Trends

హైదరాబాద్ రెండో మెట్రో.. ఇది అసలు సంగతి!

హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ నిర్మాణంపై చాలా కాలంగా అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే ఆలస్యం ఎందుకనేది ఇప్పుడు అసలైన సందేహం. ఇక దీనిపై కీలక అభిప్రాయాలను మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి‌తో జరిగిన సుదీర్ఘ చర్చల్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలు ప్రాధాన్యత పొందినట్లు తెలిపారు.

రెండో దశలో మొత్తం 76 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. అయితే, ఈ దశ నిర్మాణం అనేక సవాళ్లతో కూడుకొని ఉందని గుర్తుచేశారు. ప్రైవేటు రంగం నుండి మెట్రో రెండో దశకు ఆసక్తి కనిపించకపోవడం ప్రధాన సమస్యగా మారిందని పేర్కొన్నారు. మొదటి దశలో ఎల్ అండ్ టీ సంస్థకు రూ.6,000 కోట్ల నష్టం వాటిల్లడం, నిర్వహణ కారణంగా ప్రతి ఏడాది రూ.1,300 కోట్ల నష్టాన్ని ఎదుర్కోవడం దీనికి ప్రధాన కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ అనుభవం తోనే ప్రైవేటు సంస్థలు వెనుకడుగేసినట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులను ప్రభుత్వాలు స్వయంగా నిర్వహిస్తున్నట్లు ఉదాహరణగా చూపించారు. బ్యాంకులు కూడా మెట్రో నిర్మాణానికి రుణాలు ఇవ్వడానికి సంసిద్ధంగా లేవని తెలిపారు. దీంతో, మెట్రో రెండో దశ నిర్మాణం కేంద్ర-రాష్ట్ర భాగస్వామ్యంతో చేపట్టాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రికి సూచించినట్లు వివరించారు.

రెండో దశ మెట్రో నిర్మాణం కోసం రూ.24,269 కోట్ల వ్యయం అంచనా వేయగా, అందులో 48 శాతం నిధులు జైకా (జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ) ద్వారా సమకూరనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపిందని, కేంద్ర ప్రభుత్వ అనుమతులు రాగానే పనులు వేగంగా ప్రారంభిస్తామని అన్నారు. ఈ ప్రాజెక్టు ప్రజలకు అనేక రకాల ప్రయోజనాలు కలిగించనున్నట్లు ఎండీ వివరించారు. మెట్రో రెండో దశకు ప్రజల సహకారం కీలకం అని, అందరి మద్దతు ఉంటే పనులు నిర్దేశిత గడువులోపు పూర్తి చేయగలమని ధీమా వ్యక్తం చేశారు.

This post was last modified on November 19, 2024 10:11 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాంగ్ టైంలో రిలీజ్… దెబ్బ కొడుతోందా?

తమిళంలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు అజిత్ కుమార్. సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు తగ్గాక.. అటు విజయ్, ఇటు అజిత్…

2 hours ago

ఏది ఎక్కడ అడగాలో తెలియదా గురూ…!

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…

3 hours ago

ఇండియా vs పాక్ : టికెట్ రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయంటే…

ఇండియా - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2025 ఛాంపియన్స్…

3 hours ago

పూజా హెగ్డే… ఇది తగునా?

పూజా హెగ్డే ముంబయి అమ్మాయే అయినా.. ఆమెకు బ్రేక్ వచ్చింది.. ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే అన్న సంగతి తెలిసిందే.…

5 hours ago

బాబు బాటలోనే లోకేశ్!…’అరకు’కు మహార్దశ పక్కా!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ…

5 hours ago

క్రేజీ సీక్వెల్‌కు బడ్జెట్ సమస్యలు…

తొలి సినిమా ‘కహో నా ప్యార్ హై’తో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన హీరో హృతిక్ రోషన్. ఈ సినిమాతో కేవలం…

6 hours ago