Trends

అంబులెన్స్ దొంగ…100 కి.మీ ఛేజ్!

ఈ హైటెక్ జమానాలో దొంగలు కూడా ట్రెండ్ మార్చారు. రాజనాల టైంలో ఇళ్లలో దొంగతనం చేసి నగదు, నగలు దొంగతనం చేసే దొంగలు..రాజమౌళి టైంకి అప్డేట్ అయి ఏకంగా ఆర్టీసీ బస్సులు దొంగతనం చేసే రేంజ్ కు ఎదిగారు. ఇక, తాజాగా తెలంగాణలో ఓ రాజరాజచోరుడైతే ఏకంగా అంబులెన్స్ నే దొంగిలించి దొంగలకే దొంగ అనిపించాడు. సినీ ఫక్కీలో ఎట్టకేలకు ఆ దొంగను పోలీసులు ఛేజ్ చేసి పట్టుకున్న వైనం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హైదరాబాద్ లోని హయత్ నగర్ లో ఉండే వెంకట నర్సయ్య చిన్ని చిన్న దొంగతనాలు చేస్తుండేవాడు. చాలాసార్లు పోలీసులకు చిక్కినా..అతడి బుద్ధి మారలేదు. ఈ క్రమంలోనే సన్‌రైజ్‌ హాస్పిటల్ దగ్గర ఆగి ఉన్న 108 అంబులెన్స్‌ను కొట్టేశాడు. ఆ తర్వాత ఎన్ హెచ్-65పై సైరన్‌ మోగిస్తూ దూసుకెళ్లాడు. అది గమనించి అంబులెన్స్‌ సిబ్బంది హయత్‌నగర్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హైవే పోలీసులు రంగంలోకి దిగారు. చిట్యాల వద్ద పోలీసులు అంబులెన్స్ ను ఆపేందుకు ప్రయత్నించినా ఆపకపోవడంతో వాచు ఛేజ్ చేశారు. ఆ క్రమంలోనే ఏఎస్‌ఐని వెంకట నర్సయ్య ఢీకొట్టి వెళ్లిపోగా ఏఎస్‌ఐ కాలు, ముఖానికి తీవ్రగాయాలై చికిత్స పొందుతున్నారు.

ఆ తర్వాత కొర్లపహాడ్‌ టోల్‌ప్లాజా బారికేడ్లను, టోల్‌ప్లాజా గేట్‌ను ఢీకొట్టి సూర్యాపేట వైపు వెళ్లాడు. ఆ తర్వాత టేకుమట్ల బ్రిడ్జి వద్ద లారీలను అడ్డుపెట్టి విజయవాడ వైపు వెళ్లే దారిని పోలీసులు మూసేశారు. దీంతో, అంబులెన్స్‌ను రోడ్డు కిందికి దింపాడు. అక్కడే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

This post was last modified on December 8, 2024 6:01 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

న‌గ‌రిలో రోజా VS భాను… ఇదో స‌రికొత్త వార్‌…

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం నగ‌రిలో ఏం జ‌రుగుతోంది? నాయ‌కులు ఏం చేస్తున్నారు? అంటే.. అంతా ప్ర‌స్తుతం సైలెంట్‌గానే…

41 minutes ago

ఆయ‌నో మ‌ర్రి చెట్టు: టీడీపీ కామెంట్‌.. !

కొంద‌రు నాయ‌కులు తాము ఎదుగుతూ.. తోటి వారిని ఎదిగేలా స‌హ‌క‌రిస్తారు. ఇది ఎక్క‌డైనా ఉంటుంది. అయితే.. కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో…

8 hours ago

ఒకేసారి 2 స‌మ‌స్య‌లు.. చంద్ర‌బాబు సీరియ‌స్ డెసిష‌న్‌!

ఏపీలో ఒకేసారి రెండు కీల‌క స‌మ‌స్య‌లు రాష్ట్రంలో అల‌జ‌డి రేపుతున్నాయి. ఈ రెండు కూడా సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు సంబంధించిన వ్య‌వ‌హారాలు…

8 hours ago

భారత్ భారీ విజయం.. కానీ…

టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో టీమిండియా ఎట్టకేలకు ఊపిరి పీల్చుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో జింబాబ్వేపై 72 పరుగుల…

9 hours ago

కుంభకోణంలో ఈ అవినాష్ రెడ్డి ఎవరు?

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం అక్ర‌మాల‌కు సంబంధించి ఈ కేసును విచారిస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) అధికారులు తాజాగా మ‌రో…

10 hours ago

‘నీటి’ రాజకీయాలకు చంద్రబాబు నో!!

రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న నీటి స‌మ‌స్య‌ను రాజకీయం చేయ‌ద‌ల్చుకోలేద‌ని సీఎం చంద్రబాబు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు…

12 hours ago