అవును.. ఇప్పుడు చెప్పే ఉదంతాన్ని చదివినంతనే.. యమలోకంతో కనెక్షన్ ఉండే చాలా సినిమాలు ఇట్టే గుర్తుకు వచ్చేస్తాయి. నూకలు తీరకుండానే ప్రాణం పోతే.. ఏదో రూపంలో బతికేస్తాడన్నట్లుగా ఉండే ఈ సినిమా సీన్లకు తగ్గట్లే.. తాజా రియల్ సీన్ ఉందని చెప్పాలి. చనిపోయిన వ్యక్తి.. కాసేపట్లో చితిమంటల్లో కాలిపోవాల్సిన వేళ.. అనూహ్యంగా బతికిన వైనం అందరిని ఆకర్షిస్తోంది. మహారాష్ట్రలో చోటు చేసుకున్న ఈ వింత ఘటన రీల్ సీన్ కు ఏ మాత్రం తీసిపోనట్లుగా ఉందని చెప్పాలి. అసలేం జరిగిందంటే..
డిసెంబరు పదహారో తేదీన కొల్హాపూర్ జిల్లా కసాబా – బావడా ప్రాంతానికి చెందిన 65 ఏల్ల పాండురంగ ఉల్పే అనే వ్యక్తికి గుండెపోటు బారిన పడ్డారు. దీంతో.. అతన్ని హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయన్ను పరిక్షించిన వైద్యులు పాండురంగ అప్పటికే మరణించినట్లుగా ప్రకటించారు. దీంతో.. అతడి డెడ్ బాడీని తీసుకెళ్లేందుకు ఒక అంబులెన్సును సిద్ధం చేశారు. పాండురంగ చనిపోయిన విషయం అతడి గ్రామం మొత్తానికి తెలిసింది. వెంటనే.. బంధువులు.. స్నేహితులు ఇంటికి వచ్చారు.
దీంతో పాండురంగ డెడ్ బాడీని త్వరగా ఇంటికి తీసుకురావాలని కుటుంబ సభ్యులకు ఫోన్ల మీద ఫోన్లు రావటం మొదలయ్యాయి. దీంతో.. అంబులెన్సు డ్రైవర్ ను కాస్తంత వేగంగా తీసుకెళ్లాని కోరారు. దీంతో.. అంబులెన్సును వేగంగాపోనిచ్చిన ఒక డ్రైవర్.. మార్గమధ్యంలో ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్ ను చూడకుండా అలానే వేగంగా పోనిచ్చాడు. దీంతో వాహనం బారీ కుదుపునకు లోనైంది. ఆ టైంలో పాండురంగ శరీరం అటు ఇటూ కదిలిపోయింది.
దీంతో.. కుటుంబ సభ్యులు పాండురంగ బాడీని స్ట్రెచర్ పైకి సరిగా పెట్టే వేళ.. అతడి చేతివేళ్లు కదలటం చూసిన భార్య ఒక్కసారి షాక్ తిని.. వెంటనే అంబులెన్సు డ్రైవర్ కు ఈ విషయాన్ని చెప్పారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా కోరారు. స్పందించిన అంబులెన్సు డ్రైవర్ దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లి.. ఐసీయూలో చేర్చించారు.
పాండురంగ ప్రాణాలతోనే ఉన్నారని అక్కడి వైద్యులు చెప్పటంతో పాటు.. వెంటనే యాంజియో ప్లాస్టీ చేశారు. రెండు వారాల చికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్న పాండురంగ ఇంటికి రావటంతో ఆశ్చర్యపోవటం అందరి వంతైంది. స్పీడ్ బ్రేకర్ లేకుంటే మా ఇంటి పెద్దాయన పరిస్థితి ఏంటి? బతికి ఉన్న రోగిని చనిపోయాడని సర్టిఫై చేస్తారా? అంటూ సదరు ఆసుపత్రిని కోర్టుకు ఈడుస్తామని పాండురంగ ఫ్యామిలీ మెంబర్స్ సీరియస్ అవుతున్నారు. ఇప్పటివరకు స్పీడ్ బ్రేకర్లు కొన్నిసార్లు ప్రాణాలు తీయటం తెలుసు కానీ.. ప్రాణం పోయటం ఇదేనన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
This post was last modified on January 3, 2025 9:46 am
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…
తెలంగాణలో సింగిల్ స్క్రీన్లను నడిపించే ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య పీటముడి గట్టిగానే బిగుసుకునేలా కనిపిస్తోంది. అద్దె విధానం పక్కన పెట్టి…
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…