Trends

దేశంలో బిలియనీర్ల మొత్తం ఆస్తి విలువ ఎంతో తెలుసా?

దేశంలో బిలియనీర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఈ సంఖ్య 185కు చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి వాతావరణం.. యుద్ధ భయాలు.. ఆర్థిక పరిస్థితులపై అయోమయ పరిస్థితులు నెలకొన్న వేళ.. వీటితో సంబంధం లేనట్లుగా సంపన్నుల సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది. గడిచిన పదేళ్లలో వీరి సంపన్నుల సంపద ఏకంగా 121 శాతం పెరిగినట్లుగా స్విట్జర్లాండ్ కు చెందిన అతి పెద్ద బ్యాంక్యూబీసీ వెల్లడించింది. బిలియనీర్ల సంపదపై వార్షిక నివేదికను తాజాగా విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆసక్తికర అంశాల్ని వెల్లడించింది.

భారతదేశంలో బిలియనీర్ల సంఖ్య 185కు పెరిగిందని.. వీరి సంపద మొత్తం విలువ మన రూపాయిల్లో రూ.76 లక్షల కోట్లకు పైనే ఉన్నట్లు చెప్పింది. 2015లో ప్రపంచ వ్యాప్తంగా 1757 మంది కుబేరులు ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 2682కు పెరిగిందని.. 2022లో అత్యధికంగా 2686గా ఉన్నట్లు వెల్లడించింది. ఈ పదేళ్లలో కుబేరుల సంపద మొత్తం విలువ 6.3 ట్రిలియన్ డాలర్ల నుంచి 14 ట్రిలియన్ డాలర్లకు పెరిగినట్లుగా పేర్కొంది.

టెక్ బిలియనీర్ల సంపద శరవేగంగా పెరిగిందని.. 2015లో వీరి సంపద 788.9 బిలియన్ డాలర్లు కాగా.. ఈ ఏడాది 2.4 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని.. ఈ జాబితాలో పారిశ్రామికవేత్తలు ఉన్నట్లు తెలిపింది. 2015-20 మధ్య చైనా బిలియనీర్ల సంపద 887.3 బిలియన్ డాలర్ల నుంచి 2.1 ట్రిలియన్ డాలర్లకు పెరిగిందని.. ఆ తర్వాత నుంచి వీరి ఆస్తి తగ్గుతున్నట్లుగా పేర్కొంది. ప్రస్తుతం వీరి సంపద విలువ 1.8 ట్రిలియన్ డాలర్లు కావటం గమనార్హం.

ఈ ఏడాది కొత్తగా 268 మంది బిలియనీర్లు లిస్టులో చేరారని.. వీరిలో 60 శాతం మంది వ్యాపార వ్యవస్థాపకులేనని చెప్పింది. అమెరికా కుబేరుల సంపద విలువ 27.6 శాతం పెరిగి 5.8 ట్రిలియన్ డాలర్లుగా లెక్క కట్టింది. 2024లో చైనా, హాంకాంగ్ లో బిలియనీర్ల సంఖ్య 588 నుంచి 501కు తగ్గటం గమనార్హం. భారత్ లో మాత్రం బిలియనీర్ల సంఖ్య పెరిగింది. 2024లో 153 మంది నుంచి 185 మందికి పెరిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో బిలియనీర్ల సంపద 39.5 శాతం పెరిగి 138.7 బిలియన్ డాలర్లుగా ఉననట్లు రిపోర్టు వెల్లడించింది.

Satya

Recent Posts

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

5 minutes ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

2 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

2 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

3 hours ago

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

5 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

7 hours ago