హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ నిర్మాణంపై చాలా కాలంగా అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే ఆలస్యం ఎందుకనేది ఇప్పుడు అసలైన సందేహం. ఇక దీనిపై కీలక అభిప్రాయాలను మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన సుదీర్ఘ చర్చల్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలు ప్రాధాన్యత పొందినట్లు తెలిపారు.
రెండో దశలో మొత్తం 76 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. అయితే, ఈ దశ నిర్మాణం అనేక సవాళ్లతో కూడుకొని ఉందని గుర్తుచేశారు. ప్రైవేటు రంగం నుండి మెట్రో రెండో దశకు ఆసక్తి కనిపించకపోవడం ప్రధాన సమస్యగా మారిందని పేర్కొన్నారు. మొదటి దశలో ఎల్ అండ్ టీ సంస్థకు రూ.6,000 కోట్ల నష్టం వాటిల్లడం, నిర్వహణ కారణంగా ప్రతి ఏడాది రూ.1,300 కోట్ల నష్టాన్ని ఎదుర్కోవడం దీనికి ప్రధాన కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ అనుభవం తోనే ప్రైవేటు సంస్థలు వెనుకడుగేసినట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులను ప్రభుత్వాలు స్వయంగా నిర్వహిస్తున్నట్లు ఉదాహరణగా చూపించారు. బ్యాంకులు కూడా మెట్రో నిర్మాణానికి రుణాలు ఇవ్వడానికి సంసిద్ధంగా లేవని తెలిపారు. దీంతో, మెట్రో రెండో దశ నిర్మాణం కేంద్ర-రాష్ట్ర భాగస్వామ్యంతో చేపట్టాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రికి సూచించినట్లు వివరించారు.
రెండో దశ మెట్రో నిర్మాణం కోసం రూ.24,269 కోట్ల వ్యయం అంచనా వేయగా, అందులో 48 శాతం నిధులు జైకా (జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ) ద్వారా సమకూరనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపిందని, కేంద్ర ప్రభుత్వ అనుమతులు రాగానే పనులు వేగంగా ప్రారంభిస్తామని అన్నారు. ఈ ప్రాజెక్టు ప్రజలకు అనేక రకాల ప్రయోజనాలు కలిగించనున్నట్లు ఎండీ వివరించారు. మెట్రో రెండో దశకు ప్రజల సహకారం కీలకం అని, అందరి మద్దతు ఉంటే పనులు నిర్దేశిత గడువులోపు పూర్తి చేయగలమని ధీమా వ్యక్తం చేశారు.
This post was last modified on November 19, 2024 10:11 am
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…