రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న సెన్సాఫ్ హ్యుమర్ ను పది మందితో పంచుకోవటానికి చేస్తున్న రీల్స్ అంతకంతకూ విస్తరిస్తూ.. ప్రమాదకర ఫీట్లు చేసేలా చేస్తున్నాయి. సోషల్ ఇమేజ్ ను పెంచుకోవటానికి ప్రమాదకర విన్యాసాలు చేసేందుకు వెనుకాడటం లేదు. ఇలాంటి వారి కారణంగా ట్రైన్లో ప్రయాణించే ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నారు. పలు సందర్భాల్లో ప్రమాదకర విన్యాసాలు చేస్తూ.. ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇలాంటి వారికి చెక్ పెట్టేలా రైల్వే శాఖ సీరియన్ నిర్ణయాన్ని తీసుకుంది.
ఇకపై.. రైల్వే కార్యకలాపాలకు.. ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. అంతేకాదు.. రైళ్లలో ప్రమాదకర రీల్స్ చేస్తూ.. ప్రయానికులకు ఇబ్బంది కలిగించే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కూడా అన్ని జోన్లకు ఆదేశాలు జారీ చేసింది. రైల్వే ట్రాకులు.. కదులుతున్న రైళ్లలో ప్రమాదకర స్టంట్లు చేస్తూ వీడియోలు షూట్ చేసే వారి కారణంగా చోటు చేసుకుంటున్న ప్రమాదకర ఘటనల నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
ఇటీవల జైపూర్ డివిజన్ లో రైల్వే ట్రాకుపై ఒక ఎస్ యూవీ నడిపిస్తూ స్టంట్లు చేస్తున్న వారిపై రైల్వే ప్రొటెక్షన్ పోలీసులు కేసు నమోదు చేయటం తెలిసిందే. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసేందుకు షూట్ చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
నిజానికి ఈ వీడియో షూట్ చేసే వేళలో.. గూడ్స్ రైలు లోకో పైలెట్ అప్రమత్తంగా ఉండటంతో ప్రమాదం తప్పింది. ఇలాంటివే పలు ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. చెన్నైలోని పలువురు కాలేజీ విద్యార్థులు ట్రైన్ ఫుట్ బోర్డు మీద ప్రయాణం చేయటమే కాదు.. రైల్వే స్టేషన్ లో గందరగోళాన్ని క్రియేట్ చేసే అంశం వెలుగు చూసింది. ఒక వీడియో షూట్ కోసం ట్రైన్ మీదకు ఎక్కే ప్రయత్నం కూడా చేశారు.
ఇలాంటి విపరీత చర్యలకు చెక్ పెట్టేందుకు వీలుగా తాజాగా రైల్వే బోర్డు సీరియస్ నిర్ణయాల్ని తీసుకుంది. రీల్స్ చేసేందుకు రైల్వే ప్రాంగణాల్ని వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేసింది. రీల్స్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని స్పష్టం చేసింది. కొందరు ఆకతాయిలు హద్దులు దాటారని.. రైల్వే ట్రాకులపై వస్తువుల్ని పెట్టటం.. వాటిపై వాహనాల్ని నడపటం.. కదులుతున్న ట్రైన్లలో డేంజరస్ ఫీట్లు చేయటం లాంటి వాటి పనులతో ప్రాణాల్ని పణంగా పెట్టటమే కాదు.. వందల మంది రైల్వే ప్రయాణికుల భద్రతను ప్రమాదంలో పడేస్తున్నట్లుగా ఒక సీనియర్ అధికారి చెబుతున్నారు. ఏమైనా.. సోషల్ మీడియాలో ఇమేజ్ కోసం ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారిపై ఇలాంటి చర్యలు మంచివే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
This post was last modified on November 16, 2024 10:38 am
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…
సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు చరిత్రలో…
అఖండ 2 తాండవం వచ్చి తొమ్మిది నెలలు అయిపోయాయి. సీక్వెల్ అందులోనూ బ్లాక్ బస్టర్ కొనసాగింపు కాబట్టి బాలయ్య మరోసారి…