Trends

ఏఐ టెక్నాలజీతో గంటలో స్వామి వారి దర్శనం!

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు రోజు వేలాది మంది భక్తులు తిరుపతికి వస్తుంటారు‌. అయితే, రద్దీ కారణంగా సామాన్య భక్తులు గంటలు తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. క్యూలైన్లో ఉన్న భక్తులకు పాలు, నీళ్లు, ఆహారం వంటి సౌకర్యాలను టీటీడీ అందిస్తున్నప్పటికీ కొన్నిసార్లు చాలా గంటలపాటు క్యూలో నిలబడటం భక్తులకు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇకపై గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండకుండా గంటలోపే శ్రీవారి దర్శనం అయ్యే విధంగా టిటిడి సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో గంటలోపు భక్తులకు శ్రీవారి దర్శనం పూర్తి చేసేలాగా పైలట్ ప్రాజెక్టును ఈరోజు నుంచి ప్రారంభించింది. ఈ విషయాన్ని టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. వారం రోజుల పాటు ప్రయోగాత్మకంగా ఏఐ టెక్నాలజీని ఉపయోగించి భక్తులను గుర్తించే పద్ధతికి సిద్ధమయ్యామని బి ఆర్ నాయుడు చెప్పారు. పైలట్ ప్రాజెక్టు విజయవంతం అయితే ఈ నెల 24న జరగబోయే పాలకమండలి సమావేశంలో ఈ విధానానికి స్థాయిలో ఆమోదం లభించనుందని అన్నారు.

ముందుగా భక్తుల ఆధార్‌ కార్డు నంబర్‌, ఫేస్‌ రికగ్నేషన్‌ రసీదు, దర్శన సమయాన్ని సూచిస్తూ ఒక టోకెన్‌ ఇస్తామని అన్నారు. ఆ టోకెన్‌ లో సూచించిన సమయానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ వద్దకు భక్తులు చేరుకోగానే ఫేస్‌ రికగ్నిషన్‌ ఎంట్రన్స్‌లో స్కానింగ్‌ జరుగుతుందని, ఆ తర్వాత క్యూ లైన్‌లోకి పంపుతారని చెప్పారు. సిబ్బందితో పని లేకుండా ఏఐ టెక్నాలజీ ద్వారా ఈ విధానం అమలు చేయాలని అనుకుంటున్నామని, ఏఐ సాఫ్ట్ వేర్ అందించేందుకు నాలుగు విదేశీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని తెలిపారు.

This post was last modified on December 20, 2024 6:29 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

మధుర గాయని ఇక లేరు

భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…

54 minutes ago

సర్దార్ 2 ఎందుకు రావడం లేదు

తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…

3 hours ago

అఖిల్ అభిమానులు ఈసారి ఒప్పుకోరు

షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…

4 hours ago

చెప్పుతెగుద్ది… సీత‌క్క బ్లాస్ట్‌!

తెలంగాణలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉన్న నాయ‌కురాలు.. గిరిజ‌న నేత సీత‌క్క‌(అన‌సూయ‌) ఒక్క‌సారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని…

4 hours ago

మహిళల వీడియోలతో చెలగాటం… ఏఎస్సై సస్పెండ్

పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల…

4 hours ago

నియోజకవర్గాల పెంపు: ఒరిగేదేంటి.. జరిగేదేంటి?

దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు వీటికి…

10 hours ago