ఈ హైటెక్ జమానాలో దొంగలు కూడా ట్రెండ్ మార్చారు. రాజనాల టైంలో ఇళ్లలో దొంగతనం చేసి నగదు, నగలు దొంగతనం చేసే దొంగలు..రాజమౌళి టైంకి అప్డేట్ అయి ఏకంగా ఆర్టీసీ బస్సులు దొంగతనం చేసే రేంజ్ కు ఎదిగారు. ఇక, తాజాగా తెలంగాణలో ఓ రాజరాజచోరుడైతే ఏకంగా అంబులెన్స్ నే దొంగిలించి దొంగలకే దొంగ అనిపించాడు. సినీ ఫక్కీలో ఎట్టకేలకు ఆ దొంగను పోలీసులు ఛేజ్ చేసి పట్టుకున్న వైనం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హైదరాబాద్ లోని హయత్ నగర్ లో ఉండే వెంకట నర్సయ్య చిన్ని చిన్న దొంగతనాలు చేస్తుండేవాడు. చాలాసార్లు పోలీసులకు చిక్కినా..అతడి బుద్ధి మారలేదు. ఈ క్రమంలోనే సన్రైజ్ హాస్పిటల్ దగ్గర ఆగి ఉన్న 108 అంబులెన్స్ను కొట్టేశాడు. ఆ తర్వాత ఎన్ హెచ్-65పై సైరన్ మోగిస్తూ దూసుకెళ్లాడు. అది గమనించి అంబులెన్స్ సిబ్బంది హయత్నగర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హైవే పోలీసులు రంగంలోకి దిగారు. చిట్యాల వద్ద పోలీసులు అంబులెన్స్ ను ఆపేందుకు ప్రయత్నించినా ఆపకపోవడంతో వాచు ఛేజ్ చేశారు. ఆ క్రమంలోనే ఏఎస్ఐని వెంకట నర్సయ్య ఢీకొట్టి వెళ్లిపోగా ఏఎస్ఐ కాలు, ముఖానికి తీవ్రగాయాలై చికిత్స పొందుతున్నారు.
ఆ తర్వాత కొర్లపహాడ్ టోల్ప్లాజా బారికేడ్లను, టోల్ప్లాజా గేట్ను ఢీకొట్టి సూర్యాపేట వైపు వెళ్లాడు. ఆ తర్వాత టేకుమట్ల బ్రిడ్జి వద్ద లారీలను అడ్డుపెట్టి విజయవాడ వైపు వెళ్లే దారిని పోలీసులు మూసేశారు. దీంతో, అంబులెన్స్ను రోడ్డు కిందికి దింపాడు. అక్కడే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
This post was last modified on December 8, 2024 6:01 pm
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…
ఇండస్ట్రీలో వరుసగా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవకాశాలు దక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ కొందరు డైరెక్టర్లు మాత్రం తమ…
ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…
ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…