హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ నిర్మాణంపై చాలా కాలంగా అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే ఆలస్యం ఎందుకనేది ఇప్పుడు అసలైన సందేహం. ఇక దీనిపై కీలక అభిప్రాయాలను మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన సుదీర్ఘ చర్చల్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలు ప్రాధాన్యత పొందినట్లు తెలిపారు.
రెండో దశలో మొత్తం 76 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. అయితే, ఈ దశ నిర్మాణం అనేక సవాళ్లతో కూడుకొని ఉందని గుర్తుచేశారు. ప్రైవేటు రంగం నుండి మెట్రో రెండో దశకు ఆసక్తి కనిపించకపోవడం ప్రధాన సమస్యగా మారిందని పేర్కొన్నారు. మొదటి దశలో ఎల్ అండ్ టీ సంస్థకు రూ.6,000 కోట్ల నష్టం వాటిల్లడం, నిర్వహణ కారణంగా ప్రతి ఏడాది రూ.1,300 కోట్ల నష్టాన్ని ఎదుర్కోవడం దీనికి ప్రధాన కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ అనుభవం తోనే ప్రైవేటు సంస్థలు వెనుకడుగేసినట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులను ప్రభుత్వాలు స్వయంగా నిర్వహిస్తున్నట్లు ఉదాహరణగా చూపించారు. బ్యాంకులు కూడా మెట్రో నిర్మాణానికి రుణాలు ఇవ్వడానికి సంసిద్ధంగా లేవని తెలిపారు. దీంతో, మెట్రో రెండో దశ నిర్మాణం కేంద్ర-రాష్ట్ర భాగస్వామ్యంతో చేపట్టాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రికి సూచించినట్లు వివరించారు.
రెండో దశ మెట్రో నిర్మాణం కోసం రూ.24,269 కోట్ల వ్యయం అంచనా వేయగా, అందులో 48 శాతం నిధులు జైకా (జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ) ద్వారా సమకూరనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపిందని, కేంద్ర ప్రభుత్వ అనుమతులు రాగానే పనులు వేగంగా ప్రారంభిస్తామని అన్నారు. ఈ ప్రాజెక్టు ప్రజలకు అనేక రకాల ప్రయోజనాలు కలిగించనున్నట్లు ఎండీ వివరించారు. మెట్రో రెండో దశకు ప్రజల సహకారం కీలకం అని, అందరి మద్దతు ఉంటే పనులు నిర్దేశిత గడువులోపు పూర్తి చేయగలమని ధీమా వ్యక్తం చేశారు.
This post was last modified on November 19, 2024 10:11 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…