Trends

కరోనా పేరుతో ఆ ఫ్యామిలీని ఆటాడుకున్న అధికారులు


కరోనా వైరస్ పేరుతో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఓ కుటుంబాన్ని అధికారులు ఓ ఆట ఆడుకున్న వైనంపై మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. ఆ కుటుంబంలో ఓ వ్యక్తికి జ్వరం వచ్చిన కారణంగా దాదాపు నెల రోజులుగా ఆ ఇంట్లో ఉన్న వాళ్లందరినీ అధికారులు వేధింపులకు గురి చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కరోనా పరీక్షల విషయంలో కచ్చితత్వం లేకపోవడం, సరైన రికార్డు మెయింటైన్ చేయకపోవడం వల్ల ఆ కుటుంబం నరకం చూసిందంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
శ్రీకాళహస్తి బాలాజీ నగర్‌కు చెందిన ఓ యువకుడికి ఏప్రిల్ మొదటి వారంలో జ్వరం వచ్చింది. అతను ఆసుపత్రికి వెళ్లగా సాధారణ జ్వరమే అని నిర్ధరించారు. కరోనా పరీక్ష చేయగా నెగెటివ్ వచ్చింది.

కానీ కరోనా టైంలో జ్వరం వచ్చిన నేపథ్యంలో ఆ వ్యక్తిని క్వారంటైన్‌కు తరలించారు. జ్వరానికి క్వారంటైన్ ఏమిటని కుటుంబ సభ్యులు ప్రశ్నించినా అధికారులు వినిపించుకోలేదు. అంతటితో ఆగకుండా కుటుంబంలోని మిగతా ముగ్గురు సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. వారికి కూడా నెగెటివే వచ్చింది. అయినా సరే కుటుంబం మొత్తం క్వారంటైన్లో ఉండాలని.. 14 రోజుల పాటు ఇల్లు దాటి బయటికి రావొద్దని అధికారులు ఆదేశించారు.

అధికారులు ఆదేశాల్ని అనుసరించి ఇంటిపట్టునే ఉన్న ఈ ఫ్యామిలీ ఈ నెల ద్వితీయార్ధంలో క్వారంటైన్ గడువు ముగిశాక అవసరాల కోసం బయటికి వచ్చింది. ఐతే కొన్ని రోజుల తర్వాత వీరి ఇంటికి వచ్చిన అధికారులు యువకుడి తల్లికి కరోనా పాజిటివ్ వచ్చిందని, ఐసోలేషన్ వార్డుకు వెళ్లాలని చెప్పి పీపీఈ కిట్ ఇచ్చారు. అసలు కొత్తగా తాము శాంపిలే ఇవ్వలేదని.. కరోనా పాజిటివ్ అని ఎలా తేల్చారని అడిగినా సమాధానం లేదు.

తర్వాత ఆమె ఆసుపత్రికి వెళ్తే అక్కడ ఆమె శాంపిల్ అంటూ ఏమీ లేదని తేలింది. చివరికిప్పుడు ఆ కుటుంబానికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి తలెత్తింది. జ్వరం అని ఆసుపత్రికి వెళ్లిన పాపానికి తమను అధికారులు ఆటాడుకున్నారంటూ సదరు కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీని గురించి స్థానిక మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది.

This post was last modified on April 28, 2020 4:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

8 minutes ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

21 minutes ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

3 hours ago

ఇక ‘నెంబర్ వన్’ హీరోయిన్ లేనట్టేనా?

ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…

6 hours ago

విమానాల్లో లోపాలు.. ఎయిర్ ఇండియా, ఇండిగో టాప్!

మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…

6 hours ago

‘కేసీఆర్ కుటుంబాన్ని కిషన్ రెడ్డి కాపాడుతున్నారు’

బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిష‌న్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…

6 hours ago