మన దేశంలో చాలామంది ఆడవాళ్లు సాధారణంగా ఐదు పదుల వయసు తర్వాత ఏ టీవీ సీరియల్సో చూసుకుంటూ మనవళ్లతో ఆడుకుంటూ కృష్ణారామా అనుకుంటూ కాలం వెళ్లదీస్తుంటారు. అయితే, కాలం మారింది..ట్రెండ్ మారింది..దానికి తగ్గట్లుగా మహిళలకు కూడా వయసుతో సంబంధం లేకుండా వివిధం రంగాల్లో తమ అభిరుచులు, ఆకాంక్షలు నెరవేర్చుకుంటూ రాణిస్తున్నారు. సొంతగా యూట్యూబ్ ఛానెళ్లు రన్ చేసుకుంటూ…వ్యాపకం..వ్యాపారం ద్వారా కోట్లు అర్జిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ కు చెందిన నిషా మధులిక ఆ కోవలోకే వస్తారు. 2011లో యూట్యూబ్ కుకరీ ఛానల్ మొదలుబెట్టిన నిషా దేశంలోనే అత్యంత ధనిక యూట్యూబర్ గా నిలిచారు.
ఉత్తర ప్రదేశ్ కు చెందిన నిషా టీచర్ గా పనిచేసేవారు. 2009లో పిల్లలు తమ ఉద్యోగాల రీత్యా వేర్వేరు చోట్ల స్థిరపడ్డారు. ఆ తర్వాత తన భర్త గుప్తాతో కలిసి నిషా నోయిడాకు షిఫ్ట్ అయ్యారు. ఆ క్రమంలోనే ఉషా..తన వంటల అభిరుచిని వదులుకోకుండా టీచర్ జాబ్ వదిలేసి యూట్యూబ్ కుకరీ ఛానెల్ మొదలుబెట్టారు. ఆ వయసులో యూట్యూబ్ ఛానెల్ మొదలుబెట్టి రన్ చేయడం ఏంటని కొందరు విమర్శించారు. అయినా సరే విమర్శలను పట్టించుకోకుండా సాంప్రదాయ భారతీయ శాఖాహార వంటకాలను తయారు చేస్తూ వీడియోలు పోస్ట్ చేయడం మొదలుబెట్టింది.
ఆమె రెసిపీలతో పాటు హిందీలో వీడియోలు చేయడం, వంట ఎలా చేయాలో ఆమె చెప్పే విధానం నచ్చి అనతి కాలంలోనే సబ్ స్క్రైబర్లు భారీగా పెరిగారు. దీంతో, భారతదేశంతోపాటు విదేశాలలో ఆమె కుకరీ ఛానెల్ కు అభిమానులు మిలియన్లలో చేరిపోయారు. ప్రస్తుతం ఆమె ఛానెల్కు 14.5 మిలియన్ల మంది సబ్ స్క్రైబర్లున్నారు. 2,300 కంటే ఎక్కువ వీడియోలను ఆమె పోస్ట్ చేశారు. సరళమైన భాష, సులభమైన పద్ధతులలో వంటలను పోస్ట్ చేయడంతో చాలామంది యువత ఆమెకు కనెక్ట్ అయ్యారు. ఆ రకంగా యూట్యూబ్ ఛానెల్ తో లేటు వయసులో కెరీర్ మొదలుబెట్టిన నిషా 65 ఏళ్ల వయసులో 43 కోట్ల రూపాయల సంపాదనతో ప్రస్తుతం దేశంలోనే రిచెస్ట్ యూట్యూబర్ గా నిలిచారు. నిషా ప్రస్తుతం పలు ఫుడ్ వెబ్ సైట్లను కూడా రన్ చేస్తున్నారు.
This post was last modified on November 13, 2024 2:48 pm
ఐపీఎల్-2026లో అత్యధిక క్రేజ్ దక్కించుకున్న మ్యాచ్లలో సన్రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరు ఒకటి. మే 22న ఉప్పల్లోని రాజీవ్…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది ప్రమోషన్లలో జాన్వీ కపూర్ కనిపించకపోవడం గురించి సోషల్ మీడియాలో రకరకాల అర్థాలు తీస్తున్నారు.…
ఏపీలో టీడీపీ సారథ్యంలో కొనసాగుతున్న కూటమి సర్కారు దూకుడు ప్రదర్శిస్తోంది. రాష్ట్రాన్ని అభివృద్ది బాట పట్టించే విషయంలో ప్రత్యేకించి రాష్ట్రానికి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవలే శస్త్ర చికిత్స తీసుకుని… అనంతరం స్వల్ప వ్యవధి విశ్రాంతి…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను తాజా పరిచే కార్యక్రమానికి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుక్రవారం తనదైన శైలిలో అన్ని అంశాలపై కూలంకషంగానే స్పందించారు. అనారోగ్యం…