Trends

విరాట్ కోహ్లీ చివరి సిరీస్ ఇదేనా?

భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీకి ఇప్పుడు బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ప్రత్యేకమైన సిరీస్‌గా నిలవనుంది. ఐదు టెస్టుల ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుండగా, ఇది కోహ్లీ చివరి ఆస్ట్రేలియా పర్యటన కావచ్చని చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే టీ20 ఫార్మాట్ కు వీడ్కోలు పలికిన విరాట్ ఇక రాబోయే రోజుల్లో టెస్ట్ ఫార్మాట్ కు కూడా మెల్లగా దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక 22న పెర్త్‌లో ప్రారంభమవుతున్న తొలి టెస్టు, కోహ్లీకి ప్రతిష్టాత్మకంగా మారింది. విరాట్ కోహ్లీ కెరీర్‌లో ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో పలు అద్భుతాలు నమోదు చేశారు. 2014 సిరీస్‌లో నాలుగు సెంచరీలతో విశేషమైన ప్రదర్శన చూపించారు. 2018లో భారత జట్టు ఆస్ట్రేలియాలో సిరీస్ గెలిచినప్పుడు కోహ్లీ నాయకత్వం కీలక పాత్ర పోషించింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. గతంలో ఎప్పుడూలేని విధంగా కోహ్లీ ఫామ్ గురించి ఆందోళన నెలకొంది.

2023లో వెస్టిండీస్‌పై చేసిన సెంచరీ తర్వాత, కోహ్లీ మళ్ళీ అంత పెద్ద ఇన్నింగ్స్ ఆడకపోవడం విమర్శలకు దారితీసింది. ఆస్ట్రేలియా పిచ్‌లపై ఇప్పటికే చక్కటి రికార్డును కలిగిన కోహ్లీ, ఈ సిరీస్‌లో మళ్ళీ తన బ్యాటింగ్ సత్తాను చాటుతారని గంగూలీ లాంటి క్రికెట్ నిపుణులు నమ్ముతున్నారు. “కోహ్లీకి ఇదే చివరి ఆస్ట్రేలియా సిరీస్ కావొచ్చు.. తన అనుభవంతో జట్టుకు మద్దతు ఇవ్వడం, విజయం సాధించడం అతడి లక్ష్యంగా ఉంటుంది” అని గంగూలీ వ్యాఖ్యానించారు.

ఈ సిరీస్ ప్రారంభానికి ముందు భారత జట్టు గాయాల బెడదతో కష్టాల్లో ఉంది. శుభమన్ గిల్, మహ్మద్ షమీ లాంటి ఆటగాళ్లు జట్టుకు దూరం కాగా, బ్యాటింగ్ విభాగంలో విరాట్ కీలక పాత్ర పోషించాల్సి ఉంది. రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడం, ఇతర యువ ఆటగాళ్ల అనుభవం కొరవడడం వల్ల కోహ్లీపై అంచనాలు పెరిగాయి. ఈ సిరీస్ తర్వాత 2025 వరకు మళ్లీ భారత్‌కు ఆసీస్ పర్యటన ఉండకపోవచ్చు. కాబట్టి, ఈ సిరీస్ కోహ్లీకి ఆఖరి ఆస్ట్రేలియా పర్యటనగా మారవచ్చు. అయితే, ఈ అనుమానాల మధ్య, కోహ్లీ ఈ సిరీస్‌లో తన బ్యాటింగ్ ప్రతిభతో చరిత్ర సృష్టిస్తారనే ఆశాభావం అభిమానుల్లో నెలకొంది.

This post was last modified on November 18, 2024 12:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘హైదరాబాద్ హౌస్’లో పుతిన్ బస.. ఈ ప్యాలెస్ ఎవరిదో తెలుసా?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…

4 hours ago

బోకేలు, శాలువాలు లేవు… పవన్ రియాక్షన్ ఏంటి?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…

7 hours ago

నెగిటివిటీ వలయంలో దురంధర్ విలవిలా

బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…

7 hours ago

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

10 hours ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

11 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

11 hours ago