కరోనా వైరస్ పేరుతో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఓ కుటుంబాన్ని అధికారులు ఓ ఆట ఆడుకున్న వైనంపై మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. ఆ కుటుంబంలో ఓ వ్యక్తికి జ్వరం వచ్చిన కారణంగా దాదాపు నెల రోజులుగా ఆ ఇంట్లో ఉన్న వాళ్లందరినీ అధికారులు వేధింపులకు గురి చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కరోనా పరీక్షల విషయంలో కచ్చితత్వం లేకపోవడం, సరైన రికార్డు మెయింటైన్ చేయకపోవడం వల్ల ఆ కుటుంబం నరకం చూసిందంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
శ్రీకాళహస్తి బాలాజీ నగర్కు చెందిన ఓ యువకుడికి ఏప్రిల్ మొదటి వారంలో జ్వరం వచ్చింది. అతను ఆసుపత్రికి వెళ్లగా సాధారణ జ్వరమే అని నిర్ధరించారు. కరోనా పరీక్ష చేయగా నెగెటివ్ వచ్చింది.
కానీ కరోనా టైంలో జ్వరం వచ్చిన నేపథ్యంలో ఆ వ్యక్తిని క్వారంటైన్కు తరలించారు. జ్వరానికి క్వారంటైన్ ఏమిటని కుటుంబ సభ్యులు ప్రశ్నించినా అధికారులు వినిపించుకోలేదు. అంతటితో ఆగకుండా కుటుంబంలోని మిగతా ముగ్గురు సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. వారికి కూడా నెగెటివే వచ్చింది. అయినా సరే కుటుంబం మొత్తం క్వారంటైన్లో ఉండాలని.. 14 రోజుల పాటు ఇల్లు దాటి బయటికి రావొద్దని అధికారులు ఆదేశించారు.
అధికారులు ఆదేశాల్ని అనుసరించి ఇంటిపట్టునే ఉన్న ఈ ఫ్యామిలీ ఈ నెల ద్వితీయార్ధంలో క్వారంటైన్ గడువు ముగిశాక అవసరాల కోసం బయటికి వచ్చింది. ఐతే కొన్ని రోజుల తర్వాత వీరి ఇంటికి వచ్చిన అధికారులు యువకుడి తల్లికి కరోనా పాజిటివ్ వచ్చిందని, ఐసోలేషన్ వార్డుకు వెళ్లాలని చెప్పి పీపీఈ కిట్ ఇచ్చారు. అసలు కొత్తగా తాము శాంపిలే ఇవ్వలేదని.. కరోనా పాజిటివ్ అని ఎలా తేల్చారని అడిగినా సమాధానం లేదు.
తర్వాత ఆమె ఆసుపత్రికి వెళ్తే అక్కడ ఆమె శాంపిల్ అంటూ ఏమీ లేదని తేలింది. చివరికిప్పుడు ఆ కుటుంబానికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి తలెత్తింది. జ్వరం అని ఆసుపత్రికి వెళ్లిన పాపానికి తమను అధికారులు ఆటాడుకున్నారంటూ సదరు కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీని గురించి స్థానిక మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది.
This post was last modified on April 28, 2020 4:12 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…