Trends

అంబులెన్స్ దొంగ…100 కి.మీ ఛేజ్!

ఈ హైటెక్ జమానాలో దొంగలు కూడా ట్రెండ్ మార్చారు. రాజనాల టైంలో ఇళ్లలో దొంగతనం చేసి నగదు, నగలు దొంగతనం చేసే దొంగలు..రాజమౌళి టైంకి అప్డేట్ అయి ఏకంగా ఆర్టీసీ బస్సులు దొంగతనం చేసే రేంజ్ కు ఎదిగారు. ఇక, తాజాగా తెలంగాణలో ఓ రాజరాజచోరుడైతే ఏకంగా అంబులెన్స్ నే దొంగిలించి దొంగలకే దొంగ అనిపించాడు. సినీ ఫక్కీలో ఎట్టకేలకు ఆ దొంగను పోలీసులు ఛేజ్ చేసి పట్టుకున్న వైనం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హైదరాబాద్ లోని హయత్ నగర్ లో ఉండే వెంకట నర్సయ్య చిన్ని చిన్న దొంగతనాలు చేస్తుండేవాడు. చాలాసార్లు పోలీసులకు చిక్కినా..అతడి బుద్ధి మారలేదు. ఈ క్రమంలోనే సన్‌రైజ్‌ హాస్పిటల్ దగ్గర ఆగి ఉన్న 108 అంబులెన్స్‌ను కొట్టేశాడు. ఆ తర్వాత ఎన్ హెచ్-65పై సైరన్‌ మోగిస్తూ దూసుకెళ్లాడు. అది గమనించి అంబులెన్స్‌ సిబ్బంది హయత్‌నగర్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హైవే పోలీసులు రంగంలోకి దిగారు. చిట్యాల వద్ద పోలీసులు అంబులెన్స్ ను ఆపేందుకు ప్రయత్నించినా ఆపకపోవడంతో వాచు ఛేజ్ చేశారు. ఆ క్రమంలోనే ఏఎస్‌ఐని వెంకట నర్సయ్య ఢీకొట్టి వెళ్లిపోగా ఏఎస్‌ఐ కాలు, ముఖానికి తీవ్రగాయాలై చికిత్స పొందుతున్నారు.

ఆ తర్వాత కొర్లపహాడ్‌ టోల్‌ప్లాజా బారికేడ్లను, టోల్‌ప్లాజా గేట్‌ను ఢీకొట్టి సూర్యాపేట వైపు వెళ్లాడు. ఆ తర్వాత టేకుమట్ల బ్రిడ్జి వద్ద లారీలను అడ్డుపెట్టి విజయవాడ వైపు వెళ్లే దారిని పోలీసులు మూసేశారు. దీంతో, అంబులెన్స్‌ను రోడ్డు కిందికి దింపాడు. అక్కడే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Kumar

Recent Posts

దూత మీద నమ్మకం నిర్మాతను చేసింది

హీరోలు నిర్మాతలు కావడం కొత్తేమి కాదు. చిరంజీవి పీక్స్ లో ఉన్నప్పుడే అంజనా ప్రొడక్షన్స్ స్థాపించారు. కార్డు నాగబాబు పేరు…

3 minutes ago

1500 కోట్ల స్కాం… వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు

వినుకొండ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడుపై భూకబ్జా ఆరోపణలు వచ్చిన వైనం ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం…

58 minutes ago

జ‌గ‌న్‌పై ఈడీ క‌న్ను… విచార‌ణేనా? అరెస్టా?!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఇప్ప‌టికే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఉంది. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్న స‌మ‌యంలో…

2 hours ago

అన్నామలై బీజేపీని ఎందుకు వీడినట్టు?

అనుకున్నంతా అయ్యింది. గత కొంతకాలంగా బీజేపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న ఆ పార్టీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు అన్నామలై తాజాగా ఆ…

2 hours ago

కొత్త నిప్పు రాజేసిన వీరభద్రుడు

ఎవరో జ్వాలలు రగిలించారు వేరెవరో దానికి బలి అయ్యారు అనే పాట ఊరికే పుట్టలేదు. గత నెల విడుదలై తమిళంలో…

3 hours ago

పార్ల‌మెంటు వారీగా జ‌న‌సేన వ్యూహం!

రాష్ట్రంలో ఎద‌గాల‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పుంజుకోవాల‌ని భావిస్తున్న జ‌న‌సేన ఏపీలో పెద్ద వ్యూహాన్నే అనుస‌రిస్తోంది. పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా…

3 hours ago