మంచు మోహన్బాబు కుటుంబంలో తలెత్తిన ఆస్తుల వివాదం.. తీవ్ర దుమారానికి దారితీసింది. ఏకంగా మీడియాపైనే మోహన్ బాబు దాడి చేయడంతోపాటు బౌన్సర్లను ఉసిగొల్పారు. దీంతో మీడియా ప్రతినిధులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తలో దిక్కూ పరుగులు పెట్టారు. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీంతో అసలు ఏం జరిగింది? మీడియాపై ఎందుకు దాడి చేశారనే చర్చ జోరుగా సాగుతోంది.
గత రెండు రోజులుగా మోహన్ బాబు ఆస్తులకు సంబంధించి చిన్న కొడుకు మనోజ్తో ఆయన ఘర్షణ పడుతున్నారన్న విష యం తెలిసిందే. అయితే.. మనోజ్.. మంగళవారం సాయంత్రం తన భార్యతో కలిసి.. ఐజీని కలిసివచ్చారు. అప్పటికిరాత్రి 8 గంటల సమయం అవుతుంది. ఈ సమయంలో మీడియాను కూడా ఆయన వెంట తీసుకువెళ్లడం గమనార్హం. జల్పల్లిలోని నివాసానికి చేరుకున్న మీడియా గేటు దగ్గరే ఉంది. అయితే.. లోపలికి భార్యతో కూడా వెళ్లిన మనోజ్.. కొద్ది సేపటికే బయటకు వచ్చారు. ఈ క్రమంలో ఆయన దుస్తులు చిరిగి కనిపించాయి.
ఈ పరిణామాలపై మీడియా లైవ్ కవరేజీ ఇచ్చింది. మోహన్బాబు, ఆయన పెద్ద కొడుకు విష్ణు సహా మరికొందరు మనోజ్పై దాడి చేశారంటూ. ప్రచారం జరిగింది. ఆ వెంటనే బయటకు దూసుకు వచ్చిన మోహన్బాబు.. తన ఇంటి ఆవరణలోకి ప్రవేశించిన మీడియా ప్రతినిధులను తిడుతూ.. దూసుకువచ్చారు. ఓ మీడియా మైకును బలంగా గుంజుకుని దాంతోనే ఆయన కొట్టేందుకు ప్రయత్నించారు. ఇంతలో జోక్యం చేసుకున్న బౌన్సర్లు.. మీడియా ప్రతినిధులపై విరుచుకుపడ్డారు. ఈ ఘర్షణలో ఓ మీడియా ప్రతినిధి కింద పడిపోయారు. ఆయనపైనుంచే ఒకరిద్దరు తొక్కుకుంటూ వెళ్లడం వీడియోలో స్పష్టంగా కనిపించింది.
అనంతరం.. బౌన్సర్లు.. దూకుడుగా వ్యవహరించడంతో మీడియా ప్రతినిధులు ప్రాణ భయంతో పరుగులు పెట్టారు. తర్వాత గేటును మూసేశారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న పోలీసులు కూడా.. నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోవడం.. కనిపించింది. అనంతరం..మోహన్బాబు వద్ద లైసెన్స్డ్ తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పరిణామాలపై స్పందించిన మోహన్బాబు.. తన చిన్న కొడుకే తన గుండెలపై తన్నాడని.. భార్య చెప్పుడు మాటలు వింటున్నాడని ఆరోపించడం గమనార్హం. ఇదిలావుంటే.. మోహన్బాబు తమపై దాడి చేశారంటూ.. మీడియా ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
This post was last modified on December 11, 2024 9:43 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…