ప్రపంచ జనాభా 2024 చివరికి ఊహించని మార్క్ ను చేరనున్నట్లు తెలుస్తోంది. దాదాపు 800 కోట్లను దాటబోతుందని యుఎస్ సెన్సస్ బ్యూరో అంచనా వేసింది. ఈ ఏడాది మొత్తం ప్రపంచ జనాభాలో 7.1 కోట్లు పెరుగుదల నమోదు కాగా, ప్రస్తుతం మొత్తం జనాభా 8,092,034,511గా ఉందని బ్యూరో వెల్లడించింది. ఇది 0.9 శాతం పెరుగుదలగా ఉన్నప్పటికీ, గత సంవత్సరం నమోదైన 7.5 కోట్ల పెరుగుదలతో పోలిస్తే స్వల్పంగా తగ్గుదల కనిపించిందని వెల్లడించింది. జనాభా పెరుగుదల ప్రధానంగా పలు దేశాలలో జననాల సంఖ్య మృతుల సంఖ్యను మించి ఉండడం వల్లనే జరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అంతేకాక, 2025లో ప్రపంచ జనాభా మరింత పెరుగుతుందని అంచనా వేసింది. అప్పుడు ప్రతి సెకనుకు 4.2 జననాలు, 2 మరణాలు నమోదు కానున్నాయి. ప్రపంచంలో జనన రేటు మామూలుగా ఉన్నా, కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో జననాల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో, జనాభా పెరుగుదల పాక్షికంగా వలసల కారణంగా జరుగుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
అమెరికాలో ఈ ఏడాది జనాభా 26 లక్షలతో పెరిగి 34.1 కోట్లకు చేరిందని సెన్సస్ బ్యూరో పేర్కొంది. 0.78 శాతం పెరుగుదల నమోదైన ఈ సంఖ్య, ముఖ్యంగా అంతర్జాతీయ వలసల ద్వారా అధికమవుతోంది. 2025 నాటికి అమెరికాలో ప్రతి 9 సెకన్లకు ఒక జననం, 9.4 సెకన్లకు ఒక మరణం నమోదు కావచ్చని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ వలసలు ప్రతి 23.2 సెకన్లకు ఒక వ్యక్తిని అమెరికా జనాభాలో చేరుస్తాయని వివరించారు.
ఈ అంచనాలు ప్రపంచ స్థాయిలో శ్రామిక వనరులు, వనరుల వినియోగం, జీవన ప్రమాణాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ జనాభా పెరుగుదల కొనసాగుతున్నప్పటికీ, వనరుల సక్రమ వినియోగం, జీవన ప్రమాణాలను మెరుగుపర్చడంలో అన్ని దేశాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
This post was last modified on December 31, 2024 3:54 pm
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన చెన్నై లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో…