Trends

కరోనా పేరుతో ఆ ఫ్యామిలీని ఆటాడుకున్న అధికారులు


కరోనా వైరస్ పేరుతో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఓ కుటుంబాన్ని అధికారులు ఓ ఆట ఆడుకున్న వైనంపై మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. ఆ కుటుంబంలో ఓ వ్యక్తికి జ్వరం వచ్చిన కారణంగా దాదాపు నెల రోజులుగా ఆ ఇంట్లో ఉన్న వాళ్లందరినీ అధికారులు వేధింపులకు గురి చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కరోనా పరీక్షల విషయంలో కచ్చితత్వం లేకపోవడం, సరైన రికార్డు మెయింటైన్ చేయకపోవడం వల్ల ఆ కుటుంబం నరకం చూసిందంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
శ్రీకాళహస్తి బాలాజీ నగర్‌కు చెందిన ఓ యువకుడికి ఏప్రిల్ మొదటి వారంలో జ్వరం వచ్చింది. అతను ఆసుపత్రికి వెళ్లగా సాధారణ జ్వరమే అని నిర్ధరించారు. కరోనా పరీక్ష చేయగా నెగెటివ్ వచ్చింది.

కానీ కరోనా టైంలో జ్వరం వచ్చిన నేపథ్యంలో ఆ వ్యక్తిని క్వారంటైన్‌కు తరలించారు. జ్వరానికి క్వారంటైన్ ఏమిటని కుటుంబ సభ్యులు ప్రశ్నించినా అధికారులు వినిపించుకోలేదు. అంతటితో ఆగకుండా కుటుంబంలోని మిగతా ముగ్గురు సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. వారికి కూడా నెగెటివే వచ్చింది. అయినా సరే కుటుంబం మొత్తం క్వారంటైన్లో ఉండాలని.. 14 రోజుల పాటు ఇల్లు దాటి బయటికి రావొద్దని అధికారులు ఆదేశించారు.

అధికారులు ఆదేశాల్ని అనుసరించి ఇంటిపట్టునే ఉన్న ఈ ఫ్యామిలీ ఈ నెల ద్వితీయార్ధంలో క్వారంటైన్ గడువు ముగిశాక అవసరాల కోసం బయటికి వచ్చింది. ఐతే కొన్ని రోజుల తర్వాత వీరి ఇంటికి వచ్చిన అధికారులు యువకుడి తల్లికి కరోనా పాజిటివ్ వచ్చిందని, ఐసోలేషన్ వార్డుకు వెళ్లాలని చెప్పి పీపీఈ కిట్ ఇచ్చారు. అసలు కొత్తగా తాము శాంపిలే ఇవ్వలేదని.. కరోనా పాజిటివ్ అని ఎలా తేల్చారని అడిగినా సమాధానం లేదు.

తర్వాత ఆమె ఆసుపత్రికి వెళ్తే అక్కడ ఆమె శాంపిల్ అంటూ ఏమీ లేదని తేలింది. చివరికిప్పుడు ఆ కుటుంబానికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి తలెత్తింది. జ్వరం అని ఆసుపత్రికి వెళ్లిన పాపానికి తమను అధికారులు ఆటాడుకున్నారంటూ సదరు కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీని గురించి స్థానిక మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది.

This post was last modified on April 28, 2020 4:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సితారే జమీన్ పర్.. ఈసారి కన్నీళ్లు కాదు

ఆమిర్ ఖాన్ కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. కానీ ఆయన సినిమాల్లో ‘తారే జమీన్ పర్’ చాలా స్పెషల్.…

2 hours ago

భారత్ సంచలనం : పాకిస్తానీలు దేశం విడిచి వెళ్ళిపోవాలి!

కశ్మీర్ లోని పెహల్ గాంలో చోటుచేసుకున్న ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కశ్మీర్ లోని పర్యాటకులను…

5 hours ago

వెంకీ & నాని మల్టీస్టారర్ మిస్సయ్యిందా

పైన హెడ్డింగ్ చదవగానే అరే మిస్సయ్యామే అనే ఫీలింగ్ ఎవరికైనా కలుగుతుంది. అలాంటిదే అభిమానులు ఎదురు చూస్తున్న విక్టరీ వెంకటేష్,…

5 hours ago

గుడివాడ వైసీపీ కొలాప్స్ ?

ఉమ్మ‌డి కృష్నా జిల్లాలోని గుడివాడ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం అంటే.. కొడాలి నానితోపాటు.. వైసీపీ పేరు కూడా వినిపిస్తుంది. నానితో పాటు..…

7 hours ago

వీళ్లు మ‌నుషులు కాదు మృగాలు: చంద్ర‌బాబు

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లా ఒంగోలు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని అమ్మ‌న‌బ్రోలుకు చెందిన టీడీపీ నాయ‌కుడు వీర‌య్య చౌద‌రి దారుణ హ‌త్య‌పై సీఎం…

8 hours ago

రాజా సాబ్ కానుక సరే మరి శుభవార్త ?

ప్రభాస్ అభిమానుల సహనానికి పరీక్ష పెడుతూ వచ్చినది రాజా సాబ్ ఎట్టకేలకు ప్రమోషన్ల పరంగా ఒక అడుగు ముందుకు వేస్తోంది.…

9 hours ago