Trends

అంబులెన్స్ దొంగ…100 కి.మీ ఛేజ్!

ఈ హైటెక్ జమానాలో దొంగలు కూడా ట్రెండ్ మార్చారు. రాజనాల టైంలో ఇళ్లలో దొంగతనం చేసి నగదు, నగలు దొంగతనం చేసే దొంగలు..రాజమౌళి టైంకి అప్డేట్ అయి ఏకంగా ఆర్టీసీ బస్సులు దొంగతనం చేసే రేంజ్ కు ఎదిగారు. ఇక, తాజాగా తెలంగాణలో ఓ రాజరాజచోరుడైతే ఏకంగా అంబులెన్స్ నే దొంగిలించి దొంగలకే దొంగ అనిపించాడు. సినీ ఫక్కీలో ఎట్టకేలకు ఆ దొంగను పోలీసులు ఛేజ్ చేసి పట్టుకున్న వైనం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హైదరాబాద్ లోని హయత్ నగర్ లో ఉండే వెంకట నర్సయ్య చిన్ని చిన్న దొంగతనాలు చేస్తుండేవాడు. చాలాసార్లు పోలీసులకు చిక్కినా..అతడి బుద్ధి మారలేదు. ఈ క్రమంలోనే సన్‌రైజ్‌ హాస్పిటల్ దగ్గర ఆగి ఉన్న 108 అంబులెన్స్‌ను కొట్టేశాడు. ఆ తర్వాత ఎన్ హెచ్-65పై సైరన్‌ మోగిస్తూ దూసుకెళ్లాడు. అది గమనించి అంబులెన్స్‌ సిబ్బంది హయత్‌నగర్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హైవే పోలీసులు రంగంలోకి దిగారు. చిట్యాల వద్ద పోలీసులు అంబులెన్స్ ను ఆపేందుకు ప్రయత్నించినా ఆపకపోవడంతో వాచు ఛేజ్ చేశారు. ఆ క్రమంలోనే ఏఎస్‌ఐని వెంకట నర్సయ్య ఢీకొట్టి వెళ్లిపోగా ఏఎస్‌ఐ కాలు, ముఖానికి తీవ్రగాయాలై చికిత్స పొందుతున్నారు.

ఆ తర్వాత కొర్లపహాడ్‌ టోల్‌ప్లాజా బారికేడ్లను, టోల్‌ప్లాజా గేట్‌ను ఢీకొట్టి సూర్యాపేట వైపు వెళ్లాడు. ఆ తర్వాత టేకుమట్ల బ్రిడ్జి వద్ద లారీలను అడ్డుపెట్టి విజయవాడ వైపు వెళ్లే దారిని పోలీసులు మూసేశారు. దీంతో, అంబులెన్స్‌ను రోడ్డు కిందికి దింపాడు. అక్కడే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Kumar

Recent Posts

ఇదేం లాజిక్ ఎంపీ గారూ?

విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. సాయికృష్ణది లాకప్…

18 minutes ago

ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు!… కొత్త చరిత్రే!

దక్షిణ భారత దేశంలో గురువారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి కనిపించారు. అంతేకాదండోయ్…తాము…

27 minutes ago

OG యూనివర్స్ ఏం చూపించబోతోంది

ఎన్నడూ లేనిది పవన్ కళ్యాణ్ ఓజి 2 విషయంలో దూకుడు చూపిస్తున్నారు. సురేందర్ రెడ్డికి కమిటైన ప్రాజెక్టు పక్కనపెట్టి మరీ…

44 minutes ago

గ్రేట్ డైరెక్టర్… సిల్లీ లాజిక్

గొప్ప గొప్ప దర్శకులు కూడా తమ సినిమాలు ఆశించినంత ఆడకపోతే.. వాటి ఫలితాల విషయంలో చిత్రమైన కారణాలు చెబుతుంటారు. స్క్రిప్టు…

2 hours ago

సుప్రీం చెప్పింది… మోడీ క‌దిలారు: దేశ‌వ్యాప్తంగా దాడులు!

సుప్రీంకోర్టు హెచ్చ‌రిక‌లు, దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల నుంచి అందుతున్న వేలాది ఫిర్యాదుల‌తో కేంద్ర ప్ర‌భుత్వం క‌దిలింది. దేశంలో ఏదో ఒక రూపంలో…

2 hours ago

భూకంపంతో వణికిన వెనిజులా… మృతులు లక్షమంది!

వెనిజులాను వరుస భూకంపాలు వణికించాయి. దేశ రాజధాని కరాకస్‌తో పాటు ఉత్తర-మధ్య ప్రాంతాల్లో బుధవారం శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. తొలుత…

3 hours ago