Trends

రీల్స్ చేసే వారికి రైల్వే శాఖ లేటెస్టు వార్నింగ్..

రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న సెన్సాఫ్ హ్యుమర్ ను పది మందితో పంచుకోవటానికి చేస్తున్న రీల్స్ అంతకంతకూ విస్తరిస్తూ.. ప్రమాదకర ఫీట్లు చేసేలా చేస్తున్నాయి. సోషల్ ఇమేజ్ ను పెంచుకోవటానికి ప్రమాదకర విన్యాసాలు చేసేందుకు వెనుకాడటం లేదు. ఇలాంటి వారి కారణంగా ట్రైన్లో ప్రయాణించే ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నారు. పలు సందర్భాల్లో ప్రమాదకర విన్యాసాలు చేస్తూ.. ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇలాంటి వారికి చెక్ పెట్టేలా రైల్వే శాఖ సీరియన్ నిర్ణయాన్ని తీసుకుంది.

ఇకపై.. రైల్వే కార్యకలాపాలకు.. ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. అంతేకాదు.. రైళ్లలో ప్రమాదకర రీల్స్ చేస్తూ.. ప్రయానికులకు ఇబ్బంది కలిగించే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కూడా అన్ని జోన్లకు ఆదేశాలు జారీ చేసింది. రైల్వే ట్రాకులు.. కదులుతున్న రైళ్లలో ప్రమాదకర స్టంట్లు చేస్తూ వీడియోలు షూట్ చేసే వారి కారణంగా చోటు చేసుకుంటున్న ప్రమాదకర ఘటనల నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

ఇటీవల జైపూర్ డివిజన్ లో రైల్వే ట్రాకుపై ఒక ఎస్ యూవీ నడిపిస్తూ స్టంట్లు చేస్తున్న వారిపై రైల్వే ప్రొటెక్షన్ పోలీసులు కేసు నమోదు చేయటం తెలిసిందే. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసేందుకు షూట్ చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

నిజానికి ఈ వీడియో షూట్ చేసే వేళలో.. గూడ్స్ రైలు లోకో పైలెట్ అప్రమత్తంగా ఉండటంతో ప్రమాదం తప్పింది. ఇలాంటివే పలు ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. చెన్నైలోని పలువురు కాలేజీ విద్యార్థులు ట్రైన్ ఫుట్ బోర్డు మీద ప్రయాణం చేయటమే కాదు.. రైల్వే స్టేషన్ లో గందరగోళాన్ని క్రియేట్ చేసే అంశం వెలుగు చూసింది. ఒక వీడియో షూట్ కోసం ట్రైన్ మీదకు ఎక్కే ప్రయత్నం కూడా చేశారు.

ఇలాంటి విపరీత చర్యలకు చెక్ పెట్టేందుకు వీలుగా తాజాగా రైల్వే బోర్డు సీరియస్ నిర్ణయాల్ని తీసుకుంది. రీల్స్ చేసేందుకు రైల్వే ప్రాంగణాల్ని వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేసింది. రీల్స్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని స్పష్టం చేసింది. కొందరు ఆకతాయిలు హద్దులు దాటారని.. రైల్వే ట్రాకులపై వస్తువుల్ని పెట్టటం.. వాటిపై వాహనాల్ని నడపటం.. కదులుతున్న ట్రైన్లలో డేంజరస్ ఫీట్లు చేయటం లాంటి వాటి పనులతో ప్రాణాల్ని పణంగా పెట్టటమే కాదు.. వందల మంది రైల్వే ప్రయాణికుల భద్రతను ప్రమాదంలో పడేస్తున్నట్లుగా ఒక సీనియర్ అధికారి చెబుతున్నారు. ఏమైనా.. సోషల్ మీడియాలో ఇమేజ్ కోసం ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారిపై ఇలాంటి చర్యలు మంచివే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

This post was last modified on November 16, 2024 10:38 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

2 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

6 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

8 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

9 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

11 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

13 hours ago