Trends

భారత్ రక్షణలో పవర్ఫుల్ మిసైల్

భారత్ రక్షణ రంగంలో మరో పెద్ద అడుగు వేసింది. దేశీయంగా అభివృద్ధి చేసిన దీర్ఘశ్రేణి హైపర్ సోనిక్ మిసైల్‌ను ఒడిశా తీరంలో విజయవంతంగా పరీక్షించింది. ఈ మిసైల్ 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను తుదముట్టించగల సామర్థ్యం కలిగి ఉంది. ఈ విజయాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. భారత్ అత్యాధునిక మిలటరీ టెక్నాలజీ కలిగిన దేశాల సరసన చేరిందని ఆయన వెల్లడించారు.

మిసైల్ ప్రయోగం పూర్తయ్యాక, దాని గమనం, పనితీరును శాస్త్రవేత్తలు జాగ్రత్తగా విశ్లేషించారు. డౌన్-రేంజ్ షిప్ స్టేషన్ల ద్వారా సేకరించిన డేటా ఆధారంగా మిసైల్ అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించిందని డీఆర్‌డీవో స్పష్టం చేసింది. ఈ క్షిపణిని అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించారని పేర్కొంది. హైదరాబాద్‌లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్ ఈ మిసైల్ అభివృద్ధికి కీలకంగా నిలిచింది.

డీఆర్‌డీవో ల్యాబరేటరీస్, ఇండస్ట్రీ భాగస్వాముల సహకారంతో ఈ మిసైల్ రూపుదిద్దుకుంది. దేశ భద్రతకు ఇది ఎంతో ముఖ్యమైన సాధనమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. రాజ్‌నాథ్ సింగ్ ఈ విజయానికి శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, రక్షణ అధికారులు అందరినీ అభినందించారు. “ఇది భారత రక్షణ రంగం బలోపేతానికి తార్కాణం. ఈ విజయం సాంకేతికంగా మరింత ముందుకు తీసుకెళ్తుంది,” అని ఆయన సోషక్ మీడియా ద్వారా తెలిపారు. ఈ విజయంతో, మిలటరీ టెక్నాలజీ రంగంలో భారత్ తన ఆధిపత్యాన్ని మరింత పవర్ఫుల్ గా చూపించింది. హైపర్ సోనిక్ మిసైల్ విజయవంతమైన ఈ పరీక్ష భవిష్యత్తులో రక్షణ రంగానికి మరింత విశ్వాసాన్ని నింపనుంది.

Satya

Recent Posts

దెయ్యాలంటే మనోళ్లకు ప్రేమ ఎక్కువే

ఇటీవలే విడుదలైన హాలీవుడ్ మూవీ ఈవిల్ డెడ్ బర్న్ ఇండియా మొత్తం మీద మొదటి వీకెండ్ కాకుండానే 18 కోట్లకు…

1 hour ago

ముద్రగడ పద్మనాభం కన్నుమూత

కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రెడ్డి కన్ను మూశారు. కొంతకాలం నుంచి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ…

2 hours ago

అఖిల్ ఈసారి ఆ తప్పు చేయకూడదు

అక్కినేని కుటుంబం, అభిమానుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఆ కుటుంబం నుంచి కొత్త తరంలో చాలా పెద్ద స్టార్ అయిపోతాడు…

3 hours ago

తారక్ సినిమా లక్ష్యాలు చాలా పెద్దవి

ఒక ఫ్యాన్ అసోసియేషన్ వ్యక్తిగతంగా తమ హీరో పేరు మీద సేవా కార్యక్రమాలు తలపెడితే, దానికి రాజకీయ రంగప్రవేశానికి ముడిపెట్టి…

4 hours ago

వెయ్యి కోట్ల దురంధర్… అక్కడేమో డిజాస్టర్

పెద్దగా అంచనాలు లేకుండా గత ఏడాది డిసెంబర్ లో దురంధర్ విడుదలైనప్పుడు ఎవరూ దాని సునామిని ఊహించలేదు. వంద కోట్లు…

4 hours ago

చివరికి స్మశానాలను కూడా వదలలేదు

అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తెలంగాణలో అవినీతి మరింతగా రాజ్యమేలుతోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే…

6 hours ago