Trends

భారత్ రక్షణలో పవర్ఫుల్ మిసైల్

భారత్ రక్షణ రంగంలో మరో పెద్ద అడుగు వేసింది. దేశీయంగా అభివృద్ధి చేసిన దీర్ఘశ్రేణి హైపర్ సోనిక్ మిసైల్‌ను ఒడిశా తీరంలో విజయవంతంగా పరీక్షించింది. ఈ మిసైల్ 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను తుదముట్టించగల సామర్థ్యం కలిగి ఉంది. ఈ విజయాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. భారత్ అత్యాధునిక మిలటరీ టెక్నాలజీ కలిగిన దేశాల సరసన చేరిందని ఆయన వెల్లడించారు.

మిసైల్ ప్రయోగం పూర్తయ్యాక, దాని గమనం, పనితీరును శాస్త్రవేత్తలు జాగ్రత్తగా విశ్లేషించారు. డౌన్-రేంజ్ షిప్ స్టేషన్ల ద్వారా సేకరించిన డేటా ఆధారంగా మిసైల్ అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించిందని డీఆర్‌డీవో స్పష్టం చేసింది. ఈ క్షిపణిని అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించారని పేర్కొంది. హైదరాబాద్‌లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్ ఈ మిసైల్ అభివృద్ధికి కీలకంగా నిలిచింది.

డీఆర్‌డీవో ల్యాబరేటరీస్, ఇండస్ట్రీ భాగస్వాముల సహకారంతో ఈ మిసైల్ రూపుదిద్దుకుంది. దేశ భద్రతకు ఇది ఎంతో ముఖ్యమైన సాధనమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. రాజ్‌నాథ్ సింగ్ ఈ విజయానికి శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, రక్షణ అధికారులు అందరినీ అభినందించారు. “ఇది భారత రక్షణ రంగం బలోపేతానికి తార్కాణం. ఈ విజయం సాంకేతికంగా మరింత ముందుకు తీసుకెళ్తుంది,” అని ఆయన సోషక్ మీడియా ద్వారా తెలిపారు. ఈ విజయంతో, మిలటరీ టెక్నాలజీ రంగంలో భారత్ తన ఆధిపత్యాన్ని మరింత పవర్ఫుల్ గా చూపించింది. హైపర్ సోనిక్ మిసైల్ విజయవంతమైన ఈ పరీక్ష భవిష్యత్తులో రక్షణ రంగానికి మరింత విశ్వాసాన్ని నింపనుంది.

This post was last modified on November 18, 2024 1:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

6 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

7 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

7 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

9 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

9 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

11 hours ago