Trends

ఏఐ టెక్నాలజీతో గంటలో స్వామి వారి దర్శనం!

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు రోజు వేలాది మంది భక్తులు తిరుపతికి వస్తుంటారు‌. అయితే, రద్దీ కారణంగా సామాన్య భక్తులు గంటలు తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. క్యూలైన్లో ఉన్న భక్తులకు పాలు, నీళ్లు, ఆహారం వంటి సౌకర్యాలను టీటీడీ అందిస్తున్నప్పటికీ కొన్నిసార్లు చాలా గంటలపాటు క్యూలో నిలబడటం భక్తులకు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇకపై గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండకుండా గంటలోపే శ్రీవారి దర్శనం అయ్యే విధంగా టిటిడి సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో గంటలోపు భక్తులకు శ్రీవారి దర్శనం పూర్తి చేసేలాగా పైలట్ ప్రాజెక్టును ఈరోజు నుంచి ప్రారంభించింది. ఈ విషయాన్ని టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. వారం రోజుల పాటు ప్రయోగాత్మకంగా ఏఐ టెక్నాలజీని ఉపయోగించి భక్తులను గుర్తించే పద్ధతికి సిద్ధమయ్యామని బి ఆర్ నాయుడు చెప్పారు. పైలట్ ప్రాజెక్టు విజయవంతం అయితే ఈ నెల 24న జరగబోయే పాలకమండలి సమావేశంలో ఈ విధానానికి స్థాయిలో ఆమోదం లభించనుందని అన్నారు.

ముందుగా భక్తుల ఆధార్‌ కార్డు నంబర్‌, ఫేస్‌ రికగ్నేషన్‌ రసీదు, దర్శన సమయాన్ని సూచిస్తూ ఒక టోకెన్‌ ఇస్తామని అన్నారు. ఆ టోకెన్‌ లో సూచించిన సమయానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ వద్దకు భక్తులు చేరుకోగానే ఫేస్‌ రికగ్నిషన్‌ ఎంట్రన్స్‌లో స్కానింగ్‌ జరుగుతుందని, ఆ తర్వాత క్యూ లైన్‌లోకి పంపుతారని చెప్పారు. సిబ్బందితో పని లేకుండా ఏఐ టెక్నాలజీ ద్వారా ఈ విధానం అమలు చేయాలని అనుకుంటున్నామని, ఏఐ సాఫ్ట్ వేర్ అందించేందుకు నాలుగు విదేశీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని తెలిపారు.

This post was last modified on December 20, 2024 6:29 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

28 minutes ago

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

3 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

4 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

5 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

5 hours ago

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

6 hours ago