భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీకి ఇప్పుడు బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ప్రత్యేకమైన సిరీస్గా నిలవనుంది. ఐదు టెస్టుల ఈ సిరీస్లో ఆస్ట్రేలియాతో తలపడనుండగా, ఇది కోహ్లీ చివరి ఆస్ట్రేలియా పర్యటన కావచ్చని చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే టీ20 ఫార్మాట్ కు వీడ్కోలు పలికిన విరాట్ ఇక రాబోయే రోజుల్లో టెస్ట్ ఫార్మాట్ కు కూడా మెల్లగా దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక 22న పెర్త్లో ప్రారంభమవుతున్న తొలి టెస్టు, కోహ్లీకి ప్రతిష్టాత్మకంగా మారింది. విరాట్ కోహ్లీ కెరీర్లో ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో పలు అద్భుతాలు నమోదు చేశారు. 2014 సిరీస్లో నాలుగు సెంచరీలతో విశేషమైన ప్రదర్శన చూపించారు. 2018లో భారత జట్టు ఆస్ట్రేలియాలో సిరీస్ గెలిచినప్పుడు కోహ్లీ నాయకత్వం కీలక పాత్ర పోషించింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. గతంలో ఎప్పుడూలేని విధంగా కోహ్లీ ఫామ్ గురించి ఆందోళన నెలకొంది.
2023లో వెస్టిండీస్పై చేసిన సెంచరీ తర్వాత, కోహ్లీ మళ్ళీ అంత పెద్ద ఇన్నింగ్స్ ఆడకపోవడం విమర్శలకు దారితీసింది. ఆస్ట్రేలియా పిచ్లపై ఇప్పటికే చక్కటి రికార్డును కలిగిన కోహ్లీ, ఈ సిరీస్లో మళ్ళీ తన బ్యాటింగ్ సత్తాను చాటుతారని గంగూలీ లాంటి క్రికెట్ నిపుణులు నమ్ముతున్నారు. “కోహ్లీకి ఇదే చివరి ఆస్ట్రేలియా సిరీస్ కావొచ్చు.. తన అనుభవంతో జట్టుకు మద్దతు ఇవ్వడం, విజయం సాధించడం అతడి లక్ష్యంగా ఉంటుంది” అని గంగూలీ వ్యాఖ్యానించారు.
ఈ సిరీస్ ప్రారంభానికి ముందు భారత జట్టు గాయాల బెడదతో కష్టాల్లో ఉంది. శుభమన్ గిల్, మహ్మద్ షమీ లాంటి ఆటగాళ్లు జట్టుకు దూరం కాగా, బ్యాటింగ్ విభాగంలో విరాట్ కీలక పాత్ర పోషించాల్సి ఉంది. రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడం, ఇతర యువ ఆటగాళ్ల అనుభవం కొరవడడం వల్ల కోహ్లీపై అంచనాలు పెరిగాయి. ఈ సిరీస్ తర్వాత 2025 వరకు మళ్లీ భారత్కు ఆసీస్ పర్యటన ఉండకపోవచ్చు. కాబట్టి, ఈ సిరీస్ కోహ్లీకి ఆఖరి ఆస్ట్రేలియా పర్యటనగా మారవచ్చు. అయితే, ఈ అనుమానాల మధ్య, కోహ్లీ ఈ సిరీస్లో తన బ్యాటింగ్ ప్రతిభతో చరిత్ర సృష్టిస్తారనే ఆశాభావం అభిమానుల్లో నెలకొంది.
This post was last modified on November 18, 2024 12:51 pm
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…
ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…