భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీకి ఇప్పుడు బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ప్రత్యేకమైన సిరీస్గా నిలవనుంది. ఐదు టెస్టుల ఈ సిరీస్లో ఆస్ట్రేలియాతో తలపడనుండగా, ఇది కోహ్లీ చివరి ఆస్ట్రేలియా పర్యటన కావచ్చని చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే టీ20 ఫార్మాట్ కు వీడ్కోలు పలికిన విరాట్ ఇక రాబోయే రోజుల్లో టెస్ట్ ఫార్మాట్ కు కూడా మెల్లగా దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక 22న పెర్త్లో ప్రారంభమవుతున్న తొలి టెస్టు, కోహ్లీకి ప్రతిష్టాత్మకంగా మారింది. విరాట్ కోహ్లీ కెరీర్లో ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో పలు అద్భుతాలు నమోదు చేశారు. 2014 సిరీస్లో నాలుగు సెంచరీలతో విశేషమైన ప్రదర్శన చూపించారు. 2018లో భారత జట్టు ఆస్ట్రేలియాలో సిరీస్ గెలిచినప్పుడు కోహ్లీ నాయకత్వం కీలక పాత్ర పోషించింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. గతంలో ఎప్పుడూలేని విధంగా కోహ్లీ ఫామ్ గురించి ఆందోళన నెలకొంది.
2023లో వెస్టిండీస్పై చేసిన సెంచరీ తర్వాత, కోహ్లీ మళ్ళీ అంత పెద్ద ఇన్నింగ్స్ ఆడకపోవడం విమర్శలకు దారితీసింది. ఆస్ట్రేలియా పిచ్లపై ఇప్పటికే చక్కటి రికార్డును కలిగిన కోహ్లీ, ఈ సిరీస్లో మళ్ళీ తన బ్యాటింగ్ సత్తాను చాటుతారని గంగూలీ లాంటి క్రికెట్ నిపుణులు నమ్ముతున్నారు. “కోహ్లీకి ఇదే చివరి ఆస్ట్రేలియా సిరీస్ కావొచ్చు.. తన అనుభవంతో జట్టుకు మద్దతు ఇవ్వడం, విజయం సాధించడం అతడి లక్ష్యంగా ఉంటుంది” అని గంగూలీ వ్యాఖ్యానించారు.
ఈ సిరీస్ ప్రారంభానికి ముందు భారత జట్టు గాయాల బెడదతో కష్టాల్లో ఉంది. శుభమన్ గిల్, మహ్మద్ షమీ లాంటి ఆటగాళ్లు జట్టుకు దూరం కాగా, బ్యాటింగ్ విభాగంలో విరాట్ కీలక పాత్ర పోషించాల్సి ఉంది. రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడం, ఇతర యువ ఆటగాళ్ల అనుభవం కొరవడడం వల్ల కోహ్లీపై అంచనాలు పెరిగాయి. ఈ సిరీస్ తర్వాత 2025 వరకు మళ్లీ భారత్కు ఆసీస్ పర్యటన ఉండకపోవచ్చు. కాబట్టి, ఈ సిరీస్ కోహ్లీకి ఆఖరి ఆస్ట్రేలియా పర్యటనగా మారవచ్చు. అయితే, ఈ అనుమానాల మధ్య, కోహ్లీ ఈ సిరీస్లో తన బ్యాటింగ్ ప్రతిభతో చరిత్ర సృష్టిస్తారనే ఆశాభావం అభిమానుల్లో నెలకొంది.
This post was last modified on November 18, 2024 12:51 pm
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…