కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు రోజు వేలాది మంది భక్తులు తిరుపతికి వస్తుంటారు. అయితే, రద్దీ కారణంగా సామాన్య భక్తులు గంటలు తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. క్యూలైన్లో ఉన్న భక్తులకు పాలు, నీళ్లు, ఆహారం వంటి సౌకర్యాలను టీటీడీ అందిస్తున్నప్పటికీ కొన్నిసార్లు చాలా గంటలపాటు క్యూలో నిలబడటం భక్తులకు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇకపై గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండకుండా గంటలోపే శ్రీవారి దర్శనం అయ్యే విధంగా టిటిడి సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో గంటలోపు భక్తులకు శ్రీవారి దర్శనం పూర్తి చేసేలాగా పైలట్ ప్రాజెక్టును ఈరోజు నుంచి ప్రారంభించింది. ఈ విషయాన్ని టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. వారం రోజుల పాటు ప్రయోగాత్మకంగా ఏఐ టెక్నాలజీని ఉపయోగించి భక్తులను గుర్తించే పద్ధతికి సిద్ధమయ్యామని బి ఆర్ నాయుడు చెప్పారు. పైలట్ ప్రాజెక్టు విజయవంతం అయితే ఈ నెల 24న జరగబోయే పాలకమండలి సమావేశంలో ఈ విధానానికి స్థాయిలో ఆమోదం లభించనుందని అన్నారు.
ముందుగా భక్తుల ఆధార్ కార్డు నంబర్, ఫేస్ రికగ్నేషన్ రసీదు, దర్శన సమయాన్ని సూచిస్తూ ఒక టోకెన్ ఇస్తామని అన్నారు. ఆ టోకెన్ లో సూచించిన సమయానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు భక్తులు చేరుకోగానే ఫేస్ రికగ్నిషన్ ఎంట్రన్స్లో స్కానింగ్ జరుగుతుందని, ఆ తర్వాత క్యూ లైన్లోకి పంపుతారని చెప్పారు. సిబ్బందితో పని లేకుండా ఏఐ టెక్నాలజీ ద్వారా ఈ విధానం అమలు చేయాలని అనుకుంటున్నామని, ఏఐ సాఫ్ట్ వేర్ అందించేందుకు నాలుగు విదేశీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని తెలిపారు.
This post was last modified on December 20, 2024 6:29 pm
‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…