Trends

భారత్ రక్షణలో పవర్ఫుల్ మిసైల్

భారత్ రక్షణ రంగంలో మరో పెద్ద అడుగు వేసింది. దేశీయంగా అభివృద్ధి చేసిన దీర్ఘశ్రేణి హైపర్ సోనిక్ మిసైల్‌ను ఒడిశా తీరంలో విజయవంతంగా పరీక్షించింది. ఈ మిసైల్ 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను తుదముట్టించగల సామర్థ్యం కలిగి ఉంది. ఈ విజయాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. భారత్ అత్యాధునిక మిలటరీ టెక్నాలజీ కలిగిన దేశాల సరసన చేరిందని ఆయన వెల్లడించారు.

మిసైల్ ప్రయోగం పూర్తయ్యాక, దాని గమనం, పనితీరును శాస్త్రవేత్తలు జాగ్రత్తగా విశ్లేషించారు. డౌన్-రేంజ్ షిప్ స్టేషన్ల ద్వారా సేకరించిన డేటా ఆధారంగా మిసైల్ అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించిందని డీఆర్‌డీవో స్పష్టం చేసింది. ఈ క్షిపణిని అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించారని పేర్కొంది. హైదరాబాద్‌లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్ ఈ మిసైల్ అభివృద్ధికి కీలకంగా నిలిచింది.

డీఆర్‌డీవో ల్యాబరేటరీస్, ఇండస్ట్రీ భాగస్వాముల సహకారంతో ఈ మిసైల్ రూపుదిద్దుకుంది. దేశ భద్రతకు ఇది ఎంతో ముఖ్యమైన సాధనమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. రాజ్‌నాథ్ సింగ్ ఈ విజయానికి శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, రక్షణ అధికారులు అందరినీ అభినందించారు. “ఇది భారత రక్షణ రంగం బలోపేతానికి తార్కాణం. ఈ విజయం సాంకేతికంగా మరింత ముందుకు తీసుకెళ్తుంది,” అని ఆయన సోషక్ మీడియా ద్వారా తెలిపారు. ఈ విజయంతో, మిలటరీ టెక్నాలజీ రంగంలో భారత్ తన ఆధిపత్యాన్ని మరింత పవర్ఫుల్ గా చూపించింది. హైపర్ సోనిక్ మిసైల్ విజయవంతమైన ఈ పరీక్ష భవిష్యత్తులో రక్షణ రంగానికి మరింత విశ్వాసాన్ని నింపనుంది.

This post was last modified on November 18, 2024 1:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇండి’గోల’పై కేటీఆర్ ‘పెత్తనం’ కామెంట్స్

బీఆర్ ఎస్ కార్యనిర్వాహ‌క అధ్య‌క్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అధికారం ఒక‌రిద్ద‌రి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…

2 hours ago

దేవరకొండా… ఇక ఆ సినిమా దేవుడికేనా?

తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…

5 hours ago

బిగ్ బాస్-9‌లో ఇతనే పెద్ద సర్ప్రైజ్

ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…

5 hours ago

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

8 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

9 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

10 hours ago