Trends

యూట్యూబ్ తో 43 కోట్లు సంపాదించిన 65 ఏళ్ల మహిళ

మన దేశంలో చాలామంది ఆడవాళ్లు సాధారణంగా ఐదు పదుల వయసు తర్వాత ఏ టీవీ సీరియల్సో చూసుకుంటూ మనవళ్లతో ఆడుకుంటూ కృష్ణారామా అనుకుంటూ కాలం వెళ్లదీస్తుంటారు. అయితే, కాలం మారింది..ట్రెండ్ మారింది..దానికి తగ్గట్లుగా మహిళలకు కూడా వయసుతో సంబంధం లేకుండా వివిధం రంగాల్లో తమ అభిరుచులు, ఆకాంక్షలు నెరవేర్చుకుంటూ రాణిస్తున్నారు. సొంతగా యూట్యూబ్ ఛానెళ్లు రన్ చేసుకుంటూ…వ్యాపకం..వ్యాపారం ద్వారా కోట్లు అర్జిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ కు చెందిన నిషా మధులిక ఆ కోవలోకే వస్తారు. 2011లో యూట్యూబ్ కుకరీ ఛానల్ మొదలుబెట్టిన నిషా దేశంలోనే అత్యంత ధనిక యూట్యూబర్ గా నిలిచారు.

ఉత్తర ప్రదేశ్ కు చెందిన నిషా టీచర్ గా పనిచేసేవారు. 2009లో పిల్లలు తమ ఉద్యోగాల రీత్యా వేర్వేరు చోట్ల స్థిరపడ్డారు. ఆ తర్వాత తన భర్త గుప్తాతో కలిసి నిషా నోయిడాకు షిఫ్ట్ అయ్యారు. ఆ క్రమంలోనే ఉషా..తన వంటల అభిరుచిని వదులుకోకుండా టీచర్ జాబ్ వదిలేసి యూట్యూబ్ కుకరీ ఛానెల్ మొదలుబెట్టారు. ఆ వయసులో యూట్యూబ్ ఛానెల్ మొదలుబెట్టి రన్ చేయడం ఏంటని కొందరు విమర్శించారు. అయినా సరే  విమర్శలను పట్టించుకోకుండా సాంప్రదాయ భారతీయ శాఖాహార వంటకాలను తయారు చేస్తూ వీడియోలు పోస్ట్ చేయడం మొదలుబెట్టింది.

ఆమె రెసిపీలతో పాటు హిందీలో వీడియోలు చేయడం, వంట ఎలా చేయాలో ఆమె చెప్పే విధానం నచ్చి అనతి కాలంలోనే సబ్ స్క్రైబర్లు భారీగా పెరిగారు. దీంతో, భారతదేశంతోపాటు విదేశాలలో ఆమె కుకరీ ఛానెల్ కు అభిమానులు మిలియన్లలో చేరిపోయారు. ప్రస్తుతం ఆమె ఛానెల్‌కు 14.5 మిలియన్ల మంది సబ్ స్క్రైబర్లున్నారు. 2,300 కంటే ఎక్కువ వీడియోలను ఆమె పోస్ట్ చేశారు. సరళమైన భాష, సులభమైన పద్ధతులలో వంటలను పోస్ట్ చేయడంతో చాలామంది యువత ఆమెకు కనెక్ట్ అయ్యారు. ఆ రకంగా యూట్యూబ్ ఛానెల్ తో లేటు వయసులో కెరీర్ మొదలుబెట్టిన నిషా 65 ఏళ్ల వయసులో 43 కోట్ల రూపాయల సంపాదనతో ప్రస్తుతం దేశంలోనే రిచెస్ట్ యూట్యూబర్ గా నిలిచారు. నిషా ప్రస్తుతం పలు ఫుడ్ వెబ్ సైట్లను కూడా రన్ చేస్తున్నారు.

This post was last modified on November 13, 2024 2:48 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

కొత్త ట్విస్టు… కేరళ స్టోరీ 2 వస్తోంది

స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…

2 hours ago

డీఎంకే స్ట్రోక్… బీజేపీకి షాక్!

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాల‌ని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ త‌గిలింది.…

2 hours ago

జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…

4 hours ago

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న…

4 hours ago

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…

5 hours ago

బాబు ఎఫెక్ట్.. ఏపీకి మరో బడా కంపెనీ

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వ‌స్తున్న సంస్థ‌లు కూట‌మి ప్ర‌భుత్వం ప‌ట్ల‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ట్ల అత్యంత విశ్వ‌స‌నీయ‌త ప్ర‌ద‌ర్శిస్తున్న విష‌యం…

5 hours ago