారులు ఈ చైనా మాంజా కారణంగా ఎక్కువ ప్రమాదాల బారిన పడుతున్నారు. డ్రైవింగ్ చేసే సమయంలో అనుకోకుండా తెగిన ఈ తాడు వారి మెడలకు చుట్టుకొని ప్రాణాలు పోగొట్టుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా ఈ పతంగుల హడావిడి మొదలయ్యాక చాలామంది ద్విచక్ర వాహనదారులు గాయాలు పాలవుతున్నారు. ఈ దారం చిక్కులలో చిక్కుకొని ఎన్నో వందల పక్షులు ప్రతి సంవత్సరం మరణిస్తున్నాయి. ఇందులో ప్లాస్టిక్ తో పాటు ప్రమాదకరమైన రసాయనాల కలయిక కూడా ఉంటుంది కాబట్టి ఇది పర్యావరణానికి కూడా ఎంతో హానికరమైనది.
మన సంతోషం కోసం నాలుగు రోజులు ఆడే ఒక చిన్న ఆట కారణంగా ఎంత మంది ఇబ్బందులు పడుతున్నారో ఇకనైనా గ్రహించడం చాలా మంచిది. పర్యావరణానికి హాని లేకుండా.. ఎవరికి ఇబ్బంది కలుగకుండా ఉండే సాధారణమైన మాంజాను మనం ఉపయోగించాలి. చైనా మాంజా నిషేధాన్ని గట్టిగా అమలు చేయడంలో ప్రభుత్వానికి సహకారం అందించాలి. మన చుట్టూ ఉన్నవారికి దీని వల్ల కలిగే ప్రమాదాల గురించి అవగాహన కల్పించి ఈ మాంజా వినియోగం ఆపాలి. అప్పుడే మనం సురక్షితమైన ,ఆనందమైన సంక్రాంతిని జరుపుకుంటాము.
This post was last modified on January 4, 2025 12:13 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…