కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు రోజు వేలాది మంది భక్తులు తిరుపతికి వస్తుంటారు. అయితే, రద్దీ కారణంగా సామాన్య భక్తులు గంటలు తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. క్యూలైన్లో ఉన్న భక్తులకు పాలు, నీళ్లు, ఆహారం వంటి సౌకర్యాలను టీటీడీ అందిస్తున్నప్పటికీ కొన్నిసార్లు చాలా గంటలపాటు క్యూలో నిలబడటం భక్తులకు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇకపై గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండకుండా గంటలోపే శ్రీవారి దర్శనం అయ్యే విధంగా టిటిడి సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో గంటలోపు భక్తులకు శ్రీవారి దర్శనం పూర్తి చేసేలాగా పైలట్ ప్రాజెక్టును ఈరోజు నుంచి ప్రారంభించింది. ఈ విషయాన్ని టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. వారం రోజుల పాటు ప్రయోగాత్మకంగా ఏఐ టెక్నాలజీని ఉపయోగించి భక్తులను గుర్తించే పద్ధతికి సిద్ధమయ్యామని బి ఆర్ నాయుడు చెప్పారు. పైలట్ ప్రాజెక్టు విజయవంతం అయితే ఈ నెల 24న జరగబోయే పాలకమండలి సమావేశంలో ఈ విధానానికి స్థాయిలో ఆమోదం లభించనుందని అన్నారు.
ముందుగా భక్తుల ఆధార్ కార్డు నంబర్, ఫేస్ రికగ్నేషన్ రసీదు, దర్శన సమయాన్ని సూచిస్తూ ఒక టోకెన్ ఇస్తామని అన్నారు. ఆ టోకెన్ లో సూచించిన సమయానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు భక్తులు చేరుకోగానే ఫేస్ రికగ్నిషన్ ఎంట్రన్స్లో స్కానింగ్ జరుగుతుందని, ఆ తర్వాత క్యూ లైన్లోకి పంపుతారని చెప్పారు. సిబ్బందితో పని లేకుండా ఏఐ టెక్నాలజీ ద్వారా ఈ విధానం అమలు చేయాలని అనుకుంటున్నామని, ఏఐ సాఫ్ట్ వేర్ అందించేందుకు నాలుగు విదేశీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని తెలిపారు.
This post was last modified on December 20, 2024 6:29 pm
మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలన్నది ఇండస్ట్రీలోకి అడుగు పెట్టే ప్రతి కొత్త దర్శకుడికీ ఓ కల. ఒక తరాన్ని ఊపు…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు విజనరీ నేతే. ఈ విషయాన్ని వైరి వర్గాలు ఎంత విమర్శించినా.. ఆ…
ఒకప్పుడు అపరిచితుడు టైంలో విక్రమ్ సినిమాల ఓపెనింగ్స్ కి ట్రేడ్ మతులు పోయేవి. తర్వాత వచ్చే వాటికి డిమాండ్ పెరిగి…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. 2.0పై కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. జగన్ 2.0 చాలా భి…
వైసీపీ తరఫున గత ప్రభుత్వంలో ఉండి.. పార్టీని, అప్పటి సీఎం జగన్ను కూడా హైలెట్ చేసిన వారు.. అదేసమయంలో అప్పటి…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి క్రీడా రంగంలో ఓ చరిత్రాత్మక మైలురాయిని చేరుకోనుంది. దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా వెలుగొందబోతున్న ఈ…