Trends

కరోనా పేరుతో ఆ ఫ్యామిలీని ఆటాడుకున్న అధికారులు


కరోనా వైరస్ పేరుతో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఓ కుటుంబాన్ని అధికారులు ఓ ఆట ఆడుకున్న వైనంపై మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. ఆ కుటుంబంలో ఓ వ్యక్తికి జ్వరం వచ్చిన కారణంగా దాదాపు నెల రోజులుగా ఆ ఇంట్లో ఉన్న వాళ్లందరినీ అధికారులు వేధింపులకు గురి చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కరోనా పరీక్షల విషయంలో కచ్చితత్వం లేకపోవడం, సరైన రికార్డు మెయింటైన్ చేయకపోవడం వల్ల ఆ కుటుంబం నరకం చూసిందంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
శ్రీకాళహస్తి బాలాజీ నగర్‌కు చెందిన ఓ యువకుడికి ఏప్రిల్ మొదటి వారంలో జ్వరం వచ్చింది. అతను ఆసుపత్రికి వెళ్లగా సాధారణ జ్వరమే అని నిర్ధరించారు. కరోనా పరీక్ష చేయగా నెగెటివ్ వచ్చింది.

కానీ కరోనా టైంలో జ్వరం వచ్చిన నేపథ్యంలో ఆ వ్యక్తిని క్వారంటైన్‌కు తరలించారు. జ్వరానికి క్వారంటైన్ ఏమిటని కుటుంబ సభ్యులు ప్రశ్నించినా అధికారులు వినిపించుకోలేదు. అంతటితో ఆగకుండా కుటుంబంలోని మిగతా ముగ్గురు సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. వారికి కూడా నెగెటివే వచ్చింది. అయినా సరే కుటుంబం మొత్తం క్వారంటైన్లో ఉండాలని.. 14 రోజుల పాటు ఇల్లు దాటి బయటికి రావొద్దని అధికారులు ఆదేశించారు.

అధికారులు ఆదేశాల్ని అనుసరించి ఇంటిపట్టునే ఉన్న ఈ ఫ్యామిలీ ఈ నెల ద్వితీయార్ధంలో క్వారంటైన్ గడువు ముగిశాక అవసరాల కోసం బయటికి వచ్చింది. ఐతే కొన్ని రోజుల తర్వాత వీరి ఇంటికి వచ్చిన అధికారులు యువకుడి తల్లికి కరోనా పాజిటివ్ వచ్చిందని, ఐసోలేషన్ వార్డుకు వెళ్లాలని చెప్పి పీపీఈ కిట్ ఇచ్చారు. అసలు కొత్తగా తాము శాంపిలే ఇవ్వలేదని.. కరోనా పాజిటివ్ అని ఎలా తేల్చారని అడిగినా సమాధానం లేదు.

తర్వాత ఆమె ఆసుపత్రికి వెళ్తే అక్కడ ఆమె శాంపిల్ అంటూ ఏమీ లేదని తేలింది. చివరికిప్పుడు ఆ కుటుంబానికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి తలెత్తింది. జ్వరం అని ఆసుపత్రికి వెళ్లిన పాపానికి తమను అధికారులు ఆటాడుకున్నారంటూ సదరు కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీని గురించి స్థానిక మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది.

This post was last modified on April 28, 2020 4:12 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

ఆర్ఆర్ఆర్‌పై ఆ ప్ర‌శ్నకు రాజ‌మౌళి అస‌హ‌నం

ఆర్ఆర్ఆర్ సినిమా అద్భుత విజ‌యం సాధించిన‌ప్ప‌టికీ.. ఆ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్‌తో పోలిస్తే జూనియ‌ర్ ఎన్టీఆర్ పాత్ర‌లో అంత బ‌లం…

2 hours ago

మెగా ఎఫెక్ట్‌.. క‌దిలిన ఇండ‌స్ట్రీ..!

ఏపీలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక స‌మ‌రం.. ఓ రేంజ్‌లో హీటు పుట్టిస్తోంది. ప్ర‌ధాన ప‌క్షాలైన‌.. టీడీపీ, వైసీపీ, జ‌న‌సేన‌లు దూకుడుగా ముందుకు…

3 hours ago

చంద్ర‌బాబు నాకు గురువ‌ని ఎవ‌డ‌న్నాడు: రేవంత్

టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. "చంద్ర‌బాబు నాకు గురువ‌ని ఎవ‌డ‌న్నాడు. బుద్ధి…

4 hours ago

పవన్‌కు బంపర్ మెజారిటీ?

ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారం కూడా సమయం లేదు. ఈ ఎన్నికల్లో అందరి దృష్టినీ…

5 hours ago

‘పుష్ప’తో నాకొచ్చిందేమీ లేదు-ఫాహద్

మలయాళంలో గత దశాబ్ద కాలంలో తిరుగులేని పాపులారిటీ సంపాదించిన నటుడు ఫాహద్ ఫాజిల్. లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ తనయుడైన ఫాహద్…

5 hours ago

సీనియర్ దర్శకుడిని ఇలా అవమానిస్తారా

సోషల్ మీడియా, టీవీ ఛానల్స్ పెరిగిపోయాక అనుకరణలు, ట్రోలింగ్ లు విపరీతంగా పెరిగిపోయాయి. త్వరగా వచ్చే పాపులారిటీ కావడంతో ఎలాంటి…

7 hours ago