మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో, భారత యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి తన అద్భుత ప్రతిభతో దేశాన్ని గర్వపడేలా చేశాడు. 8వ స్థానంలో బ్యాటింగ్కి దిగి తన కెరీర్లో తొలి సెంచరీని సాధించిన నితీశ్, భారత్ను ఫాలో-ఆన్ ముప్పు నుంచి కాపాడాడు. మొత్తం 171 బంతుల్లో 105 పరుగులు చేసిన ఈ యువ ఆటగాడు, తన పట్టుదలతో జట్టును నిలబెట్టాడు. నితీశ్ చూపించిన ఆటతీరుకు క్రీడా ప్రపంచం నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది.
సెంచరీ అనంతరం నితీశ్ చేసిన సెలబ్రేషన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ‘‘పుష్ప’’ స్టైల్లో హాఫ్ సెంచరీను సెలబ్రేట్ చేసిన నితీశ్, ‘‘బాహుబలి’’ స్టైల్తో సెంచరీకి మరింత ప్రత్యేకత చేకూర్చాడు. ‘‘సెంచరీ తర్వాత నా బ్యాట్ను నేలపై నిలబెట్టి, హెల్మెట్ను దానిపై ఉంచాను. హెల్మెట్పై మన జాతీయ జెండా ఉంది. అది నా దేశానికి వందనం చేసినట్లుగా ఉంటుంది,’’ అని నితీశ్ అభివ్యక్తి చెందాడు. దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడమే తనకు అత్యంత ప్రేరణగా నిలిచిందని, ఈ ఇన్నింగ్స్ తన జీవితంలో చిరస్మరణీయంగా నిలుస్తుందని చెప్పాడు.
నితీశ్ శతకానికి చివరిలో కీలకమైన సహకారం అందించిన మహ్మద్ సిరాజ్ ప్రదర్శనకూ అందరూ మెచ్చుకున్నారు. నితీశ్ 99 పరుగుల వద్ద ఉండగా, వరుసగా రెండు వికెట్లు పడిపోవడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో సిరాజ్ చాలా జాగ్రత్తగా మూడు బంతులను డిఫెన్స్ ఆడి నితీశ్కు స్ట్రైక్ ఇచ్చాడు. తర్వాత బౌలర్ బోలాండ్ వేసిన బంతిని నితీశ్ చక్కగా ఫోర్ బాది సెంచరీని సాధించాడు. ఇది చూసిన క్రీడా ప్రియులు, క్రీడా నిపుణులు సిరాజ్పై ప్రశంసలు కురిపించారు.
మరోవైపు నితీశ్ తన తండ్రి ముత్యాలరెడ్డి అభిమానంతో స్టేడియంలో ప్రత్యక్షంగా తన ఆటను వీక్షించడం తనకు ప్రత్యేకమైన అనుభూతిగా అభివర్ణించాడు. ‘‘నాన్న ఆనందంతో కన్నీళ్లు పెట్టుకోవడం చూసి నా గుండె ఉప్పొంగింది. ఆయన గర్వపడేలా చేయడం నా జీవిత లక్ష్యం,’’ అని నితీశ్ చెప్పాడు.
This post was last modified on December 29, 2024 1:21 pm
‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…