Trends

హైదరాబాద్ రెండో మెట్రో.. ఇది అసలు సంగతి!

హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ నిర్మాణంపై చాలా కాలంగా అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే ఆలస్యం ఎందుకనేది ఇప్పుడు అసలైన సందేహం. ఇక దీనిపై కీలక అభిప్రాయాలను మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి‌తో జరిగిన సుదీర్ఘ చర్చల్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలు ప్రాధాన్యత పొందినట్లు తెలిపారు.

రెండో దశలో మొత్తం 76 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. అయితే, ఈ దశ నిర్మాణం అనేక సవాళ్లతో కూడుకొని ఉందని గుర్తుచేశారు. ప్రైవేటు రంగం నుండి మెట్రో రెండో దశకు ఆసక్తి కనిపించకపోవడం ప్రధాన సమస్యగా మారిందని పేర్కొన్నారు. మొదటి దశలో ఎల్ అండ్ టీ సంస్థకు రూ.6,000 కోట్ల నష్టం వాటిల్లడం, నిర్వహణ కారణంగా ప్రతి ఏడాది రూ.1,300 కోట్ల నష్టాన్ని ఎదుర్కోవడం దీనికి ప్రధాన కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ అనుభవం తోనే ప్రైవేటు సంస్థలు వెనుకడుగేసినట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులను ప్రభుత్వాలు స్వయంగా నిర్వహిస్తున్నట్లు ఉదాహరణగా చూపించారు. బ్యాంకులు కూడా మెట్రో నిర్మాణానికి రుణాలు ఇవ్వడానికి సంసిద్ధంగా లేవని తెలిపారు. దీంతో, మెట్రో రెండో దశ నిర్మాణం కేంద్ర-రాష్ట్ర భాగస్వామ్యంతో చేపట్టాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రికి సూచించినట్లు వివరించారు.

రెండో దశ మెట్రో నిర్మాణం కోసం రూ.24,269 కోట్ల వ్యయం అంచనా వేయగా, అందులో 48 శాతం నిధులు జైకా (జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ) ద్వారా సమకూరనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపిందని, కేంద్ర ప్రభుత్వ అనుమతులు రాగానే పనులు వేగంగా ప్రారంభిస్తామని అన్నారు. ఈ ప్రాజెక్టు ప్రజలకు అనేక రకాల ప్రయోజనాలు కలిగించనున్నట్లు ఎండీ వివరించారు. మెట్రో రెండో దశకు ప్రజల సహకారం కీలకం అని, అందరి మద్దతు ఉంటే పనులు నిర్దేశిత గడువులోపు పూర్తి చేయగలమని ధీమా వ్యక్తం చేశారు.

Satya

Recent Posts

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

3 hours ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

4 hours ago

నమ్మకం టన్నుల్లో… రామ్ చరణ్ మాటల్లో

విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…

5 hours ago

జ‌గ‌న్‌కు క‌విత మ‌ద్ద‌తిస్తున్నారా?

తెలంగాణ నాయ‌కురాలు, తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున…

5 hours ago

మస్సా మస్సా… లెక్క సరిపోయింది

పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…

5 hours ago

ప‌క్కా మాస్… క‌ల్లు రుచి చూసిన బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తాజాగా క‌ల్లు రుచి చూశారు. వాస్త‌వానికి ఆయ‌న ఇలాంటి వాటికి క‌డు దూరంగా ఉంటారు. అయితే..…

6 hours ago