సంక్రాంతి అంటేనే సందడితో కూడుకున్న పండుగ.. ప్రతి ఇంటిలో సంక్రాంతి అంటే ఇంటిముందు ముచ్చట గొలిపే రంగవల్లులే కాదు ఆకాశంలో చుక్కలను తాకుతూ ఎగిరే రంగురంగుల పతంగులు దర్శనమిస్తాయి. అందరికీ ఎంతో ఆనందాన్ని పంచాల్సిన ఈ పండుగ.. కొన్ని కారణాల వల్ల చాలా మంది జీవితాల్లో చీకటిని మిగులుస్తోంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో సాగే పతంగుల సందడి కారణంగా కొన్ని ప్రమాదకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి ముఖ్య కారణం పతంగులను ఎగుర వేయడానికి ఉపయోగిస్తున్న మాంజా అనడంలో సందేహం లేదు.
పతంగుల పోటీలలో మన గాలిపటం ఎంత ఎత్తుకు ఎగురుతుంది అనేదానికంటే కూడా పక్కన వాళ్ళ గాలిపటాన్ని పడగొట్టడంలోనే చాలామంది మజా ఫీల్ అవుతారు. ఇక ఇందుకోసం చాలా గట్టిగా ఉండే దారం అవసరం అవుతుంది.. ఇందుకోసం గత కొద్దికాలంగా పతంగుల పోటీలలో ఎక్కువగా ఉపయోగిస్తున్న దారం చైనా మాంజా. గాజుపొడితో పాటు కొన్ని ప్రమాదకరమైన రసాయనాల కలయికతో తయారు చేసే ఈ మాంజా కారణంగా పర్యావరణానికి నష్టం కలగడంతో పాటు ఎందరో ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు.
తాజాగా ఒక సైనికుడు కూడా దీని వలన తన ప్రాణాలను కోల్పోవడంతో పోలీసు అధికారులు ఇది కొన్నా, అమ్మినా చాలా పెద్ద నేరంగా పరిగణనలోకి తీసుకొని తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
ఇటు ఈ మాంజా వల్ల అని ఎన్నో పక్షజాతులు అంతరించిపోతున్నాయి. మార్కెట్లో దొరికే గాలిపటానికి ఉపయోగించే తాళ్లతో పోల్చుకుంటే ఈ చైనా మాంజా చాలా తక్కువ ధరకి వస్తుంది. కంటికి నచ్చే ఆహ్లాదకరమైన రంగులలో చాలా బలంగా ఉంటుంది. ఇది మంచి పదును మీద ఉన్న దారం కాబట్టి పతంగి పోటీలలో గెలవడానికి చాలా ఉపయోగపడుతుంది. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ప్రస్తుతం ఈ చైనా మాంజ ఉపయోగంపై నిషేధం ఉంది.
అవును ఈ చైనా మాంజా ని ఉపయోగించినా.. విక్రయించినా అది చట్టరీత్యా నేరం కిందే పరిగణించబడుతుంది. అయినా కానీ మార్కెట్లో ఈ దారాలు విరివిగా దొరుకుతున్నాయి. ఒకపక్క ప్రభుత్వం వీటిపై చర్యలు తీసుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఎక్కడో ఒక దగ్గర వీటి కారణంగా ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఇంకా సంక్రాంతి మొదలు కూడా కాకముందే అక్కడక్కడ ఈ చైనా మంజ కారణంగా ఎందరో ప్రమాదాల పాలైన వార్తలు మనం చదువుతూనే ఉన్నాము.
ద్విచక్ర వాహనదారులు ఈ చైనా మాంజా కారణంగా ఎక్కువ ప్రమాదాల బారిన పడుతున్నారు. డ్రైవింగ్ చేసే సమయంలో అనుకోకుండా తెగిన ఈ తాడు వారి మెడలకు చుట్టుకొని ప్రాణాలు పోగొట్టుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా ఈ పతంగుల హడావిడి మొదలయ్యాక చాలామంది ద్విచక్ర వాహనదారులు గాయాలు పాలవుతున్నారు. ఈ దారం చిక్కులలో చిక్కుకొని ఎన్నో వందల పక్షులు ప్రతి సంవత్సరం మరణిస్తున్నాయి. ఇందులో ప్లాస్టిక్ తో పాటు ప్రమాదకరమైన రసాయనాల కలయిక కూడా ఉంటుంది కాబట్టి ఇది పర్యావరణానికి కూడా ఎంతో హానికరమైనది.
మన సంతోషం కోసం నాలుగు రోజులు ఆడే ఒక చిన్న ఆట కారణంగా ఎంత మంది ఇబ్బందులు పడుతున్నారో ఇకనైనా గ్రహించడం చాలా మంచిది. పర్యావరణానికి హాని లేకుండా.. ఎవరికి ఇబ్బంది కలుగకుండా ఉండే సాధారణమైన మాంజాను మనం ఉపయోగించాలి. చైనా మాంజా నిషేధాన్ని గట్టిగా అమలు చేయడంలో ప్రభుత్వానికి సహకారం అందించాలి. మన చుట్టూ ఉన్నవారికి దీని వల్ల కలిగే ప్రమాదాల గురించి అవగాహన కల్పించి ఈ మాంజా వినియోగం ఆపాలి. అప్పుడే మనం సురక్షితమైన ,ఆనందమైన సంక్రాంతిని జరుపుకుంటాము.
This post was last modified on January 4, 2025 12:13 pm
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…